ఆరు సంవత్సరాల నాటి స్మృతి చిత్రమ్
2016 ఏప్రిల్ 10న ఢిల్లీ తెలుగు అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది ఉత్సవాల్లో నేను రచించిన "అమరావతి నృత్య బాలే ను ప్రదర్చిండానికి కార్యదర్శి నాగరాజు గారు ఆహ్వానించారు . అదే సందర్భగా నాకు, నృత్య కళాకారిణి క్రాంతి నారాయణకు ఉగాది పురస్కారాలను కూడా ప్రకటించారు . ఈ అవార్డును అప్పటి మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు ప్రదానం చేశారు . అమరావతి నృత్య బాలే కు ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన వచ్చింది
తరువాత రోజు అంటే ఏప్రిల్ 11న ఆగ్రా వెళ్ళాను . ఆగ్రా ఫోర్ట్ ను , తాజ్ మహల్ ను సందర్శించాను . అవి మర్చిపోలేని క్షణాలు .
Comments
Post a Comment