ఆత్మీయ అతిధిగా గత నెల 29న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గిడుగు రామ మూర్తి పంతులు ఫౌండేషన్, శంకరం ఫౌండేషన్ సంయుక్తంగా గిడుగు జాతీయ పురస్కారాలప్రదానోత్సవాన్ని నిర్వహించారు . మీర్జాపురంరాణి కృష్ణవేణి పుస్తకాన్ని ప్రచురించిన నిర్మాత ఎన్ .ఆర్. అనురాధా దేవి గారిని జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించారు. నటి, నిర్మాత , గాయకురాలు శ్రీమతి కృష్ణవేణి కుమార్తె అనురాధాదేవి. శ్రీమతి కృష్ణవేణి 1949లో 'మనదేశం 'సినిమాలో నందమూరి తారకరామారావు గారిని సినిమా రంగానికి పరిచయం చేశారు , ఆ సినిమాకు తన సహాయం ఉండదని రాజావారు చెప్పారు. అయినా సరే మహాత్మా గాంధీ గారి స్పూర్తితో దేశ భక్తి సినిమాను కృష్ణవేణి గారు రూపొందించారు. శోభనచల బేనర్ లేకుండా తన కుమార్తె అనురాధాదేవి పేరుతో ఎమ్ .ఆర్ .ఏ (మేకా రాజ్యలక్ష్మి అనురాధ ) బేనర్ ఏర్పాటుచేసి 'మనదేశం 'చిత్రాన్ని నిర్మించారు. ఆ విధంగా ఎన్ .టి .ఆర్ . తొలి సినిమాతో అనురాధాదేవి గారికి వున్న అనుబంధనాన్ని ఆత్మీయ అతిధిగా పాల్గొన్న నేను ఈ సభలో వివరించడం జరిగింది .