రాజబాబు 69 జయంతి మిత్రుడు బొడ్డు రాజుబాబు 69వ స్మారక అవార్డుల కార్యక్రమం శనివారం నాడు హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో జరిగింది. వివిధ రంగాలలో నిష్ణాతులైన ప్రముఖ వ్యక్తులను ఈ సందర్భంగా నిర్వాహకులు సత్కరించాము . రాజ బాబు మిత్ర బృందం కాకాని బ్రహ్మం , నాగేశ్వర రావు ,నర్రా వెంకట రావు , బాలాజీ, కుమార్ , కుటుంబ సభ్యులు రమేష్,వీరన్న తో పాటు నేను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాను . రాజబాబు స్మారక అవార్డులను మా ఎన్ .టి .ఆర్ . కమిటీ చైర్మన్ ,టి డి .జనార్దన్ , దర్శకుడు ఎ. కోదండ రామిరెడ్డి,నటులు ప్రదీప్, కాదంబరి కిరణ్ కుమార్, కోట శంకర రావు, సీనియర్ జర్నలిస్ట్ భావన్నారాయణ , నటీ గీతా భాస్కర్, విద్యావేత్త మేఘన ముసునూరి, నటుడు శశాంక్ స్వీకరించారు . ఈ కార్యక్రమంలో తుమ్మల రంగారావు , దర్శకులు బి .గోపాల్, వీర శంకర్, ఎస్ .పి .నాగేశ్వర రావు, చుక్కా కొండయ్య, కోటి రెడ్డి , మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు .
పోస్ట్లు
- లింక్ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్లు
భగీరథ "నాగలాదేవి" చరిత్రకు వీరతిలకం నాగలాదేవి , శ్రీకృష్ణదేవరాయల ప్రేమ కథ. నేను రచించిన చారిత్రాత్మక నవల. అప్పటి ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు ముందుమాట వ్రాశారు . అప్పటి ప్రతిపక్ష నాయకుడు శ్రీ నారా చంద్ర బాబు నాయుడు గారు ఆవిష్కరించారు . ఈ నవలను బళ్లారిలోని పాఠ్య గ్రంథంగా ఉంది . శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో బిఎస్సీ విద్యార్థులకు పాఠ్య గ్రంథంగా ఉంది . హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో నా సాహిత్యంపై పరిశోధన జరుగుతుంది . బళ్లారిలో డాక్టర్ ఆర్ .దేవన్న 'నాగలాదేవి ' నవలను కన్నడంలోకి అనువదిస్తున్నారు . చీరాల మిత్రుడు డాక్టర్ బీరం సుందర్ రావు గారు "నాగలా దేవి" పుస్తకం గురించి రాసిన అద్భుతమైన సమీక్ష, మీ కోసం ...! ఒక కథనో, నవలనో, పుస్తకాన్నో చదివాక హర్షం వర్షమై గుండెను తడపాలి. చదివిన ప్రతి ఘట్టంలోనో , సన్నివేశంలోనో తీయని అనుభూతి మనల్ని వెంటాడాలి . దృశ్యం వెంట దృశ్యం మనల్ని వేగంగా నడిపించుకుంటూ కథ వెంట పరుగు తీయించాలి . చరిత్ర పొరల్లో దాగిన రసమయ గాథను చదువుతుంటే మనసు నవరసభరితమై, ఆనంద తాండవం చేయాలి . భాష, భావం కలగలిపి, వర్ణనలతో జతకలసి, కల్పన...
- లింక్ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్లు
రామానాయుడు గారు @ 90 ఈరోజు పద్మభూషణ్ , మూవీ మొఘల్, దాదాసాహెబ్ ఫాల్కే డి .రామానాయుడు గారి 90వ జయంతి రామానాయుడు గారు మనకు దూరమై అప్పుడే 11 సంవత్సరాలు అవుతుంది . అయినా వారి జ్ఞాపకాలు మన మనస్సులో పదిలంగానే ఉన్నాయి . భారతీయ సినిమా చరిత్రలో రామానాయుడు గారిది ఓ సువర్ణ అధ్యాయం . భారతీయ భాషల్లో అనేక చిత్రాలను నిర్మించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్న ఏకైక నిర్మాత రామానాయుడు గారు . నిర్మాతగా , స్టూడియో, ల్యాబ్, రికార్డింగ్ , డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్, పోస్టర్స్ ప్రింటింగ్, గ్రాఫిక్ సంస్థల అథినేతగా ఆయన బహుముఖాలుగా ఎదిగారు . రామానాయుడు గారు బాపట్ల పార్లమెంట్ సభ్యుడుగా తమ మాతృ భూమి ఋణం తీర్చుకోవడానికి కోట్ల రూపాయల స్వంత డబ్బు ఖర్చు చేసిన మానవతావాది . రామానాయుడు గారితో నాకు ఎన్నో మధుర స్మృతులు ఉన్నాయి . నాయుడు గారు నాకు ప్రాతః స్మరణీయులు.
- లింక్ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్లు
దర్శకుడు కృష్ణారెడ్డి @ 65 ఈరోజు దర్శకుడు ఎస్ .వి కృష్ణ రెడ్డి గారి 65వ పుట్టిన రోజు . తెలుగు సినిమా రంగంలో కృష్ణా రెడ్డి గారిది ప్రత్యేకమైన శైలి . అసభ్యత , అశ్లీలత లేకుండా కుటుంబ సమేతంగా చూడతగ్గ 42 ఆరోగ్యకరమైన , వినోదాత్మక చిత్రాలను తెలుగు వారికీ అందించారు . ఆయన తాజా చిత్రం 'వేదవ్యాస్ '. కృష్ణా రెడ్డి కి చిన్నప్పటి నుంచి నటుడు కావాలనే కోరిక ఉండేది . మద్రాసువెళ్లి 'పగడాల పడవ ' అనే చిత్రం లో నటించారు . కానీ ఆ చిత్రం విడుదల కాలేదు . అదే సమయంలో చిన్ననాటి మిత్రుడు అచ్చి రెడ్డి ఆసరాగా నిలబడ్డారు . ఇద్దరూ హైదరాబాద్ వచ్చి వ్యాపారం చేస్తూ 1991లో 'కొబ్బరి బొండం 'అనే చిత్రం తో నిర్మాణంలో అడుగు పెట్టారు . ఆ సినిమా విజయవంతమయ్యింది . 1993లో కృష్ణారెడ్డి దర్శకుడుగా 'రాజేంద్రుడు - గజేంద్రుడు ' రూపొందింది . ఆ సినిమా విజయం సాధించింది . ఆ వెంటనే 'మాయలోడు ' సినిమా రూపొందింది . ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది . ఆ తరువాత నెంబర్ వన్ , యమలీల , శుభ లగ్నం , టాప్ హీరో , వజ్రం , ఘటోత్కచుడు, గన్ షాట్, వినోదం , మావిచిగురు ... ఇలా కృష్ణారెడ్డి విజయ పరంపర...
- లింక్ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్లు
సూపర్ స్టార్ కృష్ణ 83వ జయంతి ఘట్టమనేని శివ రామ కృష్ణ మూర్తి అనే సూపర్ స్టార్ కృష్ణ జయంతి నేడు . రాఘవయ్య చౌదరి , నాగరత్నమ్మ దంపతులకు 1943 మే 31న తెనాలిలో ని బుర్రిపాలెం గ్రామంలో జన్మించారు . కృష్ణ కు చిన్నప్పటి నుంచి నటుడు కావాలనే కోరిక ఉండేది. చదువు పూర్తి అయిన తరువాత మద్రాసు వచ్చాడు . 1962లో వ్. మధుసూదన రావు దర్శకత్వం వహించిన 'పదండి ముందుకు' అనే సినిమాలో చిన్న వేషం వేశారు . ఈ సినిమాను కొంగర జగ్గయ్య నిర్మించి ప్రధాన పాత్రలో నటించారు . అదే సంవత్సరం అక్కినేని నాగేశ్వర రావు కథానాయకుడుగా కె .ప్రత్యగాత్మ దర్శకత్వం వహించి 'కుల గోత్రాలు ' సినిమాలో కూడా చిన్న పాత్రలో నటించారు . 1963లో ఎన్ .టి .ఆర్ .కథానాయకుడుగా మానాపురం అప్పారావు దర్శకత్వం వహించిన 'పరువు - ప్రతిష్ఠ ' చిత్రంలో కూడా కృష్ణకు చిన్న పాత్రే లభించింది . ఆ తరువాత కొంతకాలం వేచి వున్నారు . 1965లో ఆదుర్తి సుబ్బారావు 'తేనే మనసులు ' అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తూ కృష్ణకు కథానాయకుడుగా అవకాశం కల్పించారు . అయితే అప్పుడు సినిమా పంపిణీదారులు కొత్త హీరో వద్దు , పాత వారిని పెట్టమని ఆదుర్తి మీద వత్...
- లింక్ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్లు
'అక్షరాంజలి' పుస్తకావిష్కరణ జ్ఞాపకాలు నేను రచించిన రెండవ కవితా సంపుటి 'అక్షరాంజలి ' ని అప్పటి మద్రాస్ గవర్నర్ శ్రీ కొణిజేటి రోశయ్య గారు. 2015 జూన్ 1వ తేదీన హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో దీనిని ఆవిష్కరించారు . నా 'మానవత' పుస్తకం కూడా 1980 జూన్ 1వ తేదీనే శ్రీశ్రీ గారు హైదరాబాద్ లో ఆవిష్కరించారు . అప్పుడు శ్రీ శ్రీ గారు మద్రాసు నుంచి హైదరాబాద్ కు వచ్చి పుస్తకాన్ని ఆవిష్కరించారు . అక్షరాంజలి కవితా సంపుటిని కూడా గవర్నర్ రోశయ్య గారు మద్రాసు నుంచి వచ్చి జూన్ 1న ఆవిష్కరించారు . బహుశ ఇలా జరగడం మాత్రం యాదృచ్చికం కావచ్చు , కానీ నాకు మాత్ర రెండు మధుర జ్ఞాపకాలుగా మిగిలాయి . అక్షరాంజలి వెలుగు చూడటానికి కారకులు నిర్మాత శ్రీ కళ్యాణ్ గారు . దీనిని డాక్టర్ కె .వి . రమణాచారి గారికి అంకితం చేశాను . అప్పటి ఆంధ్ర ప్రదేశ్ శాసన సభాపతి డాక్టర్ కోడెల శివ ప్రసాద్ గారు ముఖ్య అతిధిగా వచ్చారు . మా నాగండ్ల ప్రముఖులు శ్రీ చెరుకూరి హరి ప్రసాద్ గారు , శ్రీ పుల్లెల గోపీచంద్ గారు ప్రత్యేక అతిధులుగా విచ్చేశారు . డాక్టర్ కె .వి .కృష్ణకుమారి , డాక్టర్ శ్రీనివాస రెడ్డి , డాక్టర్ ఉమాపతి వర్మ ...
- లింక్ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్లు
"మానవత"కు 46 సంవత్సరాలు నేను రచించిన కవితా సంపుటి "మానవత "కు 46సంవత్సరాలు అయ్యిందంటే చాలా ఆశ్చర్యంగా ఉంది . అప్పుడే ఇన్ని సవత్సరాలు గడిచిపోయాయి? "మానవత" నా తొలి పుస్తకం . దీనికి మహాకవి శ్రీ శ్రీ ముందుమాట వ్రాసి , స్వయంగా హైదరాబాద్ వచ్చి ఆవిష్కరించారు . నా సాహిత్య జీవితానికి 'మానవత ' నాంది పలికింది . 1980 జూన్ 1వ తేదీన ఉదయం 10.00 గంటలకు హైదరాబాద్ అశోక్ నగర్ లోని నగర కేంద్ర గ్రంధాలయ సంస్థలో 'మానవత ' పుస్తకావిష్కరణ సభను కిన్నెర ఆర్ట్ థియేటర్స్ రఘురామ్ ఏర్పాటు చేశారు . నాటి సభలో ఆనాటి హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీ ఆవుల సాంబశివరావు గారు , నిర్మాత దర్శకులు యు .విశేశ్వర రావు గారు , సీనియర్ జర్నలిస్ట్ శ్రీ జి. ఎస్. వరదాచారి, గురువు శ్రీ ఆచార్య తిరుమల , హై కోర్టు లాయర్ శ్రీ అడుసుమిల్లి పాండురంగారావు గారు పాల్గొన్నారు. ఇదొక మర్చిపోలేని మధుర జ్ఞాపకం . 'ఈ భగీరథ ప్రయత్నాన్ని ఎవరైనా అభినందిస్తారు , ముందుగా నాకా అవకాశం వచ్చింది ' అని మహాకవి శ్రీ శ్రీ పేర్కొన్నారు . ఈ సభలో నిర్మాత దర్శకుడు పి .పుల్లయ్య పాల్గొని "ఒరే అబ్బాయి నీకు గ...