పోస్ట్‌లు

చిత్రం
  పద్మశ్రీ పురస్కార గ్రహీతలకు ప్రధాని అభినందనలు   పద్మ అవార్డుల రెండవ విడత ప్రదానోత్సవం మంగళవారం రాష్ట్రపతి భవన్ లో అత్యంత వైభవంగా జరిగింది . రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 65 మంది ప్రముఖులకు ఈ అవార్డులను ప్రదానం  చేశారు . ఇందులో ఇద్దరు పద్మ విభూషణ్ , ఏడుగురు పద్మ భూషణ్ , 56మంది పద్మశ్రీ పురస్కారాన్ని స్వీకరించారు .  న్యూ ఢిల్లీ రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ , ప్రధాని నరేంద్ర మోడీ , లోక సభాపతి ఓం బిర్లా , మాజీ రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ , హోమ్ మంత్రి అమిత్ షా , విమాన శాఖా మంత్రి కె .రామ మోహన్ నాయుడు , కేంద్ర మంత్రి బండి సంజయ్ తదితరులు హాజరయ్యారు . ఈసారి పద్మశ్రీ పురస్కారాన్ని నటులు మాగంటి మురళీ మోహన్ , గద్దె రాజేంద్ర ప్రసాద్ స్వీకరించారు. సినిమా రంగంలో వీరు సాధించిన విజయానికి ఈ అవార్డు లభించింది .  2026 పద్మ పురస్కార గ్రహీతల జీవితం ఎంతో  స్ఫూర్తిదాయకమని  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు.  జూన్ 23న రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్న ప్రధాని మోడీ అందరినీ  అభినందించారు .  రాష్...
చిత్రం
  అభ్యుదయ దర్శకుడు, అసమాన దార్శనికుడు   గూడవల్లి రామబ్రహ్మం   తెలుగు సినిమా చరిత్రలో గూడవల్లి రామ బ్రహ్మం గారిది  ఓ సంచలన అధ్యాయం.  సినిమా కేవలం వినడా సాధనం మాత్రమే కాదు, దీని ద్వారా సామాజిక ప్రయోజనం సాధించవచ్చునని నిరూపించిన అభ్యుదయ దర్శకుడు రామ బ్రహ్మం. ఆయన మొదట జర్నలిస్ట్ , ఆ తరువాత సినిమా దర్శకుడు.  ఈ రెండు మాధ్యమాల ద్వారా ప్రజలను చైతన్యవంతులను  చేయాలని నిరంతరం కృషి చేసిన అభ్యుదయ మూర్తి , చైతన్య స్ఫూర్తి రామ బ్రహ్మం. ఆయన   జూన్ 24, 1898 న కృష్ణా జిల్లా, ఉంగుటూరు మండలము నందమూరు గ్రామంలో గూడవల్లి వెంకయ్య, బాపమ్మలకు  జన్మించాడు.  ఆయన చదువు ఇందుపల్లి, గుడివాడ, బందరులలో సాగింది. చిన్నప్పటి నుంచి ఎంతో చురుకుగా ఉండేవాడు .  18 ఏళ్ళ వయసులో  కోగంటి నాగయ్య కుమార్తె శారదాంబతో రామ బ్రహ్మానికి వివాహం జరిగింది.మామ గారి ఇంట్లో  కొన్నాళ్ళు ఉండి గాంధీ గారి పిలుపుతో సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నాడు. 1924లో విజయవాడలో ఫ్రెండ్స్ అండ్ కో అనే పేరుతో ఒక గడియారాల వ్యాపారం ప్రారంభించాడు. అయితే అక్కడ వ్యాపారం స్నేహితులతో , రాజకీయ ...
చిత్రం
సావేరి 'నిష్ఫల ప్రేమ'.     మేల్ ప్రాస్టిట్యూషన్ గురించి తెలుగు సాహిత్యంలో వచ్చిన నవలలు చాలా అరుదు. ఈ నేపథ్యంతో నవల రాయడం సాహసమే. ఇటువంటి సాహసాన్నిసీనియర్  జర్నలిస్ట్ మరియు రచయిత అయిన భగీరథ గారు తన రెండో నవల  ‘సావేరి’ ద్వారా చేశారు. ఈ నవల ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడింది. 2010 లో నవలగా వెలువడింది. ఈ సంస్కృతి గురించి అప్పట్లో దిన పత్రికలో వచ్చిన ఓ వార్త ఆధారంగా ఈ నవలను రాసినట్టు రచయిత తన ముందుమాటలో పేర్కొన్నారు. అలాగే ఈ సావేరి కథను సినిమాగా తీయాలని నటి జయసుధ గారు అనుకున్నప్పటికి అది సాధ్యపడలేదని కూడా రాశారు.  కలకత్తా వేదికగా ఈ కథ జరిగినా, ఈ కథ ద్వారా మనసులు మలీనం కానంతవరకు శరీరాలు కావు అని చెప్పే ప్రయత్నం చేసినా ఆ సూత్రం ఒక్క శ్రీరాజ్ పాత్రకు మాత్రమే వర్తించి, గీతాంజలి పాత్రకు అంతగా వర్తించలేదేమో అనిపిస్తుంది.  శ్రీరాజ్ అనే యువకుడు అమెరికాలో  విద్య పూర్తి చేసుకుని  హైదరాబాద్ లో స్థిరపడతాడు. ఒక  ఎలక్ట్రానిక్ కంపెనీలో  సాంకేతిక సలహాదారుడుగా  నియమితులవుతాడు. ఆ సందర్భంగా పరిచయాలు పెంచుకొవడానికి  స్టార్ హోటల్ లో  ఓ పార్...
చిత్రం
  రాజబాబు 69 జయంతి  మిత్రుడు బొడ్డు  రాజుబాబు 69వ స్మారక  అవార్డుల కార్యక్రమం శనివారం నాడు హైదరాబాద్  ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో  జరిగింది. వివిధ రంగాలలో నిష్ణాతులైన ప్రముఖ వ్యక్తులను ఈ సందర్భంగా నిర్వాహకులు సత్కరించాము .  రాజ బాబు మిత్ర బృందం కాకాని బ్రహ్మం , నాగేశ్వర రావు ,నర్రా  వెంకట రావు , బాలాజీ, కుమార్ , కుటుంబ సభ్యులు రమేష్,వీరన్న తో పాటు నేను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాను .  రాజబాబు స్మారక అవార్డులను మా ఎన్ .టి .ఆర్ . కమిటీ చైర్మన్ ,టి డి .జనార్దన్ , దర్శకుడు ఎ. కోదండ రామిరెడ్డి,నటులు  ప్రదీప్, కాదంబరి కిరణ్ కుమార్,  కోట శంకర రావు, సీనియర్ జర్నలిస్ట్ భావన్నారాయణ , నటీ గీతా భాస్కర్, విద్యావేత్త మేఘన ముసునూరి, నటుడు శశాంక్ స్వీకరించారు  .  ఈ కార్యక్రమంలో తుమ్మల రంగారావు , దర్శకులు బి .గోపాల్, వీర శంకర్, ఎస్ .పి .నాగేశ్వర రావు, చుక్కా కొండయ్య, కోటి రెడ్డి , మల్లికార్జున్   తదితరులు పాల్గొన్నారు .
చిత్రం
  భగీరథ "నాగలాదేవి" చరిత్రకు వీరతిలకం  నాగలాదేవి , శ్రీకృష్ణదేవరాయల ప్రేమ కథ.  నేను రచించిన చారిత్రాత్మక నవల. అప్పటి ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు ముందుమాట వ్రాశారు . అప్పటి ప్రతిపక్ష నాయకుడు శ్రీ నారా చంద్ర బాబు నాయుడు గారు ఆవిష్కరించారు .  ఈ నవలను బళ్లారిలోని పాఠ్య గ్రంథంగా ఉంది . శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో బిఎస్సీ విద్యార్థులకు పాఠ్య గ్రంథంగా ఉంది . హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో నా సాహిత్యంపై పరిశోధన జరుగుతుంది . బళ్లారిలో డాక్టర్ ఆర్ .దేవన్న 'నాగలాదేవి ' నవలను కన్నడంలోకి అనువదిస్తున్నారు . చీరాల మిత్రుడు డాక్టర్ బీరం సుందర్ రావు గారు "నాగలా దేవి" పుస్తకం గురించి రాసిన అద్భుతమైన సమీక్ష, మీ కోసం ...! ఒక కథనో, నవలనో, పుస్తకాన్నో చదివాక హర్షం వర్షమై గుండెను తడపాలి. చదివిన ప్రతి ఘట్టంలోనో , సన్నివేశంలోనో తీయని అనుభూతి మనల్ని వెంటాడాలి .  దృశ్యం వెంట దృశ్యం మనల్ని వేగంగా నడిపించుకుంటూ కథ వెంట పరుగు తీయించాలి . చరిత్ర పొరల్లో దాగిన రసమయ గాథను చదువుతుంటే మనసు నవరసభరితమై, ఆనంద తాండవం చేయాలి .  భాష, భావం కలగలిపి, వర్ణనలతో జతకలసి, కల్పన...
చిత్రం
  రామానాయుడు గారు @ 90 ఈరోజు పద్మభూషణ్ , మూవీ మొఘల్, దాదాసాహెబ్ ఫాల్కే డి .రామానాయుడు గారి 90వ జయంతి  రామానాయుడు గారు మనకు దూరమై అప్పుడే 11 సంవత్సరాలు అవుతుంది . అయినా వారి జ్ఞాపకాలు మన మనస్సులో పదిలంగానే ఉన్నాయి . భారతీయ సినిమా చరిత్రలో రామానాయుడు గారిది ఓ సువర్ణ అధ్యాయం .  భారతీయ భాషల్లో అనేక  చిత్రాలను నిర్మించి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్న ఏకైక నిర్మాత రామానాయుడు గారు . నిర్మాతగా , స్టూడియో, ల్యాబ్‌, రికార్డింగ్‌ , డిస్ట్రిబ్యూషన్‌, ఎగ్జిబిషన్‌, పోస్టర్స్ ప్రింటింగ్‌, గ్రాఫిక్‌  సంస్థల అథినేతగా ఆయన బహుముఖాలుగా ఎదిగారు .  రామానాయుడు గారు బాపట్ల పార్లమెంట్ సభ్యుడుగా తమ మాతృ భూమి ఋణం తీర్చుకోవడానికి కోట్ల రూపాయల స్వంత డబ్బు  ఖర్చు చేసిన మానవతావాది . రామానాయుడు గారితో నాకు ఎన్నో మధుర స్మృతులు ఉన్నాయి . నాయుడు గారు  నాకు ప్రాతః స్మరణీయులు. 
చిత్రం
  దర్శకుడు కృష్ణారెడ్డి  @ 65 ఈరోజు దర్శకుడు ఎస్ .వి కృష్ణ రెడ్డి గారి 65వ పుట్టిన రోజు . తెలుగు సినిమా రంగంలో కృష్ణా రెడ్డి గారిది ప్రత్యేకమైన శైలి . అసభ్యత , అశ్లీలత  లేకుండా కుటుంబ  సమేతంగా చూడతగ్గ 42 ఆరోగ్యకరమైన , వినోదాత్మక చిత్రాలను తెలుగు వారికీ అందించారు . ఆయన తాజా చిత్రం 'వేదవ్యాస్ '.  కృష్ణా రెడ్డి కి చిన్నప్పటి నుంచి నటుడు కావాలనే కోరిక ఉండేది . మద్రాసువెళ్లి 'పగడాల పడవ ' అనే చిత్రం లో నటించారు . కానీ ఆ చిత్రం విడుదల కాలేదు .  అదే సమయంలో చిన్ననాటి మిత్రుడు అచ్చి రెడ్డి ఆసరాగా నిలబడ్డారు . ఇద్దరూ హైదరాబాద్ వచ్చి  వ్యాపారం చేస్తూ 1991లో 'కొబ్బరి బొండం 'అనే చిత్రం తో నిర్మాణంలో అడుగు పెట్టారు . ఆ సినిమా విజయవంతమయ్యింది . 1993లో కృష్ణారెడ్డి దర్శకుడుగా 'రాజేంద్రుడు - గజేంద్రుడు ' రూపొందింది . ఆ సినిమా విజయం సాధించింది . ఆ వెంటనే 'మాయలోడు ' సినిమా రూపొందింది . ఈ సినిమా కూడా  సూపర్ హిట్ అయ్యింది .  ఆ తరువాత  నెంబర్ వన్ , యమలీల , శుభ లగ్నం , టాప్ హీరో , వజ్రం , ఘటోత్కచుడు, గన్ షాట్, వినోదం , మావిచిగురు ... ఇలా కృష్ణారెడ్డి విజయ పరంపర...