ఇచ్చిన మాట నిలబెట్టుకున్న డాక్టర్ వై .ఎస్ .ఆర్ . ఈరోజు ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై .ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి 77వ జయంతి. రాజశేఖర్ రెడ్డి గారి వ్యక్తిత్వం ఎంత సమున్నతమైనదో, ఇచ్చిన మాటను ఎలా నిలబెట్టుకున్నారో ఈ సంఘటన తెలియజేస్తుంది . 2004లో మే 14న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారుప్రమాణ స్వీకారం చేశారు . అప్పుడు వారు సోమాజిగూడలోని రాజ్భవన్ రోడ్డులో ఉన్న లేక్ వ్యూ గెస్ట్ హౌస్ నుంచి తన అధికార కార్యక్రమాలను నిర్వహించేవారు. 1978లో ఫిలిం నగర్ కు అంకురార్పణ జరిగింది. 1984- 85 వరకు చిత్ర పరిశ్రమ హైద్రాబాద్లో సంపూర్ణంగా స్థిరపడింది. నిర్మాత, దర్శకుడు వి .బి .రాజేంద్ర ప్రసాద్ గారు చైర్మన్ గా 2004 జులై 14న 'ఫిలిం నగర్ దైవ సన్నిధానం ' పేరుతో దేవాలయం ప్రారంభమైంది. అక్టోబర్ మొదటి వారంలో ఈ దేవాలయ సందర్శనకు ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారిని ఆహ్వానించడానికి రాజేంద్ర ప్రసాద్ గారితో పాటు నేను కూడా లేక్ వ్యూ గెస్ట్ హౌస్ కు వెళ్ళాను. మాకు అప్పటి సమాచార శాఖ కమీషనర్ డాక్...