దాశరథి కృష్ణమాచార్య 101వ జయంతి. ఈరోజుమహాకవి దాశరథి కృష్ణమాచార్య 101వ జయంతి. ఉర్దూలో మెట్రిక్యులేషను, తరువాత భోపాల్ విశ్వవిద్యాలయంలో ఇంటర్మీడియెట్, ఉస్మానియా విశ్వవిద్యాలయం లో ఇంగ్లీషు సాహిత్యంలో బి.ఎ చదివాడు. తెలుగు, సంస్కృతం, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో మంచి పండితుడు. చిన్నతనంలోనే పద్యం చెప్పడంలో ప్రావీణ్యం సంపాదించాడు.. ఆశువుగా కవితలు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచేవాడు . చదువుకునే రోజుల నుంచే బానిసత్వాన్ని నిరసించేవాడు . నిజాం పాలనకు వ్యతిరేకంగా కలం తో నినదించారు . ప్రభుత్వానికి వ్యతిరేకంగా కవిత్వం వ్రాస్తున్నడని 1947లో ఆయన్ని జైలులో పెట్టారు . అయినా నిజాం అరాచకాలను ఖండిస్తూ జైలు గోడల మీద కవితలు వ్రాస్తూనే వున్నారు . "ఓ నిజాము పిశాచమా! కానరాడు నిన్నుబోలిన రాజు మాకెన్నడేని, తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రతనాల వీణ!" అని నిజాముపై నిప్పులు కురిపించిన మహాకవి దాశరథి కృష్ణమాచార్య . అలాగే తెలుగు గురించి ... "ఎవరు కాకతి! ఎవరు రుద్రమ! ఎవరు రాయలు! ఎవరు సింగన! అంతా నేనే! అన్నీ నేనే! అలుగు నేనే...