పోస్ట్‌లు

చిత్రం
  ఎన్ .టి .ఆర్ తో అపురూప జ్ఞాపకం  1991లో ఎన్ .టి.ఆర్ నటించి, దర్శకత్వం వహించిన  "బ్రహ్మర్షి విశ్వామిత్ర" చిత్రం షూటింగ్ హైదరాబాద్ నాచారం లోని రామకృష్ణ స్టూడియోస్ లో జరుగుతుంది. ఆ షూటింగ్ కవర్ చెయ్యడానికి జ్యోతి చిత్ర రిపోర్టర్ గా నేను బయలుదేరుతుంటే ఆంధ్ర జ్యోతి సీనియర్  రిపోర్టర్ ఎల్. రామానాయుడు కూడా  వస్తానన్నాడు . మాతో ఫోటోగ్రాఫర్ కూడా వచ్చాడు . రామారావు గారు అప్పుడు ప్రతిపక్షంలో వున్నారు .  రామారావు గారిని కలిస్తే ఏమైనా వార్త రాసుకోవచ్చని రామానాయుడు గారి ఆలోచన .  రామారావు గారి  సినిమా షూటింగ్ అంటే పాఠకులకు చెప్పలేనంత ఆసక్తి. పైగా అది వారి స్వంత సినిమా. రామారావు గారి సినిమా షూటింగ్ కవర్ చెచెయ్యాలంటే వారి అనుమతి తప్పనిసరి.  సినిమా షూటింగ్ కోసం ఒక్క పత్రికకు మాత్రమే అనుమతి ఇస్తారు. ఆంధ్ర జ్యోతి సంస్థ నుంచి వెలువడే సినిమా వార పత్రిక జ్యోతి చిత్ర. అందుకే మాతో పాటు ఆంధ్ర జ్యోతిని కూడా అనుమతించారు. రామారావు గారు ఆహ్వానిస్తే ఎంతో ప్రత్యేకంగా చూస్తారు . ఇక వారి మర్యాదల గురించి ప్రత్యేకంగా చెప్పాలా ?  మనకు కావలసిన పూర్తి సమాచారం స్వయంగా ఇస్తారు...
చిత్రం
  కందుల దుర్గేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు . ఈరోజు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక , సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారి జన్మదినోత్సవం . కందుల దుర్గేష్ గారు  ఒకప్పుడు ఈనాడు నుంచి వెలువడే సితార సినిమా వారపత్రికలో రిపోర్టర్ గా పనిచేసేవారు . నేను ఆంధ్ర జ్యోతి నుంచి వెలువడే జ్యోతి చిత్ర సినిమా వార పత్రిక లో పనిచేసేవాడిని . అప్పటి నుంచి దుర్గేష్ గారితో నాకు పరిచయం వుంది.  తరువాత దుర్గేష్ గారు రాజకీయాల్లో ప్రవేశించి అదీ సినిమాటోగ్రఫీ శాఖా మంత్రిగా ఉండటం మా అందరికీ గర్వకారణం . గత సంవత్సరం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉగాది రోజు నాకు కళారత్న పురస్కారం ప్రదానం చేసింది. ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు గారు , సాంస్కృతిక , సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ గారి నుంచి ఈ పురస్కారం స్వీకరించాను.  అప్పుడు ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు గారితో "నేను జర్నలిస్టుగా వున్నప్పటి నుంచి భగీరథ గారు  పరిచయం "అని దుర్గేష్ గారు  చెప్పారు . "నాకు కూడా భగీరథ గారు చాలా సంవత్సరాల నుంచి తెలుసు " అని బాబు గారు దుర్గేష్ గారు చెప్పడం నాకు ఆనందాన్ని కలిగించింది . దుర్గేష్ గ...
చిత్రం
  ప్రజాస్వామ్య పరిరక్షణ దినోత్సవం ఎన్ .టి. ఆర్. లిటరేచర్ కమిటీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 16న ప్రజాస్వామ్య పరిరక్షణ దినోత్సవం జరిగింది.  1984 ఆగష్టు 16న లో ఎన్ .టి .ఆర్ . ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన్ని దింపి నాదెళ్ల భాస్కరరావు ను ముఖ్యమంత్రి గా చేశారు అప్పటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ . ఈ చర్య దేశ వ్యాప్తంగా ఆగ్రహాన్ని తెప్పించింది . దేశంలో వున్నా ప్రతిపక్షాలన్నీ ఏకమై ఉద్యమించాయి . శ్రీమతి ఇందిరాగాంధీ దిగివచ్చి మళ్ళీ రామారావు గారిని ముఖ్యమంత్రిగా ప్రకటించారు . నెల రోజుల తరువాత సెప్టెంబర్ 16న రామారావు గారు  ముఖ్యమంత్రిగా పదవీ ఓరామానా స్వీకారం చేశారు . అప్పటి గవర్నర్ రామ్ లాల్ ను మార్చి  శాఖదర్ శర్మ గానిని నియమాయించారు . శర్మ గారు రామారావు గారితో ప్రమాణం చేయించారు . ఆరోజును అంటే సెప్టెంబర్ 16ను ప్రజాస్వామ్య పరిరక్షణ దినోత్సవంగా ప్రకటించారు . అప్పటి నుంచి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 16ను ప్రజాస్వామ్య పరిరక్షణ దినోత్సవంగా జరుపుకుంటున్నారు.   ఈ సంవత్సరం ఎన్ .టి. ఆర్. లిటరేచర్ కమిటీ ఆధ్వర్యంలో  జరిగిన ఈ కార్యక్రమంలో అసెంబ్లీ  అసెంబ్లీ స్పీకర్ గా పనిచేసిన శ్రీమతి ...
చిత్రం
  ఆత్మీయ అతిధిగా  గత నెల 29న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గిడుగు రామ మూర్తి పంతులు ఫౌండేషన్, శంకరం ఫౌండేషన్ సంయుక్తంగా గిడుగు జాతీయ పురస్కారాలప్రదానోత్సవాన్ని  నిర్వహించారు . మీర్జాపురంరాణి కృష్ణవేణి పుస్తకాన్ని ప్రచురించిన  నిర్మాత ఎన్ .ఆర్. అనురాధా దేవి గారిని జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించారు. నటి, నిర్మాత , గాయకురాలు శ్రీమతి కృష్ణవేణి కుమార్తె అనురాధాదేవి. శ్రీమతి కృష్ణవేణి 1949లో 'మనదేశం 'సినిమాలో నందమూరి తారకరామారావు గారిని సినిమా రంగానికి పరిచయం చేశారు , ఆ సినిమాకు తన సహాయం ఉండదని రాజావారు చెప్పారు. అయినా సరే మహాత్మా గాంధీ గారి స్పూర్తితో దేశ భక్తి  సినిమాను కృష్ణవేణి గారు రూపొందించారు. శోభనచల బేనర్ లేకుండా తన కుమార్తె అనురాధాదేవి పేరుతో ఎమ్ .ఆర్ .ఏ (మేకా రాజ్యలక్ష్మి అనురాధ ) బేనర్ ఏర్పాటుచేసి 'మనదేశం 'చిత్రాన్ని నిర్మించారు.  ఆ విధంగా ఎన్ .టి .ఆర్ . తొలి సినిమాతో అనురాధాదేవి గారికి వున్న అనుబంధనాన్ని ఆత్మీయ అతిధిగా పాల్గొన్న నేను ఈ సభలో  వివరించడం జరిగింది . 
చిత్రం
  విలక్షణ నటుడు నటుడు నారాయణ రావు  నటుడు, నిర్మాత జి .వి. నారాయణరావు బుధవారం సాయంత్రం మృతి చెందారు.  1973లో నారాయణ రావు మద్రాస్ ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో చేరి శిక్షణ పొందారు.  అదే ఇనిస్టిట్యూట్ లో రజనీకాంత్, చిరంజీవి కూడా శిక్షణ పొందారు . వారిద్దరితో  నారాయణ రావు కు స్నేహం వుంది . 1976లో దర్శకుడు కె .బాలచందర్ 'అంతులేని కథ ' తెలుగు చిత్రంలోనారాయణరావును  సినిమారంగానికి పరిచయం చేశాడు . ఆ సినిమాలో 'తాళికట్టు శుభ వేళ .. మెడలో కళ్యాణ మాల ' అనే పాటలో నారాయణ రావు చూపించిన అభినయం ఆయన్ని ప్రభిభావంతుడైన నటుడుగా నిలబెట్టింది . ఆ సినిమాలో ఉత్తమ సహాయ నటుడుగా నారాయణరావు ను ఎంపిక చేసి  ప్రభుత్వం నంది అవార్డును ప్రదానం  చేసింది.  అదే సంవత్సరం నిర్మాత ఎమ్మెస్ రెడ్డి బి .వి .ప్రసాద్ దర్శకత్వంలో  రూపొందించిన 'ముత్యాల పల్లకి ' చిత్రంలో హీరోగా అవకాశం ఇచ్చారు . ఇందులో జయసుధ కథానాయిక.   ఆ తరువాత సంవత్సరం 1977లో దర్శకుడు మృణాల్ సేన్ తెలుగులో నిర్మించిన 'ఒక ఊరి కథ ' సినిమాలో ముఖ్యమైన  పాత్రకు ఎంపిక చేశారు . ఏ .పరంధామ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో...
చిత్రం
  ఆంగికం, ఆహార్యం, అభినయం, వాచకం షావుకారు జానకి పెట్టని ఆభరణాలు  తెలుగు సినిమా రంగంలో షావుకారు జానకిది  అద్వితీయమైన స్థానం. తల్లిదండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా సినిమా రంగంలో ప్రవేశించినా, కట్టుకున్నవాడు స్వార్ధపరుడుగా మారిపోయాడని తెలిసి, ముగ్గురు పిల్ల తరువాత వివాహ బంధాన్ని రద్దు చేసుకొని, ఒంటరి మహిళగా , ధీరోదాత్త నటిగా జీవనం సాగించి ఎందరికో స్ఫూర్తిప్రదాతగా నిలిచారు .  తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ , హిందీ భాషా చిత్రాల్లో నటించిన షావుకారు జానకి,  సినిమా రంగంలో ఎవరి  సహకారం , ప్రోత్సాహం లేకుండా  స్వయంగా ఎదిగి , ఒదిగిన మహానటి. 1950లో 'షావుకారు' చిత్రం తో మొదలైన ఆమె నట ప్రస్థానం 2023లో  విడుదలైన 'అన్నీ మంచి శకునములే ' చిత్రం వరకు కొనసాగింది. ఈ ఏడు దశాబ్దాలలో ఆమె ఎన్. టి. రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఎం. జి. ఆర్, శివాజీ గణేశన్ లాంటి మహానటులతో నటించారు. చిన్నప్పుడు మహాత్మా గాంధీ మద్రాసు వచ్చినప్పుడు వారికి పాలు, వేరుశనగ పప్పులు అందించి ఆశీస్సులు అందుకున్న జానకి ఆ తరువాత జవహర్ లాల్ నెహ్రూ, బాబు రాజేంద్ర ప్రసాద్, ఇందిరా గాంధీ లాంటి నేతలతో మాట్లాడిన అదృ...
చిత్రం
  మంచితనం, మనిషితనం మూర్తీభవించిన గుమ్మడి  శత జయంతి  వేడుకలు ప్రారంభము  తెలుగు సినిమా రంగములో తనదైన ముద్ర వేసిన మానవతావాది, నిరాడంబరుడు , నిగర్వి, నిబద్ధతకాల మహా నటుడు గుమ్మడి వెనకటేశ్వర రావు. పాత్రోచితమైన నటనకు, సంభాషణలకు  ఆయన మారు పేరు.  మన సంస్కృతి, సంప్రదాయాలకు విలువనిచ్చే వ్యక్తిగా, సినిమా రంగంలో ఉంటూ కూడా  ఆ గ్లామర్ ముసుగు లేకుండా చివరివరకు మానవతా విలువలతో  జీవన  ప్రస్థానం సాగించిన అరుదైన, అపూర్వమైన నటుడు గుమ్మడి వేంకటేశ్వర రావు.  సినిమా రంగంలో గుమ్మడిగా ప్రసిద్ధిచెందిన  వెంకటేశ్వరరావు జూలై 9, 1927న  గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని  రావికంపాడు గ్రామంలో  గుమ్మడి  బసవయ్య, బుచ్చమ్మ దంపతులకు జన్మించారు. గుమ్మడికి  ముగ్గురు తమ్ముళ్లు, ఒక చెల్లెలు ఉన్నారు. వీరిది ఉమ్మడి కుటుంబం.  ఆ కుటుంబ  వాతావరణంలో పెరగడం వల్ల మనుషుల మధ్య మమతానురాగాలు  ఏమిటో చిన్నప్పుడే చవి చూశారు.  ప్రాధమిక విద్యను రావికంపాడులో  ఉన్నత విద్యను కొల్లూరులో చదివారు. ఈ దశలోనే  పుచ్చలపల్లి సుందరయ్య, చంద్ర రాజేశ్వర ...