పోస్ట్‌లు

చిత్రం
  నేపధ్య గాయని, ఎస్ .జానకి ఇక లేరు .  ఆమె తన 88వ ఏట జులై 11న ఇహలోక యాత్ర ముగించారు .  భారతీయ చలనచిత్ర సంగీత ప్రపంచంలో  గాన కోకిల ఎస్. జానకి గారిది అద్వితీయమైన స్తానం . ఆమె  తన మధుర గాత్రంతో ఐదు దశాబ్దాలకు భారతీయ  శ్రోతలను అలరించిన మధుర  నేపధ్య గాయని.  ఆమె 1938 ఏప్రిల్ 23న ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో రేపల్లెలో వాళ్లపట్ల గ్రామంలో  జన్మించారు. ఆమెకు ఎటువంటి సాంప్రదాయ సంగీతంలో అధికారిక శిక్షణ లేకపోయినప్పటికీ, నాదస్వరం విద్వాన్ పైడిస్వామి వద్ద సంగీతం  నేర్చుకున్నారు .  1957లో సంగీత దర్శకుడు టి.చలపతిరావు   'విధియిన్‌ విలాయత్తు' అనే చిత్రం ద్వారా చిత్ర రంగంలో పరిచయం చేశారు .  తెలుగులో ఆమె మొదటి చిత్రం  'ఎమ్మెల్యే. నిర్మాత కె .బి .తిలక్ రూపొందించిన ఈ సినిమాకు సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వర రావు , ఈ సినిమాలో 'నీ ఆశా అడియాశా .. చెయి జారే మణిపూస..  బ్రతుకంతా అమవాసా ...లంబాడోళ్ళ రాందాసా' అనే పాటను ఘంటసాలతో కలసి పాడారు . ఈ గీతాన్ని  ఆరుద్ర వ్రాశారు .  తెలుగు తో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో పాటు ప...
చిత్రం
 "ఎన్ .టి .ఆర్ . తరతరాలకు స్ఫూర్తి ప్రదాత"  - వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్న ఎన్ .టి . రామారావు తెలుగు జాతికి స్ఫూర్థి ప్రదాత, తరతరాలు ఆయన భావజాలం కొనసాగుతుందని తెలంగాణ రాష్ట్ర  వ్యవసాయశాఖా  మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.  ఎన్ .టి .ఆర్ఆ. లిటరేచర్ కమిటీ నాలుగు  సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్ ఫిలింనగర్ లో శనివారంనాడు జరిగిన సమావేశంలో తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- తాను రామారావుగారి అభిమానంతో, ప్రోత్సాహంతో రాజకీయాల్లో ఎదిగానని ఆయన వ్యక్తిత్వం, ఔనత్యం చాలాగొప్పదని. బడుగు, బలహీనవర్గాలతోపాటు వెనుకబడిన ప్రజలకు కూడా రాజకీయంగా చేయూతనిచ్చిన మహానాయకుడు రామారావుగారని ఆయన చెప్పారు .  ఎన్టీఆర్ భావజాలాన్ని ప్రపంచవ్యాప్తం చేయటానికి టి.డి. జనార్థన్ నాయకత్వంలో ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ ఏర్పాటుకావటం ఎంతో సముచితంగా ఉందని, ఆ మహనీయుని చరిత్ర ఎప్పటికీ స్ఫూర్తినిస్తూంటుందని నాగేశ్వరరావు పేర్కొన్నారు. తెలంగాణ మాజీ శాసనసభాదిపతి ఎమ్. మధుసూధనాచారి మాట్లాడుతూ- రాజ్యాధికారం లేని ఎన్నో కులాలను గుర్తించి వారిక...
చిత్రం
  ఇచ్చిన మాట నిలబెట్టుకున్న  డాక్టర్ వై .ఎస్ .ఆర్ .  ఈరోజు ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై .ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి 77వ జయంతి.  రాజశేఖర్ రెడ్డి గారి వ్యక్తిత్వం ఎంత సమున్నతమైనదో, ఇచ్చిన మాటను ఎలా నిలబెట్టుకున్నారో  ఈ సంఘటన తెలియజేస్తుంది .  2004లో మే 14న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా  డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారుప్రమాణ స్వీకారం చేశారు . అప్పుడు వారు  సోమాజిగూడలోని రాజ్‌భవన్ రోడ్డులో ఉన్న లేక్ వ్యూ గెస్ట్ హౌస్ నుంచి తన అధికార  కార్యక్రమాలను నిర్వహించేవారు.  1978లో ఫిలిం నగర్ కు అంకురార్పణ జరిగింది. 1984- 85 వరకు చిత్ర పరిశ్రమ హైద్రాబాద్లో సంపూర్ణంగా స్థిరపడింది.  నిర్మాత, దర్శకుడు వి .బి .రాజేంద్ర ప్రసాద్ గారు చైర్మన్ గా 2004 జులై 14న  'ఫిలిం నగర్ దైవ సన్నిధానం '  పేరుతో  దేవాలయం ప్రారంభమైంది.  అక్టోబర్ మొదటి వారంలో ఈ దేవాలయ సందర్శనకు ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారిని ఆహ్వానించడానికి  రాజేంద్ర ప్రసాద్ గారితో పాటు నేను కూడా లేక్ వ్యూ గెస్ట్ హౌస్ కు వెళ్ళాను. మాకు అప్పటి సమాచార శాఖ కమీషనర్ డాక్...
చిత్రం
 డాక్టర్ వై .ఎస్ . రాజశేఖర్ రెడ్డి గారి 77వ జయంతి.  ఈరోజు ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై .ఎస్ . రాజశేఖర్ రెడ్డి గారి 77వ జయంతి.  2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా  డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారుప్రమాణ స్వీకారం చేసిన తర్వాత,   సోమాజిగూడలోని రాజ్‌భవన్ రోడ్డులో ఉన్న లేక్ వ్యూ గెస్ట్ హౌస్ నుంచి తన అధికార  కార్యక్రమాలను నిర్వహించారు. నిర్మాత , దర్శకుడు వి .బి .రాజేంద్ర ప్రసాద్ గారు  2004లో 'ఫిలిం నగర్ దైవ సన్నిధానం '  పేరుతో ఒక దేవాలయాన్ని ఫిలిం నగర్ లో నిర్మించారు. ఈ దేవాలయానికి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారిని ఆహ్వానించడానికి అక్టోబర్ మొదటి వారంలో రాజేంద్ర ప్రసాద్ గారితో పాటు నేను కూడా లేక్ వ్యూ గెస్ట్ హౌస్ కు వెళ్ళాను . మాకు అప్పటి సమాచార శాఖ కమీషనర్ డాక్టర్ కె .వి. రమణాచారి మాకు సమయం ఇప్పించారు . ఆరోజు ఉదయం మేము లేక్ వ్యూ కు వెళ్ళాము . రాజశేఖర్ రెడ్డి గారి కోసం హాల్ లో చాలా మంది వేచి వున్నారు .  సరిగ్గా 9.30 గంటలకు మేమున్న హాల్ లోకి  రాజశేఖర్ రెడ్డి గారు వచ్చారు . అందరినీ కలసి మాట్లాడి పంపించిన తరువాత మా దగ్గరకు వచ్...
చిత్రం
  జన్మదిన శుభాకాంక్షలు  భారత మాజీ ఉప రాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారికి 77వ జన్మదిన శుభాకాంక్షలు . మీరు ఇలాంటి జన్మదినోత్సవాలు ఎన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. 
చిత్రం
  పద్మశ్రీ పురస్కార గ్రహీతలకు ప్రధాని అభినందనలు   పద్మ అవార్డుల రెండవ విడత ప్రదానోత్సవం మంగళవారం రాష్ట్రపతి భవన్ లో అత్యంత వైభవంగా జరిగింది . రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 65 మంది ప్రముఖులకు ఈ అవార్డులను ప్రదానం  చేశారు . ఇందులో ఇద్దరు పద్మ విభూషణ్ , ఏడుగురు పద్మ భూషణ్ , 56మంది పద్మశ్రీ పురస్కారాన్ని స్వీకరించారు .  న్యూ ఢిల్లీ రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ , ప్రధాని నరేంద్ర మోడీ , లోక సభాపతి ఓం బిర్లా , మాజీ రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ , హోమ్ మంత్రి అమిత్ షా , విమాన శాఖా మంత్రి కె .రామ మోహన్ నాయుడు , కేంద్ర మంత్రి బండి సంజయ్ తదితరులు హాజరయ్యారు . ఈసారి పద్మశ్రీ పురస్కారాన్ని నటులు మాగంటి మురళీ మోహన్ , గద్దె రాజేంద్ర ప్రసాద్ స్వీకరించారు. సినిమా రంగంలో వీరు సాధించిన విజయానికి ఈ అవార్డు లభించింది .  2026 పద్మ పురస్కార గ్రహీతల జీవితం ఎంతో  స్ఫూర్తిదాయకమని  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు.  జూన్ 23న రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్న ప్రధాని మోడీ అందరినీ  అభినందించారు .  రాష్...
చిత్రం
  అభ్యుదయ దర్శకుడు, అసమాన దార్శనికుడు   గూడవల్లి రామబ్రహ్మం   తెలుగు సినిమా చరిత్రలో గూడవల్లి రామ బ్రహ్మం గారిది  ఓ సంచలన అధ్యాయం.  సినిమా కేవలం వినడా సాధనం మాత్రమే కాదు, దీని ద్వారా సామాజిక ప్రయోజనం సాధించవచ్చునని నిరూపించిన అభ్యుదయ దర్శకుడు రామ బ్రహ్మం. ఆయన మొదట జర్నలిస్ట్ , ఆ తరువాత సినిమా దర్శకుడు.  ఈ రెండు మాధ్యమాల ద్వారా ప్రజలను చైతన్యవంతులను  చేయాలని నిరంతరం కృషి చేసిన అభ్యుదయ మూర్తి , చైతన్య స్ఫూర్తి రామ బ్రహ్మం. ఆయన   జూన్ 24, 1898 న కృష్ణా జిల్లా, ఉంగుటూరు మండలము నందమూరు గ్రామంలో గూడవల్లి వెంకయ్య, బాపమ్మలకు  జన్మించాడు.  ఆయన చదువు ఇందుపల్లి, గుడివాడ, బందరులలో సాగింది. చిన్నప్పటి నుంచి ఎంతో చురుకుగా ఉండేవాడు .  18 ఏళ్ళ వయసులో  కోగంటి నాగయ్య కుమార్తె శారదాంబతో రామ బ్రహ్మానికి వివాహం జరిగింది.మామ గారి ఇంట్లో  కొన్నాళ్ళు ఉండి గాంధీ గారి పిలుపుతో సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నాడు. 1924లో విజయవాడలో ఫ్రెండ్స్ అండ్ కో అనే పేరుతో ఒక గడియారాల వ్యాపారం ప్రారంభించాడు. అయితే అక్కడ వ్యాపారం స్నేహితులతో , రాజకీయ ...