స్మృతి పథంలో రామోజీ రావు గారు తెలుగు నాటి నిత్యం వినిపించే పేరు రామోజీ రావు . రామోజీరావు గారు ఒక వ్యక్తిగా ప్రారంభమై వ్యవస్థగా ఎదిగారు . 1974లో ఈనాడు ప్రారంభించి, తెలుగు పత్రిక రంగాన్ని శాసించిన రామోజీ రావు గారు , 1984లో ఉషాకిరణ్ మూవీస్ ప్రారంభించి తెలుగు సినిమా రంగంపై తనదైన ముద్రవేశారు . 1995లో ఈటీవీ తో తెలుగు వార్తా ప్రపంచంలో ఒక సంచలనం కలిగించారు . 1996లో తన పేరుతో ఏర్పాటు చేసిన ఫిలింసిటీ ఒక అద్భుతం . దేశానికే గర్వకారణం . 2005లో ప్రపంచంలోనే అతిపెద్ద చలనచిత్ర స్టూడియో గా రామోజీ ఫిలింసిటీ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో నమోదయ్యింది . 1984లో రామోజీ రావు గారిని మా జ్యోతి చిత్ర (ఆంధ్ర జ్యోతి సంస్థ నుంచి వెలువడే సినిమా వార పత్రిక ) కోసం ఇంటర్వ్యూ చేశాను . అప్పుడు నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా వున్నారు . ఆ ఇంటర్వ్యూ లో తెలుగు సినిమా రంగం మద్రాసు నుంచు హైద్రాబాద్ కు తరలి రావాలంటే ప్రభుత్వం ఏమి చెయ్యాలి .. అనేది ప్రముఖంగా ప్రస్తావించడం జరిగింది . అప్పటి నుంచి వారు నేనంటే ఎంతో అభిమానంగా ఉండేవారు . 1987లో జరిగిన మా వివాహ...