కుద్రేముఖ్ లో వెంకట్, నాగార్జున అప్ సెట్ అక్కినేని నాగార్జున , శోభన జంటగా వి .మధుసూదన రావు గారు దర్శకత్వంలో అక్కినేని అన్నపూర్ణమ్మ గారు నిర్మిస్తున్న 'విక్రమ్' సినిమా 1985 సెప్టెంబర్ 20న అన్నపూర్ణ స్టూడియోస్ లో నాగేశ్వర రావు గారి పుట్టినరోజున ' ప్రారంభమైంది . ఆ తరువాత ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో మొదలయ్యింది . 'ఈ సినిమాలో కొంత భాగం షూటింగ్ ను కర్ణాటక లోని కుద్రేముఖ్ లో చెయ్యాలని నిర్ణయించామని , అక్కడకి జర్నలిస్టులను తీసుకెళ్లే బాధ్యతను మీకు అప్పకిస్తున్నామని' ఒక రోజు నాగేశ్వర రావు గారు చెప్పారు . నాగార్జున మొదటి సినిమా కాబట్టి కవరేజ్ కోసం హైదరాబాద్ నుంచి జర్నలిస్టులను తీసుకెడితే స్పెషల్ కవరేజ్ వస్తుంది అని చెప్పాను . అందుకు నాగేశ్వర రావు గారు కూడా 'అవును , అదే మా ఉద్దేశ్యం, మీకు అన్ని ఏర్పాట్లు చెయ్యమని వెంకట్ కు చెబుతాను ' అన్నారు . నేను సరేనన్నాను . ఆలా జ్యోతి చిత్ర తరుపున నేను , సితార నుంచి గౌస్ ( శాతవాహన ), చిత్ర భూమి నుంచి కేశవరావు , ఆంధ్ర పత్రిక నుంచి రాజేశ్వర రావు , ఆం...