స్టాలిన్ తో రజనీకాంత్ సమావేశం అందుకేనా ? తమిళనాడులో నటుడు విజయ్ పార్టీ అధికారంలోకి వస్తుందని అందరూ భావించారు . విజయ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాధ్ అర్లేకర్ కలసి తనకు కాంగ్రెస్ పార్టీ తో 112 మంది మద్దతు ఉందని , ప్రభుత్వం ఏర్పాటుచేసే అవకాశం ఇవ్వమని విజ్ఞప్తి చేశాడు . అయితే ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి 118 మంది శాసన సభ్యులు అవసరమని గవర్నర్ స్పష్టం చేశాడు . గురువారం చెన్నై లోని నెహ్రు స్టేడియం లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి కూడా ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలో గవర్నర్ ఎలా చెప్ప్పడం విజయ్ కు మింగుడుపడలేదు . ఎన్నికల్లో నెగ్గిన పార్టీల్లో ఎక్కువ సీట్లు గెలిచిన పార్టీని గవర్నర్ ప్రభుత్వం ఏర్పాటు చెయ్యమని ఆహ్వానించడం ఆనవాయితీ . అదే పద్దతిని గవర్నర్ రాజేంద్ర విశ్వనాధ్ అర్లేకర్ అనుసరిస్తాడని విజయ్ నమ్మాడు . విజయ్ కు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తామని అధికారికంగా ప్రకటించడం , లేఖ ఇవ్వడం తో గవర్నర్ మాట మార్చి వుండవచ్చున్నాని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు . సుబ్రహ్మణ్య స్వామి లాటి రాజ్యాంగ నిపుణులు కూడా గవర్నర్ చర్య ను తప్పుపడుతున్నారు. ఇదిలా ఉండగా తమిళ సూపర్ స్టార్...