ఈరోజు మహాకవి శ్రీ శ్రీ 116వ జయంతి. శ్రీరంగం శ్రీనివాసరావు అనే శ్రీ శ్రీ తో నా సాహిత్య జీవితం మొదలైంది . 1980 జూన్ 1వ తేదీన నేను రచించిన 'మావవత' అనే కవితా సంపుటికి శ్రీ శ్రీ ముందు మాటను వ్రాసి స్వయంగా ఆవిష్కరించారు . 46 సంవత్సరాల క్రితం హైదరాబాద్ లోని అశోక్ నగర్ కేంద్ర గ్రంథాలయంలో ఈ కార్యక్రమాన్ని కిన్నెర రఘురాం ఏర్పాటు చేశారు . ఈ కార్యక్రమానికి అప్పటి హై కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి ఆవుల సాంబశివ రావు గారు అధ్యక్షత వహించారు . నిర్మాత దర్శకుడు ఉప్పలపాటి విశ్వేశ్వర రావు ముఖ్య అతిధిగా వచ్చారు . సీనియర్ జర్నలిస్ట్ జి .ఎస్ .వరదాచారి , మా గురువు ఆచార్య తిరుమల అతిధులుగా పాల్గొన్నారు . సీనియర్ న్యాయవాది అడుసుమిల్లి పాండురంగారావు గారికి 'మానవత ' పుస్తకాన్ని అంకితం ఇచ్చాను . ఆ నాటి సభలో నిర్మాత, దర్శకులు పి .పుల్లయ్య , ఆవుల మంజులత , పంపిణీదారు వెంకట రావు , జర్నలిస్ట్ ఉడయవర్లు, నటి కృష్ణవేణి , మా సోదరుడు కోటేశ్వర రావు , మిత్రుడు ఎన్ .వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు . నా జీవితంలో అదోగ మధురమైన జ్ఞాపకం .