మీర్జాపురం రాణి కృష్ణవేణి - సినిమా రంగంలో ఆణిముత్యం మనకు పరిశోధన ఆధారిత చారిత్రక నవలలు చాలా ముఖ్యమైనవి, ఎందుకంటే అవి చరిత్రకు సృజనాత్మక కథనానికి మధ్య వారధిగా నిలుస్తాయి. ఆ చారిత్రక గతాన్ని సజీవంగా పాఠకుల ముందు నిలిపి మనకు కచ్చితమైన అనుభవాన్నిస్తుంది . పరిశోధన ఆధారిత చారిత్రక నవలలు, ప్రాథమిక చరిత్ర ఆధారాలు, శాసనాలు మరియు చారిత్రక ఆధారాలు , అనుభవజ్ఞుల నుండి గ్రహించిన విషయాల ఆధారంగా కథనాలను రూపొందించడం జరుగుతుంది . ఈ నవలలు పాఠకులను ఆ కాలంలోకి తీసుకువెళ్లి, వారిలో నమ్మకాన్ని పెంచి, స్పష్టమైన చారిత్రక విషయాలను సజీవంగా మనకు అందిస్తాయి. అంతే కాకుండా చరిత్రలో వదిలివేసిన ఖాళీలను సైతం పూరిస్తాయి. మరుగున పడిపోయిన అనేక చారిత్రాత్మక సంఘటనలను,ఆయా కాలాలలోని ప్రజల జీవన విధానం ఈ తరం పాఠకులకు అందుబాటులోకి తీసుకురావడానికి చేసే గొప్ప ప్రయత్నం. అలాంటి పరిశోధన ఆధారిత నవలలు రాసిన ఘనత భగీరథ గారిది . వారు రచించిన ‘నాగలాదేవి, ‘మీర్జాపురం రాణి కృష్ణవేణి ’.ఈ కోవకు చెందుతాయి . గత 18 ఏండ్లుగా భగీరథ గారు చారిత్రక పరిశోదనకు అంకితమై కాకతీయ , విజయనగర సామ్రాజ్యాల గురించి విస్తృతమైన పరిశోధన చేశారు . ఆ పరిశ...