పోస్ట్‌లు

చిత్రం
  సూపర్ స్టార్  కృష్ణ 83వ జయంతి  ఘట్టమనేని శివ రామ కృష్ణ మూర్తి అనే సూపర్ స్టార్ కృష్ణ జయంతి నేడు . రాఘవయ్య చౌదరి , నాగరత్నమ్మ దంపతులకు 1947 మే 31న తెనాలిలో ని బుర్రిపాలెం గ్రామంలో జన్మించారు .  కృష్ణ కు చిన్నప్పటి నుంచి నటుడు కావాలనే కోరిక ఉండేది. చదువు పూర్తి అయిన తరువాత మద్రాసు వచ్చాడు . 1962లో వ్. మధుసూదన రావు దర్శకత్వం వహించిన 'పదండి ముందుకు' అనే సినిమాలో చిన్న  వేషం వేశారు . ఈ సినిమాను కొంగర జగ్గయ్య నిర్మించి ప్రధాన పాత్రలో నటించారు .  అదే సంవత్సరం అక్కినేని నాగేశ్వర రావు కథానాయకుడుగా కె .ప్రత్యగాత్మ దర్శకత్వం వహించి 'కుల గోత్రాలు ' సినిమాలో కూడా  చిన్న పాత్రలో నటించారు . 1963లో ఎన్ .టి .ఆర్ .కథానాయకుడుగా మానాపురం అప్పారావు దర్శకత్వం వహించిన 'పరువు - ప్రతిష్ఠ ' చిత్రంలో కూడా కృష్ణకు చిన్న పాత్రే లభించింది .  ఆ తరువాత కొంతకాలం వేచి వున్నారు . 1965లో ఆదుర్తి సుబ్బారావు 'తేనే మనసులు ' అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తూ కృష్ణకు కథానాయకుడుగా అవకాశం కల్పించారు . అయితే అప్పుడు సినిమా పంపిణీదారులు కొత్త హీరో వద్దు , పాత వారిని పెట్టమని ఆదుర్తి మీద వత్...
చిత్రం
  'అక్షరాంజలి' పుస్తకావిష్కరణ జ్ఞాపకాలు  నేను రచించిన రెండవ కవితా సంపుటి 'అక్షరాంజలి ' ని అప్పటి మద్రాస్ గవర్నర్ శ్రీ కొణిజేటి రోశయ్య గారు.  2015 జూన్ 1వ తేదీన హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో దీనిని ఆవిష్కరించారు .  నా 'మానవత' పుస్తకం కూడా 1980 జూన్ 1వ తేదీనే శ్రీశ్రీ గారు హైదరాబాద్ లో ఆవిష్కరించారు . అప్పుడు శ్రీ శ్రీ గారు మద్రాసు నుంచి హైదరాబాద్ కు వచ్చి పుస్తకాన్ని ఆవిష్కరించారు .  అక్షరాంజలి కవితా సంపుటిని కూడా గవర్నర్ రోశయ్య గారు మద్రాసు నుంచి వచ్చి జూన్ 1న ఆవిష్కరించారు . బహుశ ఇలా జరగడం మాత్రం యాదృచ్చికం కావచ్చు , కానీ నాకు మాత్ర రెండు మధుర జ్ఞాపకాలుగా మిగిలాయి . అక్షరాంజలి  వెలుగు చూడటానికి కారకులు నిర్మాత శ్రీ కళ్యాణ్ గారు . దీనిని డాక్టర్ కె .వి . రమణాచారి గారికి అంకితం చేశాను . అప్పటి ఆంధ్ర ప్రదేశ్ శాసన సభాపతి డాక్టర్ కోడెల శివ ప్రసాద్ గారు ముఖ్య అతిధిగా వచ్చారు . మా నాగండ్ల ప్రముఖులు శ్రీ చెరుకూరి హరి ప్రసాద్ గారు , శ్రీ పుల్లెల గోపీచంద్ గారు ప్రత్యేక అతిధులుగా విచ్చేశారు . డాక్టర్ కె .వి .కృష్ణకుమారి , డాక్టర్ శ్రీనివాస రెడ్డి , డాక్టర్ ఉమాపతి వర్మ ...
చిత్రం
  "మానవత"కు 46 సంవత్సరాలు  నేను రచించిన కవితా సంపుటి "మానవత "కు 46సంవత్సరాలు అయ్యిందంటే చాలా ఆశ్చర్యంగా ఉంది . అప్పుడే ఇన్ని సవత్సరాలు గడిచిపోయాయి?  "మానవత" నా తొలి పుస్తకం . దీనికి మహాకవి శ్రీ శ్రీ ముందుమాట వ్రాసి , స్వయంగా హైదరాబాద్ వచ్చి ఆవిష్కరించారు . నా సాహిత్య జీవితానికి 'మానవత ' నాంది పలికింది . 1980 జూన్ 1వ తేదీన ఉదయం 10.00 గంటలకు హైదరాబాద్ అశోక్ నగర్ లోని నగర కేంద్ర గ్రంధాలయ సంస్థలో 'మానవత ' పుస్తకావిష్కరణ సభను కిన్నెర ఆర్ట్ థియేటర్స్ రఘురామ్  ఏర్పాటు చేశారు . నాటి  సభలో  ఆనాటి హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీ ఆవుల సాంబశివరావు గారు , నిర్మాత దర్శకులు యు .విశేశ్వర రావు గారు , సీనియర్ జర్నలిస్ట్ శ్రీ జి. ఎస్. వరదాచారి, గురువు శ్రీ ఆచార్య తిరుమల , హై కోర్టు లాయర్ శ్రీ అడుసుమిల్లి పాండురంగారావు గారు పాల్గొన్నారు. ఇదొక మర్చిపోలేని మధుర జ్ఞాపకం .  'ఈ భగీరథ ప్రయత్నాన్ని ఎవరైనా అభినందిస్తారు , ముందుగా నాకా అవకాశం వచ్చింది ' అని మహాకవి శ్రీ శ్రీ పేర్కొన్నారు . ఈ సభలో నిర్మాత దర్శకుడు పి .పుల్లయ్య పాల్గొని "ఒరే అబ్బాయి నీకు  గ...
చిత్రం
  దాసరి నారాయణ రావు గారి సమాధి పట్ల నిర్లక్ష్యం ? ఈరోజు దర్శక రత్న దాసరి నారాయణ రావు గారి  9వ వర్ధంతి. ఆయన 30 మే 2017లో తన 75వ సంవత్సరంలో మరణించారు .  దాసరి నారాయణ రావు గారికి వికారాబాద్ కు  వెళ్లే దారిలో  మొయినాబాద్  దగ్గర ఫామ్‌హౌస్‌ ఉంది .  అక్కడ దాసరి పద్మ గారి సమాధి కూడా ఉంది .పద్మ గారు అక్టోబర్ 28, 2011లో కన్నుమూశారు.   ఆ సమాధి ప్రక్కనే దాసరి నారాయణ రావు సమాధిని కూడా కుటుంబ సభ్యులు ఏర్పాటుచేశారు.   అయితే మొయినాబాద్  ఫామ్‌హౌస్‌లో ఉన్న  దాసరి మరియు పద్మ సమాధులు  పిచ్చి మొక్కలు , ముళ్ల చెట్లతో దయనీయంగా ఉందనే ఓ వీడియో సోషల్ మీడియా లో ఈరోజు రావడంతో చిత్ర పరిశ్రమ నివ్వెర పోయింది. తెలుగు సినిమాలో అఖండంగా వెలిగిన దాసరి నారాయణ రావు గారికి ఇలాంటి స్థితి వస్తుందని ఎవరూ ఊహించలేదు. హైద్రాబాద్ కు దూరంగా ఉండటం , సమాధిని వారి కుటుంబ సభ్యులు సందర్శించి నివాళులు అర్పిస్తున్నారనే ఉద్దేశ్యతో సినిమా రంగం వుంది . దాసరి నారాయణ రావు గారికి హరి హర ప్రభు, అరుణ్ కుమార్ , హేమాలయా కుమారి, ముగ్గురు సంతానం .  దాసరి కుమార్తె హిమాలయ కుమారి ...
చిత్రం
  అన్న గారితో అనుబంధం  మహా నటుడు , నాయకుడు , తెలుగు వారికి ప్రాతః స్మరణీయుడు నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి . ప్రపంచంలో వున్నా తెలుగు వారందరూ విశ్వ విఖ్యాత నందమూరి తారక రామారావు గారిని స్మరించుకుంటున్నారు . రామారావు గారితో నాకు ఎన్నో మధురమైన అనుభవాలున్నాయి . రామారావు గారి శతాబ్ది సందర్భంగా 'మహానటుడు, ప్రజానాయకుడు ఎన్ .టి .ఆర్ .అన్న పుస్తకాన్ని రచించాను . టి .డి .జనార్దన్ గారు చైర్మన్ గా ఏర్పాటైన కమిటీలో నేను కార్యదర్శిని . మా కమిటీ ఆధ్వర్యంలో  'శకపురుషుడు ', 'తారకరామం ' అన్న గ్రంథాలు వెలువడ్డాయి . వీటికి నేను  సంపాదకత్వం వహించాను .  నిన్ననే వంశీ రామరాజు నాకు 'వంశీ ఎన్.టి.ఆర్.' మహానంది గ్లోబల్ అవార్డు ప్రదానంను ప్రదానం చేశారు .
చిత్రం
  తెలుగు సినిమా ప్రస్థానం .... !? ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలనే ఉద్దేశ్యతో ప్రభుత్వం ఆలస్యంగానైనా ఎఫ్ .డి .సి . బోర్డును  నియమించింది . ఈ బోర్డు చైర్మన్ గా పంపిణీదారు పి .భరత్ భూషణ్ , వైస్ చైర్మన్ గా దర్శకుడు మెహర్ రమేష్ , సభ్యులుగా హీరో సుమన్, నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు , హీరో శివాజీ , రచయిత బుర్ర సాయి మాధవ్, నటి ఝాన్సీ , దర్శకుడు సముద్ర , ఛాయాగ్రాహకుడు మీర్ , నిర్మాత వివేక్ కూచిపూడి ,సీనియర్ జర్నలిస్ట్ కొండపనేని ఉమామహేశ్వర రావు తదితరులు ఆదివారంనాడు విజయవాడలో పదవీ ప్రమాణ స్వీకారం చేశారు . ఈ కార్యక్రమంలో  సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ , శాసన సభ్యులు , హీరో శ్రీ నందమూరి బాలకృష్ణ పాల్గొని ఆద్యంతం ఉత్సాహభరితంగా కార్యక్రమాన్ని నడిపించారు . ఈ కార్యక్రమం కోశాయ్ హైదరాబాద్ నుంచి నిర్మాతలు సి .కళ్యాణ్ , తుమ్మల ప్రసన్న కుమార్ , అంబికా కృష్ణ , మాదాల రవి , ప్రతాని రామకృష్ణ గౌడ్ , వల్లభనేని అనిల్ కుమార్ , దర్శకులు వి .ఎన్ .ఆదిత్య , జి  రామ్ ప్రసాద్ మొదలైనవారు హాజరయ్యారు.  ఇప్పటికైనా ప్రభుత్వంలో కదలిక వచ్చినందుకు సంతోషం . ...
చిత్రం
 యమున మౌనపోరాటం ఈటీవీ...ఇప్పుడు మరో సరికొత్త డైలీసీరియల్ తో అలరించబోతోంది. ఈ సీరియల్ ప్రత్యేకత ఏమింటే...మూడు దశాబ్దాల క్రితం అసాధారణ విజయాన్ని  సాధించిన ఉషాకిరణ్ మూవీస్ ‘మౌనపోరాటం’ చిత్రానికి సీక్వెల్ గా ప్రేక్షకుల ముందుకు రావడం. అడవిలో స్వేచ్ఛగా, స్వచ్ఛంగా పెరిగిన ఓ గిరిజన యువతిని, పెద్ద ఉద్యోగం చేస్తూ – చిన్న మనసున్న ఓ పట్నం యువకుడు మోసం చేస్తే...అతని కారణంగా గర్భం దాల్చి, కడుపులోని బిడ్డకు తండ్రెవరో నిరూపించుకోవాల్సిన దయనీయ దుస్థితిలో ..ఆ ఒంటరి యువతి సాగించిన ‘మౌనపోరాటం’ ఆ రోజుల్లో అంతులేని సంచలనం కలిగించింది. మాయగాళ్ళ  బారిన పడి దిక్కుతోచక రోదించే ఎంతో మంది అబలలకు, అమాయకులకు మార్గం చూపిన ఈ చిత్రం ఎన్నో అవార్డులు గెలుచుకుంది.  ఓ గిరిజన యువతి నిజ జీవితంలో ఎదుర్కొన్న సంఘటనలకు తెరరూపం కల్పించిన ‘మౌనపోరాటం’ చిత్రంలో యమున , వినోద్ కుమార్ హీరో హీరోయిన్లు గా నటించారు. రామోజీ రావు నిర్మించిన ఈ చిత్రానికి ప్రఖ్యాత గాయని ఎస్.జానకి సంగీతం అందించగా, మోహన్ గాంధీ దర్శకత్వం వహించారు. దాదాపు ముప్ఫై మూడేళ్ళ తర్వాత మౌనపోరాటం సినిమాకు కొనసాగింపుగా ఇదే పేరుతో సరికొత్త డైలీ సీరియల్ ప్...