దాసరి నారాయణ రావు గారి సమాధి పట్ల నిర్లక్ష్యం ? ఈరోజు దర్శక రత్న దాసరి నారాయణ రావు గారి 9వ వర్ధంతి. ఆయన 30 మే 2017లో తన 75వ సంవత్సరంలో మరణించారు . దాసరి నారాయణ రావు గారికి వికారాబాద్ కు వెళ్లే దారిలో మొయినాబాద్ దగ్గర ఫామ్హౌస్ ఉంది . అక్కడ దాసరి పద్మ గారి సమాధి కూడా ఉంది .పద్మ గారు అక్టోబర్ 28, 2011లో కన్నుమూశారు. ఆ సమాధి ప్రక్కనే దాసరి నారాయణ రావు సమాధిని కూడా కుటుంబ సభ్యులు ఏర్పాటుచేశారు. అయితే మొయినాబాద్ ఫామ్హౌస్లో ఉన్న దాసరి మరియు పద్మ సమాధులు పిచ్చి మొక్కలు , ముళ్ల చెట్లతో దయనీయంగా ఉందనే ఓ వీడియో సోషల్ మీడియా లో ఈరోజు రావడంతో చిత్ర పరిశ్రమ నివ్వెర పోయింది. తెలుగు సినిమాలో అఖండంగా వెలిగిన దాసరి నారాయణ రావు గారికి ఇలాంటి స్థితి వస్తుందని ఎవరూ ఊహించలేదు. హైద్రాబాద్ కు దూరంగా ఉండటం , సమాధిని వారి కుటుంబ సభ్యులు సందర్శించి నివాళులు అర్పిస్తున్నారనే ఉద్దేశ్యతో సినిమా రంగం వుంది . దాసరి నారాయణ రావు గారికి హరి హర ప్రభు, అరుణ్ కుమార్ , హేమాలయా కుమారి, ముగ్గురు సంతానం . దాసరి కుమార్తె హిమాలయ కుమారి ...