Posts

Image
  తెలంగాణ తొలి తరం నట రత్నం  పైడి జైరాజ్  తెలంగాణ ప్రాంతం నుంచి బొంబాయి నగరానికి వెళ్లి తన ఉనికిని చాటుకొంటూ హిందీ చిత్ర రంగంలో అత్యున్నత స్థాయికి ఎదిగి, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికైన  నటుడు పైడి జైరాజ్. జైరాజ్. శాంతారామ్, అశోక్ కుమార్, పృథ్వీరాజ్ కపూర్, మోతీలాల్ సమకాలీకుడైన జైరాజ్ ప్రతిభావంతుడైన నటుడు , నిర్మాత , దర్శకుడు . 'భారత కోకిల' సరోజిని నాయుడు భర్త ముత్యాల గోవింద రాజులు నాయుడు జైరాజ్ కు స్వయానా మేనమామ. అయినా ఆ విషయాన్ని ఎప్పుడూ ఆయన చెప్పుకోలేదు . జైరాజ్ 11 మూకీ చిత్రాల్లో , 156 టాకీ చిత్రాల్లో నటించాడు .  హిందీ తో పాటు ఉర్దూ , మరాఠీ , గుజరాతీ భాషల్లో వైవిధ్యమైన పాత్రల్లో నటించాడు .  జైరాజ్ పూర్తి పేరు పైడిపతి జైరుల  నాయుడు.  1909 సెప్టెంబరు 28న  కరీంనగర్ లో  అచ్యుతయ్య నాయుడు, తాయారమ్మ దంపతులకు జన్మించాడు. తండ్రి ఉద్యోగరీత్యా ఆ కుటుంబం హైదరాబాద్ కు వచ్చేసింది . జైరాజ్ విద్యాభ్యాసం ఇక్కడే సాగింది . చదువుకునే రోజుల్లోనే నటనపై ఆసక్తి ఏర్పడింది . నిజాం కళాశాలలో బీఎస్సీ చదువుతూ నాటకాల్లో నటించేవాడు . క్రమంగా చదువుకున్నా నాటకాలక...
Image
    అక్షరాల... సినిమా బయోపిక్‌ భగీరథ మీర్జాపురం రాణి... కృష్ణవేణి   ప్రముఖుల జీవితకథలు పుస్తకాలుగా నిరంతర ఆదరణకు నోచుకుంటాయి. అందులోనూ వారు సినీ తారలైతే ఇక చెప్పేది ఏముంది! సినీ తారల పట్ల అందరికీ ఉండే ఆసక్తి అలాంటిది. సదరు సినిమా తార అనేక విధాలుగా ప్రథమశ్రేణిలో నిలిచిన వ్యక్తి అయితే, చారిత్రకంగానూ ఆ రచనకు ప్రాధాన్యం ఉంటుంది. తొలి భారతీయ బాలల చిత్రం ‘సతీ అనసూయ – ధ్రువ విజయం’ (1936)లో టైటిల్‌ రోల్‌ ధరించడంతో మొదలుపెట్టి, హీరోయిన్‌గా ఎదిగి, దర్శక – నిర్మాత మీర్జాపురం రాజా వారితో వివాహంతో మహారాణిగా మారి, స్వయంగా నిర్మాత గా , శోభనాచలా సినీ స్టూడియో అధినేత్రిగా నిరూపించుకొని, నూరేళ్ళ నిండు జీవితం గడిపి, ఇటీవలే మరణించిన చిత్తజల్లు కృష్ణవేణి (1924 – 2025) జీవిత కథ అందుకనే ఆసక్తిగా అనిపిస్తుంది.   జీవితచరిత్రను సైతం కేవలం వివరాలు, విశేషాలను ఏకరవు పెట్టే రూపంలో కాకుండా, కాల్పనిక సాహిత్య మార్గంలో ఒక మంచి నవలను చదువుతున్న పద్ధతిలో అందించడం ఎప్పుడైనా ఆకర్షించే పద్ధతే. సమకాలీన రచయితలు కొందరు ఆ కోవలో అక్షరబద్ధం చేసిన జీవిత కథలు సాహితీ లోకానికి ఇప్పటికే సుపరిచితం.  రచ...
  సాహిత్య రంగంలో  భగీరథ ప్రస్థానం  తెలుగు సినిమా మరియు సాహిత్య రంగంలో భగీరథది ఓ ప్రత్యేకమైన శైలి . నాలుగున్న దశాబ్దాల నిరంతర కృషి , పట్టుదల  భగీరథను సమున్నతమైన స్థానంలో నిలబెట్టింది .   సినిమా పాత్రికేయుడు గా ప్రారంభమై , రచయితగా , కవిగా , చారిత్రిక  పరిశోధకులుగా  బహుముఖాలుగా ఎదిగారు  భగీరథ.  1956 మే 1వ తేదీన బాపట్ల జిల్లా నాగండ్ల గ్రామంలో రామస్వామి , వెంకాయమ్మ దంపతులకు జన్మించాడు భగీరథ. ప్రాధమిక విద్యను  నాగండ్లలో పూర్తి చేసి పావులూరు హైస్కూల్ లో పదవ  తరగతి వరకు చదివాడు . అప్పటికే నాగండ్ల , పావులూరు గ్రంథాలయాల్లో పుస్తకాలు చదవడం అలవాటయ్యింది . పదవ తరగతి చదువుతున్నప్పుడే కంద పద్యాలు రాయడం అలవాటయ్యింది . తెలుగు అధ్యాపకుడు యాచమనేని మాధవరావు ప్రోత్సహించాడు . 1971లో భగీరథ తన 15వ  ఏట ఇంటర్మీడియేట్ చదవడానికి హైదరాబాద్ వచ్చారు . భగీరథ అన్న కోటేశ్వర రావు ఇంట్లో ఉండి సత్యమ్మ నరసింహారావు స్మారక కలశాల లో చదువుకోసాగాడు . భగీరథ చిక్కడపల్లి లో ఉండేవాడు . ఆ ప్రక్కనే  అశోక్ నగర్ లో కేంద్ర గ్రంథాలయం  ఉండేది . భగీరథ ఆ గ్రంథాలయానికి...
Image
  రమణీయ ప్రేమ కథ  'నాగలాదేవి'                                                                                                                                                                    -  అక్షరాలు కుప్పపోస్తే పుస్తకమవుతుంది. అందులో రసార్ద్రత  వుండదు. వాక్యాలు పేరిస్తే కవిత్వమవుతుంది. అందులో గుండెను తట్టే అనుభూతి వుండదు. అక్షరాలు కుప్పపోయడం వాక్యాలు పేర్చడం మంచి రచన లక్షణం కాదని గ్రహించిన అనుభవం పండిన ఓ రచయిత కలం నుండి జాలువారిన రసప్రవాహం 'నాగలాదేవి' చారిత్రక నవల. "ఇతిహాసపు చీకటి కోణం అట్టడుగునపడి కాన్పించని  కథలన్నీ కావారిప్పుడు దాచేస్తే దాగనిసత్యం" - ...
Image
  ఎన్ .టి .ఆర్ 30వ వర్ధంతి  ఈరోజు మహానటుడు , ప్రజా నాయకుడు నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి . అప్పుడు ఆ మహానటుడు మనకు దూరమై మూడు దశాబ్దాలు అవుతుంది . ఎన్ .టి . రామారావు గారితో నాకు 1977 నుంచి పరిచయం వుంది . జర్నలిస్టు గా  అనేక ఇంటర్వ్యూలు చేశాను . 2023 రామారావు గారి శత జయంతి సంవత్సరంసందర్భంగా  వారితో నాకున్న అనుబంధం , ఆయన వ్యక్తిత్వం గురించి "మహా నటుడు - ప్రజానాయకుడు - ఎన్ .టి .ఆర్ " అన్న పుస్తకాన్ని వెలువరించాను . ఎన్ .టి .ఆర్ .శాశత జయంతి కమిటీ ఆధ్వర్యంలో "శకపురుషుడు ", "తారకరామం " అన్న పుస్తకాలకు సంపాదకత్వం వహించాను . రామారావు గారి వ్యకిత్వం చాలా విలక్షణమైనది.  రామారావు గారి వర్ధంతి నేడు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతుంది . ఆ మహనీయ కళాకారునికి స్మరిస్తూ ... !
Image
  ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో సంక్రాతి  ఈ సంవత్సరం ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో సంక్రాతి పండుగ సంబరాలు ఉత్సాహంగా జరిగాయి .  చిన బాబు , ఉమామహేశ్వర రావు తో కలసి కల్చరల్ సెంటర్ కు వెళ్ళాను .  ముఖ ద్వారము అంతా పూలతో అలంకరించారు .  కనుమ సందర్భంగా ఏర్పాట్లు బాగా చేశారు . ఎన్ .టి .ఆర్ .   లాన్  గంగి రెద్దులు, హరిదాసు ఉన్నారు . గంగిరెద్దులతో సభ్యులు ఫోటోలు  తీయించుకుంటున్నారు . పైన ఏ .ఎన్ .ఆర్ . లాన్ లో ఉత్సాహవంతులైన యువకులు గాలిపటాలను ఎగురవేస్తున్నారు .  వచ్చినవారికి సంక్రాతి శుభాకాంక్షలు చెబుతూ ఉత్సాహంగా తిరుగుతున్నారు కార్యదర్శి తుమ్మల రంగా రావు గారు .  నన్ను చూడగానే పలుకరించి 'గంగిరెద్దుల దగ్గర నిలబడండి ' అంటూ అక్కడకు తీసుకెళ్లి నిలబెట్టాడు భవాని . అలా తీసింది మీరు చూస్తున్న ఫోటో .  తరువాత రంగారావు గారు 'మా ఇద్దరినీ కూడా తీయండి ' అని మరో ఫోటో తీయించారు .  ఒక అరగంట కబుర్లు చెప్పుకున్న తరువాత మకర సంక్రాతి పండుగ స్పెషల్ లంచ్ కు వెళ్ళాము . 
Image
  ఈరోజు నిర్మాత దర్శకుడు కె .బి .తిలక్ శత జయంతి .  తెలుగు సినిమా రంగంలో కె .బి .తిలక్ ది . ఓ విభిన్నమైన , విలక్షణమైన శైలి .  నిర్మాతగా , దర్శకుడుగా ఆయన నిర్మించినవి తక్కువ సినిమాలే కానీ అన్నీ ఆణిముత్యాలే .  కె .బి .తిలక్ పూర్తి పేరు కొల్లిపర బాల గంగాధర తిలక్ .  తిలక్ తండ్రి వేంకటాద్రి , స్వాతంత్య్ర ససమర  యోధుడు . ఆయనపై జాతీయోద్యమ నాయకుడు బాల గాంధార తిలక్ ప్రభావం వుంది .  1926 జనవరి 14న జన్మించిన తన కుమారునికి బాల  గంగాధర తిలక్ అని పేరు పెట్టారు .  పశ్చిమ గోదావరి జిల్లాలోని దెందులూరు గ్రామంలో అక్కినేని శ్రీరాములు గారికి ఐదుగురు అబ్బాయిలు , ఒక అమ్మాయి . ఆ ఐదుగురిలో ఇద్దరు ఎల్ .వి . ప్రసాద్, మరొకరు అక్కినేని సంజీవి , ఆ అమ్మాయి పేరు సుబ్బమ్మ . ఈ సుబ్బమ్మే వెంకటాద్రి గారి భార్య , కె .బి .తిలక్ గారి అమ్మ ,  అంటే తిలక్ మేన మామలు ఎల్ .వి . ప్రసాద్, అక్కినేని సంజీవి.  తిలక్ మీద స్వాతంత్య్ర ఉద్యమ ప్రభావం వుంది . 16 ఏళ్ళ వయసులో  క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలు జీవితం అనుభవించాడు . చదువు మీద అంత ఆసక్తి లేదు . తన మేన మామ ఎల్ .వి ప్రసాద...