తెలంగాణ తొలి తరం నట రత్నం పైడి జైరాజ్ తెలంగాణ ప్రాంతం నుంచి బొంబాయి నగరానికి వెళ్లి తన ఉనికిని చాటుకొంటూ హిందీ చిత్ర రంగంలో అత్యున్నత స్థాయికి ఎదిగి, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికైన నటుడు పైడి జైరాజ్. జైరాజ్. శాంతారామ్, అశోక్ కుమార్, పృథ్వీరాజ్ కపూర్, మోతీలాల్ సమకాలీకుడైన జైరాజ్ ప్రతిభావంతుడైన నటుడు , నిర్మాత , దర్శకుడు . 'భారత కోకిల' సరోజిని నాయుడు భర్త ముత్యాల గోవింద రాజులు నాయుడు జైరాజ్ కు స్వయానా మేనమామ. అయినా ఆ విషయాన్ని ఎప్పుడూ ఆయన చెప్పుకోలేదు . జైరాజ్ 11 మూకీ చిత్రాల్లో , 156 టాకీ చిత్రాల్లో నటించాడు . హిందీ తో పాటు ఉర్దూ , మరాఠీ , గుజరాతీ భాషల్లో వైవిధ్యమైన పాత్రల్లో నటించాడు . జైరాజ్ పూర్తి పేరు పైడిపతి జైరుల నాయుడు. 1909 సెప్టెంబరు 28న కరీంనగర్ లో అచ్యుతయ్య నాయుడు, తాయారమ్మ దంపతులకు జన్మించాడు. తండ్రి ఉద్యోగరీత్యా ఆ కుటుంబం హైదరాబాద్ కు వచ్చేసింది . జైరాజ్ విద్యాభ్యాసం ఇక్కడే సాగింది . చదువుకునే రోజుల్లోనే నటనపై ఆసక్తి ఏర్పడింది . నిజాం కళాశాలలో బీఎస్సీ చదువుతూ నాటకాల్లో నటించేవాడు . క్రమంగా చదువుకున్నా నాటకాలక...