పోస్ట్‌లు

చిత్రం
  40 ఏళ్ల నాటి నాగార్జున  'విక్రమ్'  అక్కినేని నాగార్జున నటించిన 'విక్రమ్ ' సినిమా విడుదలై ఈరోజుకు (23 మే 986) 40 సంవత్సరాలు.  నాగార్జున సినిమా జీవితం ప్రారంభించి అప్పుడే నాలుగు దశాబ్దాలు అవుతుందా? కాలం ఎంత వేగంగా గడిచిపోతుంది ?  1979 ఫిబ్రవరిలో  నేను ఆంధ్ర జ్యోతి నుంచి వెలువడే 'జ్యోతి చిత్ర' సినిమా వార పత్రిక లో  రిపోర్టర్ గా చేరాను .  అప్పటి నుంచి నాగేశ్వర రావు గారితో నాకు పరిచయం వుంది .అప్పటి నుంచి తరచుగా వారిని కలుస్తూ ఉండేవాడిని.  1984లో నాగేశ్వర రావు గారు నటుడుగా 40 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఒక రోజు నన్ను వారి ఇంటికి ఆహ్వానించారు . అప్పుడు నాగేశ్వర రావు గారు బంజారా హిల్స్ లో ఉండేవారు . నేను వెళ్లిన తరువాత  హాల్ లోని రమ్మన్నారు .  సాయంత్రం వేళ నేను వెడితే వారితో హాల్ లోనే కూర్చునేవాడిని . తన 40 సంవత్సరాల సినిమా జీవితం గురించి ఒక ఆర్టికల్ కావాలని నన్ను అడిగారు . '40 సంవత్సరాల మీ సినిమా జీవితం గురించి నేనా ? అన్నాను' ఆశ్చర్యంగా .  'మీరు రాయగలరు . నేను మద్రాసులో వున్నప్పుడు నా ఆలోచనలకు దగ్గరగా ముళ్ళపూడి వెంకట రమణ గారు ...
చిత్రం
  స్మృతి పథంలో రామోజీ రావు గారు  తెలుగు నాటి నిత్యం వినిపించే పేరు రామోజీ రావు . రామోజీరావు గారు ఒక వ్యక్తిగా ప్రారంభమై వ్యవస్థగా ఎదిగారు .  1974లో ఈనాడు ప్రారంభించి, తెలుగు పత్రిక రంగాన్ని శాసించిన రామోజీ రావు గారు , 1984లో  ఉషాకిరణ్ మూవీస్ ప్రారంభించి తెలుగు సినిమా రంగంపై తనదైన ముద్రవేశారు . 1995లో ఈటీవీ తో తెలుగు వార్తా ప్రపంచంలో ఒక సంచలనం కలిగించారు .   1996లో తన పేరుతో ఏర్పాటు చేసిన ఫిలింసిటీ ఒక అద్భుతం . దేశానికే గర్వకారణం . 2005లో ప్రపంచంలోనే అతిపెద్ద చలనచిత్ర స్టూడియో గా రామోజీ ఫిలింసిటీ  గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో నమోదయ్యింది .  1984లో రామోజీ రావు గారిని మా జ్యోతి చిత్ర (ఆంధ్ర జ్యోతి సంస్థ నుంచి వెలువడే సినిమా వార పత్రిక ) కోసం ఇంటర్వ్యూ చేశాను . అప్పుడు నందమూరి  తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా వున్నారు . ఆ ఇంటర్వ్యూ లో తెలుగు సినిమా రంగం మద్రాసు నుంచు హైద్రాబాద్ కు తరలి రావాలంటే ప్రభుత్వం ఏమి చెయ్యాలి .. అనేది ప్రముఖంగా ప్రస్తావించడం జరిగింది .  అప్పటి నుంచి వారు నేనంటే ఎంతో అభిమానంగా ఉండేవారు .  1987లో జరిగిన మా వివాహ...
చిత్రం
  స్టాలిన్ తో రజనీకాంత్ సమావేశం అందుకేనా ? తమిళనాడులో నటుడు విజయ్ పార్టీ అధికారంలోకి వస్తుందని అందరూ భావించారు . విజయ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాధ్ అర్లేకర్ కలసి తనకు కాంగ్రెస్ పార్టీ తో 112 మంది మద్దతు ఉందని , ప్రభుత్వం ఏర్పాటుచేసే అవకాశం ఇవ్వమని విజ్ఞప్తి చేశాడు . అయితే ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి 118 మంది శాసన సభ్యులు అవసరమని గవర్నర్ స్పష్టం చేశాడు . గురువారం చెన్నై లోని నెహ్రు స్టేడియం లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి కూడా ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలో గవర్నర్  ఎలా చెప్ప్పడం విజయ్ కు మింగుడుపడలేదు . ఎన్నికల్లో నెగ్గిన పార్టీల్లో ఎక్కువ సీట్లు గెలిచిన పార్టీని  గవర్నర్ ప్రభుత్వం ఏర్పాటు చెయ్యమని ఆహ్వానించడం ఆనవాయితీ . అదే పద్దతిని గవర్నర్ రాజేంద్ర విశ్వనాధ్ అర్లేకర్ అనుసరిస్తాడని విజయ్ నమ్మాడు . విజయ్ కు కాంగ్రెస్ పార్టీ  మద్దతు ఇస్తామని అధికారికంగా ప్రకటించడం , లేఖ ఇవ్వడం తో గవర్నర్ మాట మార్చి వుండవచ్చున్నాని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు .  సుబ్రహ్మణ్య స్వామి లాటి రాజ్యాంగ నిపుణులు కూడా గవర్నర్ చర్య ను తప్పుపడుతున్నారు. ఇదిలా ఉండగా తమిళ సూపర్ స్టార్...
చిత్రం
          నేడు దాసరి నారాయణ రావుగారి  84వ జయంతి.  తెలుగు సినిమా రంగంలో ఏకైక దర్శక రత్న దాసరి నారాయణ రావు గారు .  1972లో 'తాతా మనవడు ' సినిమాతో దర్శకుడుగా  ప్రారంభమైన ఆయన జీవితం 2014 'ఎర్ర బస్సు ' వరకు అప్రతిహతంగా సాగింది . తెలుగు ,హిందీ భాషల్లో 150 చిత్రాలకు దర్శకత్వం వహించారు . 50 పైగా సినిమాలను నిర్మించారు .  వ్యక్తిగా మొదలైన ఆయన వ్యవస్థగా ఎదిగారు . ఎవరికీ ఈ అవసరం వున్నా నేనున్నా అని భరోసా ఇచ్చారు . సినిమా రంగంలోనే కాకుండా 'ఉదయం ' పత్రికను ప్రారంభించి జర్నలిజం లో సంచలనం సృష్టించారు .  రాజకీయాల్లో చేరి కేంద్ర మంత్రిగా పనిచేశారు .  దాసరి ఎంత ఎదిగినా అహం రాలేదు కానీ ఆత్మాభిమానం మాత్రం ఆయన వెన్నంటే ఉండేది .  మంచితనం , మనిషితనం  ఆయన సహజ లక్షణాలు .  దాసరి నారాయణ రావు గారు లేని లోటు తెలుగు సినిమా రంగంలో ఎప్పటికీ భర్తీ కాదు . తెలుగు సినిమాలో దాసరి ఒక్కడే ... ఆయనకు సాటి మరొకరు లేరు , రారు .   దాసరి నారాయణ రావు గారితో నాకు ఎన్నో మధురమైన అనుభవాలు ఉన్నాయి .  దాసరి అందరివాడు . అందరికీ అందుబాటులో ఉండేవాడు , ఆత...
చిత్రం
  ఈరోజు మహాకవి శ్రీ శ్రీ 116వ జయంతి. శ్రీరంగం శ్రీనివాసరావు అనే శ్రీ శ్రీ తో నా సాహిత్య జీవితం మొదలైంది . 1980 జూన్ 1వ తేదీన నేను రచించిన 'మావవత' అనే కవితా సంపుటికి శ్రీ శ్రీ ముందు మాటను వ్రాసి స్వయంగా  ఆవిష్కరించారు . 46 సంవత్సరాల క్రితం హైదరాబాద్ లోని  అశోక్ నగర్ కేంద్ర గ్రంథాలయంలో ఈ కార్యక్రమాన్ని కిన్నెర రఘురాం ఏర్పాటు చేశారు . ఈ కార్యక్రమానికి అప్పటి హై కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి ఆవుల సాంబశివ రావు గారు అధ్యక్షత వహించారు . నిర్మాత దర్శకుడు ఉప్పలపాటి విశ్వేశ్వర రావు ముఖ్య అతిధిగా వచ్చారు .  సీనియర్ జర్నలిస్ట్ జి .ఎస్ .వరదాచారి , మా గురువు ఆచార్య తిరుమల అతిధులుగా పాల్గొన్నారు . సీనియర్ న్యాయవాది అడుసుమిల్లి పాండురంగారావు గారికి 'మానవత ' పుస్తకాన్ని అంకితం ఇచ్చాను . ఆ నాటి సభలో నిర్మాత, దర్శకులు పి .పుల్లయ్య , ఆవుల మంజులత , పంపిణీదారు వెంకట రావు , జర్నలిస్ట్ ఉడయవర్లు, నటి కృష్ణవేణి , మా సోదరుడు కోటేశ్వర రావు , మిత్రుడు ఎన్ .వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు .  నా జీవితంలో అదోగ మధురమైన జ్ఞాపకం .  
చిత్రం
  హైదరాబాద్ సినిమాకు మార్గదర్శకుడు  - దుక్కిపాటి మధుసూదన రావు  సినిమా నిర్మాత అంటే ...? కేవలం డబ్బు పెట్టేవాడు కాదు . సినిమా రంగం , ఆ రంగంలోని అన్ని శాఖల గురించి క్షుణ్ణంగా తెలిసినవాడు . కథ , కథనం , మాటలు , పాటలు , సంగీతం , నటీనటులు , సాంకేతిక నిపుణులు , సినిమా చిత్రీకరణకు అనువైన స్థలాల ఎంపిక , నిర్మాణం , సినిమా ప్రచారం , పంపిణీ, ఇవ్వన్నీ సంపూర్ణంగా తెలిసినవాడే అసలైన చిత్ర నిర్మాత. అలాంటివారిలో నిస్సందేహంగా దుక్కిపాటి మధుసూనరావు గారు మొదటి వరుసలో వుంటారు.   మధుసూదనరావు గారు అనుభవం, అభిరుచి కల నిర్మాత. సమాజానికి సందేశాత్మ చిత్రాలను అందించాలనే స్పృహ వున్న మంచి మనిషి .   అన్నపూర్ణ పిక్చర్స్ దుక్కిపాటి మధుసూదన రావు గారు హైదరాబాద్ చలన చిత్ర అభివృద్ధిలో నిర్వహించిన పాత్ర అపూర్వం , అనితర సాధ్యం. అక్కినేని నాగేశ్వర రావు సినిమా జీవితాన్ని తీర్చిదిద్దింది  దుక్కిపాటి మధుసూదన రావు గారే. అక్కినేని కోసం ఆయన సినిమా  రంగానికి వచ్చారు , అక్కినేని కోసమే చిత్ర నిర్మాణం మొదలు పెట్టారు . ఆయనతో పాటు చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం కృషి చేశారు . దుక్కిపాటి మధుసూదన రా...
చిత్రం
  చంద్ర బాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు  నవ్యాంధ్ర నిర్మాత , అమరావతి నగర స్వాప్నికుడు  ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్ర బాబు నాయుడు గారికి 76వ  జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాంటి ఆనందకరమైన  వేడుకలు మరెన్నో చేసుకోవాలి , తెలుగువారి కీర్తిని మరింత విశ్వ వ్యాప్తం చెయ్యాలి .