పోస్ట్‌లు

చిత్రం
  ఇచ్చిన మాట నిలబెట్టుకున్న  డాక్టర్ వై .ఎస్ .ఆర్ .  ఈరోజు ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై .ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి 77వ జయంతి.  రాజశేఖర్ రెడ్డి గారి వ్యక్తిత్వం ఎంత సమున్నతమైనదో, ఇచ్చిన మాటను ఎలా నిలబెట్టుకున్నారో  ఈ సంఘటన తెలియజేస్తుంది .  2004లో మే 14న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా  డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారుప్రమాణ స్వీకారం చేశారు . అప్పుడు వారు  సోమాజిగూడలోని రాజ్‌భవన్ రోడ్డులో ఉన్న లేక్ వ్యూ గెస్ట్ హౌస్ నుంచి తన అధికార  కార్యక్రమాలను నిర్వహించేవారు.  1978లో ఫిలిం నగర్ కు అంకురార్పణ జరిగింది. 1984- 85 వరకు చిత్ర పరిశ్రమ హైద్రాబాద్లో సంపూర్ణంగా స్థిరపడింది.  నిర్మాత, దర్శకుడు వి .బి .రాజేంద్ర ప్రసాద్ గారు చైర్మన్ గా 2004 జులై 14న  'ఫిలిం నగర్ దైవ సన్నిధానం '  పేరుతో  దేవాలయం ప్రారంభమైంది.  అక్టోబర్ మొదటి వారంలో ఈ దేవాలయ సందర్శనకు ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారిని ఆహ్వానించడానికి  రాజేంద్ర ప్రసాద్ గారితో పాటు నేను కూడా లేక్ వ్యూ గెస్ట్ హౌస్ కు వెళ్ళాను. మాకు అప్పటి సమాచార శాఖ కమీషనర్ డాక్...
చిత్రం
 డాక్టర్ వై .ఎస్ . రాజశేఖర్ రెడ్డి గారి 77వ జయంతి.  ఈరోజు ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై .ఎస్ . రాజశేఖర్ రెడ్డి గారి 77వ జయంతి.  2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా  డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారుప్రమాణ స్వీకారం చేసిన తర్వాత,   సోమాజిగూడలోని రాజ్‌భవన్ రోడ్డులో ఉన్న లేక్ వ్యూ గెస్ట్ హౌస్ నుంచి తన అధికార  కార్యక్రమాలను నిర్వహించారు. నిర్మాత , దర్శకుడు వి .బి .రాజేంద్ర ప్రసాద్ గారు  2004లో 'ఫిలిం నగర్ దైవ సన్నిధానం '  పేరుతో ఒక దేవాలయాన్ని ఫిలిం నగర్ లో నిర్మించారు. ఈ దేవాలయానికి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారిని ఆహ్వానించడానికి అక్టోబర్ మొదటి వారంలో రాజేంద్ర ప్రసాద్ గారితో పాటు నేను కూడా లేక్ వ్యూ గెస్ట్ హౌస్ కు వెళ్ళాను . మాకు అప్పటి సమాచార శాఖ కమీషనర్ డాక్టర్ కె .వి. రమణాచారి మాకు సమయం ఇప్పించారు . ఆరోజు ఉదయం మేము లేక్ వ్యూ కు వెళ్ళాము . రాజశేఖర్ రెడ్డి గారి కోసం హాల్ లో చాలా మంది వేచి వున్నారు .  సరిగ్గా 9.30 గంటలకు మేమున్న హాల్ లోకి  రాజశేఖర్ రెడ్డి గారు వచ్చారు . అందరినీ కలసి మాట్లాడి పంపించిన తరువాత మా దగ్గరకు వచ్...
చిత్రం
  జన్మదిన శుభాకాంక్షలు  భారత మాజీ ఉప రాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారికి 77వ జన్మదిన శుభాకాంక్షలు . మీరు ఇలాంటి జన్మదినోత్సవాలు ఎన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. 
చిత్రం
  పద్మశ్రీ పురస్కార గ్రహీతలకు ప్రధాని అభినందనలు   పద్మ అవార్డుల రెండవ విడత ప్రదానోత్సవం మంగళవారం రాష్ట్రపతి భవన్ లో అత్యంత వైభవంగా జరిగింది . రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 65 మంది ప్రముఖులకు ఈ అవార్డులను ప్రదానం  చేశారు . ఇందులో ఇద్దరు పద్మ విభూషణ్ , ఏడుగురు పద్మ భూషణ్ , 56మంది పద్మశ్రీ పురస్కారాన్ని స్వీకరించారు .  న్యూ ఢిల్లీ రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ , ప్రధాని నరేంద్ర మోడీ , లోక సభాపతి ఓం బిర్లా , మాజీ రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ , హోమ్ మంత్రి అమిత్ షా , విమాన శాఖా మంత్రి కె .రామ మోహన్ నాయుడు , కేంద్ర మంత్రి బండి సంజయ్ తదితరులు హాజరయ్యారు . ఈసారి పద్మశ్రీ పురస్కారాన్ని నటులు మాగంటి మురళీ మోహన్ , గద్దె రాజేంద్ర ప్రసాద్ స్వీకరించారు. సినిమా రంగంలో వీరు సాధించిన విజయానికి ఈ అవార్డు లభించింది .  2026 పద్మ పురస్కార గ్రహీతల జీవితం ఎంతో  స్ఫూర్తిదాయకమని  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు.  జూన్ 23న రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్న ప్రధాని మోడీ అందరినీ  అభినందించారు .  రాష్...
చిత్రం
  అభ్యుదయ దర్శకుడు, అసమాన దార్శనికుడు   గూడవల్లి రామబ్రహ్మం   తెలుగు సినిమా చరిత్రలో గూడవల్లి రామ బ్రహ్మం గారిది  ఓ సంచలన అధ్యాయం.  సినిమా కేవలం వినడా సాధనం మాత్రమే కాదు, దీని ద్వారా సామాజిక ప్రయోజనం సాధించవచ్చునని నిరూపించిన అభ్యుదయ దర్శకుడు రామ బ్రహ్మం. ఆయన మొదట జర్నలిస్ట్ , ఆ తరువాత సినిమా దర్శకుడు.  ఈ రెండు మాధ్యమాల ద్వారా ప్రజలను చైతన్యవంతులను  చేయాలని నిరంతరం కృషి చేసిన అభ్యుదయ మూర్తి , చైతన్య స్ఫూర్తి రామ బ్రహ్మం. ఆయన   జూన్ 24, 1898 న కృష్ణా జిల్లా, ఉంగుటూరు మండలము నందమూరు గ్రామంలో గూడవల్లి వెంకయ్య, బాపమ్మలకు  జన్మించాడు.  ఆయన చదువు ఇందుపల్లి, గుడివాడ, బందరులలో సాగింది. చిన్నప్పటి నుంచి ఎంతో చురుకుగా ఉండేవాడు .  18 ఏళ్ళ వయసులో  కోగంటి నాగయ్య కుమార్తె శారదాంబతో రామ బ్రహ్మానికి వివాహం జరిగింది.మామ గారి ఇంట్లో  కొన్నాళ్ళు ఉండి గాంధీ గారి పిలుపుతో సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నాడు. 1924లో విజయవాడలో ఫ్రెండ్స్ అండ్ కో అనే పేరుతో ఒక గడియారాల వ్యాపారం ప్రారంభించాడు. అయితే అక్కడ వ్యాపారం స్నేహితులతో , రాజకీయ ...
చిత్రం
సావేరి 'నిష్ఫల ప్రేమ'.     మేల్ ప్రాస్టిట్యూషన్ గురించి తెలుగు సాహిత్యంలో వచ్చిన నవలలు చాలా అరుదు. ఈ నేపథ్యంతో నవల రాయడం సాహసమే. ఇటువంటి సాహసాన్నిసీనియర్  జర్నలిస్ట్ మరియు రచయిత అయిన భగీరథ గారు తన రెండో నవల  ‘సావేరి’ ద్వారా చేశారు. ఈ నవల ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడింది. 2010 లో నవలగా వెలువడింది. ఈ సంస్కృతి గురించి అప్పట్లో దిన పత్రికలో వచ్చిన ఓ వార్త ఆధారంగా ఈ నవలను రాసినట్టు రచయిత తన ముందుమాటలో పేర్కొన్నారు. అలాగే ఈ సావేరి కథను సినిమాగా తీయాలని నటి జయసుధ గారు అనుకున్నప్పటికి అది సాధ్యపడలేదని కూడా రాశారు.  కలకత్తా వేదికగా ఈ కథ జరిగినా, ఈ కథ ద్వారా మనసులు మలీనం కానంతవరకు శరీరాలు కావు అని చెప్పే ప్రయత్నం చేసినా ఆ సూత్రం ఒక్క శ్రీరాజ్ పాత్రకు మాత్రమే వర్తించి, గీతాంజలి పాత్రకు అంతగా వర్తించలేదేమో అనిపిస్తుంది.  శ్రీరాజ్ అనే యువకుడు అమెరికాలో  విద్య పూర్తి చేసుకుని  హైదరాబాద్ లో స్థిరపడతాడు. ఒక  ఎలక్ట్రానిక్ కంపెనీలో  సాంకేతిక సలహాదారుడుగా  నియమితులవుతాడు. ఆ సందర్భంగా పరిచయాలు పెంచుకొవడానికి  స్టార్ హోటల్ లో  ఓ పార్...
చిత్రం
  రాజబాబు 69 జయంతి  మిత్రుడు బొడ్డు  రాజుబాబు 69వ స్మారక  అవార్డుల కార్యక్రమం శనివారం నాడు హైదరాబాద్  ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో  జరిగింది. వివిధ రంగాలలో నిష్ణాతులైన ప్రముఖ వ్యక్తులను ఈ సందర్భంగా నిర్వాహకులు సత్కరించాము .  రాజ బాబు మిత్ర బృందం కాకాని బ్రహ్మం , నాగేశ్వర రావు ,నర్రా  వెంకట రావు , బాలాజీ, కుమార్ , కుటుంబ సభ్యులు రమేష్,వీరన్న తో పాటు నేను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాను .  రాజబాబు స్మారక అవార్డులను మా ఎన్ .టి .ఆర్ . కమిటీ చైర్మన్ ,టి డి .జనార్దన్ , దర్శకుడు ఎ. కోదండ రామిరెడ్డి,నటులు  ప్రదీప్, కాదంబరి కిరణ్ కుమార్,  కోట శంకర రావు, సీనియర్ జర్నలిస్ట్ భావన్నారాయణ , నటీ గీతా భాస్కర్, విద్యావేత్త మేఘన ముసునూరి, నటుడు శశాంక్ స్వీకరించారు  .  ఈ కార్యక్రమంలో తుమ్మల రంగారావు , దర్శకులు బి .గోపాల్, వీర శంకర్, ఎస్ .పి .నాగేశ్వర రావు, చుక్కా కొండయ్య, కోటి రెడ్డి , మల్లికార్జున్   తదితరులు పాల్గొన్నారు .