Posts

Image
  ఈరోజు ఈనాడు దిన పత్రిక ఆదివారం అనుబంధం లో  "మీర్జాపురంరాణి -కృష్ణవేణి " పుస్తకం గురించి వచ్చిన సమీక్ష . ప్రచురించిన సంపాదకులకు  కృతజ్ఞతలు . రచన : భగీరథ ,పేజీలు : 516, వెల రూ  :750 ప్రతులకు – శ్రుతి  బిజినెస్ సెంటర్ - 040- 23555617, అచ్చంగా తెలుగు 85588 99478.  మరియు నవోదయ  బుక్ హౌస్ : 92474 71361.
Image
  ఈరోజు లీడర్  దిన పత్రిక లో  "మీర్జాపురంరాణి -కృష్ణవేణి "  పుస్తకం గురించి వచ్చిన సమీక్ష . ప్రచురించిన సంపాదకులు రమణ మూర్తి గారికి   కృతజ్ఞతలు . 
Image
           భగీరథ ప్రయత్నం "మీర్జాపురంరాణి - కృష్ణవేణి" భగీరథ తాజా పుస్తకం "మీర్జాపురంరాణి - కృష్ణవేణి " చదివాను . ఇది అలనాటి నటీమణి కృష్ణవేణి గారి జీవిత చరిత్ర . జీవిత చరిత్రలు చదవడానికి ఎంతో ఆసక్తిగా ఉంటాయి . అయితే జీవిత చరిత్ర అనగానే ఆయా వ్యక్తుల జీవితాన్ని కేంద్ర బిందువుగా చేసుకొని మాత్రమే రచయితు రాస్తుంటారు . ఇందులో ఆయా కాలానికి సంబంధించిన విషయాలు , సంఘటనలు బహు అరుదుగా కనిపిస్తాయి . రచయితలు కేవలం ఆయా  వ్యక్తుల మీదనే ఎక్కువ ద్రుష్టి కేంద్రీకరిస్తారు . మిగతావి పట్టించుకోరు .  "మీర్జాపురం రాణి - కృష్ణవేణి ' ఈ ధోరణికి భిన్నంగా , సరికొత్తగా , ఆయా కాలంలో జరిగిన సంఘటనలు , ఆ వ్యక్తి పై ప్రభావం చూపించిన  వ్యక్తులు , ఆ ఘటనల పూర్వాపరాలను సరళమైన భాషలో వివరించడం దీని ప్రత్యేకత. అందువల్లనే ఈ రచనకు పరిపూర్ణత వచ్చింది .  భగీరథ ఇంతకు ముందు వ్రాసిన చారిత్రిక నవల "నాగలాదేవి "  తెలుగు నవలా సాహిత్యంలో ఓ ట్రెండ్ సెట్టర్ . ఎందుకంటే ఈ నవలలో  రచయిత ఓ గొప్ప ప్రయోగం చేశారు . శ్రీకృష్ణదేవరాయలకు సంబంధించిన చారిత్రిక ఘట్టాలను , నాగలాదేవి జీవితానికి...
Image
                 "బడుగు బలహీన వర్గాల కోసమే  తెలుగు దేశం "                                                          - ఎన్ .టి  రామారావు  1982 ఏప్రిల్ 1 వ తేదీ గురువారం నాడు  2. 30 గంటలకు రామారావు గారితో రామకృష్ణ స్టూడియోస్  లోని  వారి కార్యాలయంలో నేను చేసిన అరుదైన ఇంటర్వ్యూ . .                                  *                     *                      *                             *                            * తెలుగుదేశం గట్టి ప్రతి ప...
Image
  మీర్జాపురం రాణి కృష్ణవేణి’  ఈ చరిత్ర అపురూపం   సీనియర్  జర్నలిస్టు- ప్రముఖ రచయిత భగీరథ గారు  పుస్తకం తీసుకొస్తున్నారని తెలియగానే ఆనందపడ్డాను.  కానీ 516 పేజీల పుస్తకం అంటే ... ! చాలా ఆశ్చర్యపోయాను.  ఇది ఆమె  ఆత్మకథా?  లేక ఆమె  ఇంటర్వ్యూలు, ఆమె గురించి వాళ్లు వీళ్లు రాసిన వ్యాసాల సంకలనమా?  ఆ ఆత్రంతోనే పుస్తకం వచ్చి రాగానే టకటకా తిరగేసేశాను.  నాలో ముందు రేగిన రెండు సందేహాలూ తప్పే.  ఇది కృష్ణవేణి గారి ఆత్మ కథ కాదు. వ్యాసాల సంకలనం అంతకంటే కాదు. చూస్తుంటే నవలలా అనిపించింది. చదవడం మొదలు పెట్టాను.  అసలు ఎత్తుగడే ఆసక్తికరంగా అనిపించింది.  1936 జనవరి నెలలో రాజమండ్రిలో ఓ సాయంత్రం పూట శివుడి గుడిలో ‘శ్రీకృష్ణ తులాభారం’ నాటక ప్రదర్శనతో ఈ పుస్తకం మొదలవుతుంది.  ఆ నాటికలో సత్యభామ పాత్ర ధరించిన ఓ అమ్మాయిని మద్రాసు నుంచి ప్రత్యేకంగా వచ్చిన ఓ వ్యక్తి గమనించడంతో అసలు కథ మొదలవుతుంది.  ఆ అమ్మాయి మన కథానాయిక కృష్ణవేణి.  ఆ వచ్చినతను రేలంగి వెంకట్రామయ్య .  ఇక్కడ్నుంచీ కృష్ణవేణి సినిమాల్లోకి ఎలా వెళ్లారు, ఎన్ని ...
Image
  మీర్జాపురం రాణి కృష్ణవేణి’  ఈ చరిత్ర అపురూపం   సీనియర్  జర్నలిస్టు- ప్రముఖ రచయిత భగీరథ గారు  పుస్తకం తీసుకొస్తున్నారని తెలియగానే ఆనందపడ్డాను.  కానీ 516 పేజీల పుస్తకం అంటే ... ! చాలా ఆశ్చర్యపోయాను.  ఇది ఆమె  ఆత్మకథా?  లేక ఆమె  ఇంటర్వ్యూలు, ఆమె గురించి వాళ్లు వీళ్లు రాసిన వ్యాసాల సంకలనమా?  ఆ ఆత్రంతోనే పుస్తకం వచ్చి రాగానే టకటకా తిరగేసేశాను.  నాలో ముందు రేగిన రెండు సందేహాలూ తప్పే.  ఇది కృష్ణవేణి గారి ఆత్మ కథ కాదు. వ్యాసాల సంకలనం అంతకంటే కాదు. చూస్తుంటే నవలలా అనిపించింది. చదవడం మొదలు పెట్టాను.  అసలు ఎత్తుగడే ఆసక్తికరంగా అనిపించింది.  1936 జనవరి నెలలో రాజమండ్రిలో ఓ సాయంత్రం పూట శివుడి గుడిలో ‘శ్రీకృష్ణ తులాభారం’ నాటక ప్రదర్శనతో ఈ పుస్తకం మొదలవుతుంది.  ఆ నాటికలో సత్యభామ పాత్ర ధరించిన ఓ అమ్మాయిని మద్రాసు నుంచి ప్రత్యేకంగా వచ్చిన ఓ వ్యక్తి గమనించడంతో అసలు కథ మొదలవుతుంది.  ఆ అమ్మాయి మన కథానాయిక కృష్ణవేణి.  ఆ వచ్చినతను రేలంగి వెంకట్రామయ్య .  ఇక్కడ్నుంచీ కృష్ణవేణి సినిమాల్లోకి ఎలా వెళ్లారు, ఎన్ని ...
Image
మీర్జాపురం రాణి కృష్ణవేణి - సినిమా రంగంలో ఆణిముత్యం మనకు పరిశోధన ఆధారిత చారిత్రక నవలలు చాలా ముఖ్యమైనవి, ఎందుకంటే అవి చరిత్రకు సృజనాత్మక కథనానికి మధ్య వారధిగా నిలుస్తాయి. ఆ చారిత్రక గతాన్ని సజీవంగా పాఠకుల ముందు నిలిపి మనకు కచ్చితమైన అనుభవాన్నిస్తుంది . పరిశోధన ఆధారిత చారిత్రక నవలలు, ప్రాథమిక చరిత్ర ఆధారాలు, శాసనాలు మరియు చారిత్రక ఆధారాలు , అనుభవజ్ఞుల నుండి గ్రహించిన విషయాల ఆధారంగా కథనాలను రూపొందించడం జరుగుతుంది . ఈ నవలలు పాఠకులను ఆ కాలంలోకి తీసుకువెళ్లి, వారిలో నమ్మకాన్ని పెంచి, స్పష్టమైన చారిత్రక విషయాలను సజీవంగా మనకు అందిస్తాయి. అంతే కాకుండా చరిత్రలో వదిలివేసిన ఖాళీలను సైతం పూరిస్తాయి. మరుగున పడిపోయిన అనేక చారిత్రాత్మక సంఘటనలను,ఆయా కాలాలలోని ప్రజల జీవన విధానం ఈ తరం పాఠకులకు అందుబాటులోకి తీసుకురావడానికి చేసే గొప్ప ప్రయత్నం. అలాంటి పరిశోధన ఆధారిత నవలలు రాసిన ఘనత భగీరథ గారిది . వారు రచించిన ‘నాగలాదేవి, ‘మీర్జాపురం రాణి కృష్ణవేణి ’.ఈ కోవకు చెందుతాయి . గత 18 ఏండ్లుగా భగీరథ గారు చారిత్రక పరిశోదనకు అంకితమై కాకతీయ , విజయనగర సామ్రాజ్యాల గురించి విస్తృతమైన పరిశోధన చేశారు . ఆ పరిశ...