నేడు దాసరి నారాయణ రావుగారి 84వ జయంతి. తెలుగు సినిమా రంగంలో ఏకైక దర్శక రత్న దాసరి నారాయణ రావు గారు . 1972లో 'తాతా మనవడు ' సినిమాతో దర్శకుడుగా ప్రారంభమైన ఆయన జీవితం 2014 'ఎర్ర బస్సు ' వరకు అప్రతిహతంగా సాగింది . తెలుగు ,హిందీ భాషల్లో 150 చిత్రాలకు దర్శకత్వం వహించారు . 50 పైగా సినిమాలను నిర్మించారు . వ్యక్తిగా మొదలైన ఆయన వ్యవస్థగా ఎదిగారు . ఎవరికీ ఈ అవసరం వున్నా నేనున్నా అని భరోసా ఇచ్చారు . సినిమా రంగంలోనే కాకుండా 'ఉదయం ' పత్రికను ప్రారంభించి జర్నలిజం లో సంచలనం సృష్టించారు . రాజకీయాల్లో చేరి కేంద్ర మంత్రిగా పనిచేశారు . దాసరి ఎంత ఎదిగినా అహం రాలేదు కానీ ఆత్మాభిమానం మాత్రం ఆయన వెన్నంటే ఉండేది . మంచితనం , మనిషితనం ఆయన సహజ లక్షణాలు . దాసరి నారాయణ రావు గారు లేని లోటు తెలుగు సినిమా రంగంలో ఎప్పటికీ భర్తీ కాదు . తెలుగు సినిమాలో దాసరి ఒక్కడే ... ఆయనకు సాటి మరొకరు లేరు , రారు . దాసరి నారాయణ రావు గారితో నాకు ఎన్నో మధురమైన అనుభవాలు ఉన్నాయి . దాసరి అందరివాడు . అందరికీ అందుబాటులో ఉండేవాడు , ఆత...