నేడు దాసరి నారాయణ రావుగారి 84వ జయంతి.
తెలుగు సినిమా రంగంలో ఏకైక దర్శక రత్న దాసరి నారాయణ రావు గారు .
1972లో 'తాతా మనవడు ' సినిమాతో దర్శకుడుగా ప్రారంభమైన ఆయన జీవితం 2014 'ఎర్ర బస్సు ' వరకు అప్రతిహతంగా సాగింది .
తెలుగు ,హిందీ భాషల్లో 150 చిత్రాలకు దర్శకత్వం వహించారు . 50 పైగా సినిమాలను నిర్మించారు .
వ్యక్తిగా మొదలైన ఆయన వ్యవస్థగా ఎదిగారు . ఎవరికీ ఈ అవసరం వున్నా నేనున్నా అని భరోసా ఇచ్చారు .
సినిమా రంగంలోనే కాకుండా 'ఉదయం ' పత్రికను ప్రారంభించి జర్నలిజం లో సంచలనం సృష్టించారు .
రాజకీయాల్లో చేరి కేంద్ర మంత్రిగా పనిచేశారు .
దాసరి ఎంత ఎదిగినా అహం రాలేదు కానీ ఆత్మాభిమానం మాత్రం ఆయన వెన్నంటే ఉండేది .
మంచితనం , మనిషితనం ఆయన సహజ లక్షణాలు .
దాసరి నారాయణ రావు గారు లేని లోటు తెలుగు సినిమా రంగంలో ఎప్పటికీ భర్తీ కాదు .
తెలుగు సినిమాలో దాసరి ఒక్కడే ... ఆయనకు సాటి మరొకరు లేరు , రారు .
దాసరి నారాయణ రావు గారితో నాకు ఎన్నో మధురమైన అనుభవాలు ఉన్నాయి .
దాసరి అందరివాడు . అందరికీ అందుబాటులో ఉండేవాడు , ఆత్మీయతను పంచేవాడు .
మే 4, 1942న పాలకొల్లు లో జన్మించిన దాసరి తన 75వ ఏట మే 30, 2017న హైదరాబాద్ లో మరణించారు .
దాసరి ఎప్పటికీ తెలుగు సినిమాలో స్మరణీయుడే .



.jpg)
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి