ఉప ముఖ్యమంత్రి భట్టికి ' శకపురుషుడు'
ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఆర్థిక, ప్రణాళిక, ఇంధన శాఖలు నిర్వహిస్తున్న శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారిని కలసి 'శకపురుషుడు ' పుస్తకాన్ని బహుకరించాను.
ఎన్ .టి .రామారావు గారి జయంతి సందర్భంగా ఎన్ .టి .ఆర్. శత జయంతి కమిటీ వెలువరించిన ఈ పుస్తకానికి నేను, విక్రమ్ సంపాదకులం.
నాతో పాటు నిర్మాత చిన బాబు (డీవీకే రాజు) , సీనియర్ జర్నలిస్టులు కె. ఉమామహేశ్వర రావు , దుర్గ వడ్లమాని కూడా ఉప ముఖ్య మంత్రి గారిని కలవడం జరిగింది .
చిన బాబు గారు తమ తండ్రి డీవీఎస్ రాజు గారి జీవిత చరిత్ర 'అంతరంగ తరంగాలు ' దుర్గ గారు సూర్యకాంతమ్మ శత జయంతి సందర్భంగా వెలువరించిన 'తెలుగింటి అత్త గారు ' పుస్తకాలను భట్టి విక్రమార్క గారికి బహుకరించారు .
ఇవ్వాళ ఉదయమా 10. 30 గంటలకు ప్రగతి భవన్ లో ఉప ముఖ్యమంత్రి భట్టిని గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది .
మేము నలుగురం గత నెలలో జరిగిన గద్దర్ ఫిలిం అవార్డుల కమిటీలో సభ్యులుగా పనిచేశామని , తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డుల కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించినందుకు భట్టి గారికి అభినందనలు తెలిపాము .
మీ అందరి సమష్టి కృషి వల్లనే మేము విజయవంతంగా నిర్వహించామని భట్టి అన్నారు . మంచి పుస్తకాలను బహుకరించినందుకు థాంక్స్ చెప్పి తప్పకుండా చదువుతాను అన్నారు .
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు మాతో ఆత్మీయంగా మాట్లాడారు .
వారికి ధన్యవాదాలు తెలిపాము.
Comments
Post a Comment