తెలుగు సినిమా ప్రస్థానం .... !? ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలనే ఉద్దేశ్యతో ప్రభుత్వం ఆలస్యంగానైనా ఎఫ్ .డి .సి . బోర్డును నియమించింది . ఈ బోర్డు చైర్మన్ గా పంపిణీదారు పి .భరత్ భూషణ్ , వైస్ చైర్మన్ గా దర్శకుడు మెహర్ రమేష్ , సభ్యులుగా హీరో సుమన్, నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు , హీరో శివాజీ , రచయిత బుర్ర సాయి మాధవ్, నటి ఝాన్సీ , దర్శకుడు సముద్ర , ఛాయాగ్రాహకుడు మీర్ , నిర్మాత వివేక్ కూచిపూడి ,సీనియర్ జర్నలిస్ట్ కొండపనేని ఉమామహేశ్వర రావు తదితరులు ఆదివారంనాడు విజయవాడలో పదవీ ప్రమాణ స్వీకారం చేశారు . ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ , శాసన సభ్యులు , హీరో శ్రీ నందమూరి బాలకృష్ణ పాల్గొని ఆద్యంతం ఉత్సాహభరితంగా కార్యక్రమాన్ని నడిపించారు . ఈ కార్యక్రమం కోశాయ్ హైదరాబాద్ నుంచి నిర్మాతలు సి .కళ్యాణ్ , తుమ్మల ప్రసన్న కుమార్ , అంబికా కృష్ణ , మాదాల రవి , ప్రతాని రామకృష్ణ గౌడ్ , వల్లభనేని అనిల్ కుమార్ , దర్శకులు వి .ఎన్ .ఆదిత్య , జి రామ్ ప్రసాద్ మొదలైనవారు హాజరయ్యారు. ఇప్పటికైనా ప్రభుత్వంలో కదలిక వచ్చినందుకు సంతోషం . ...
పోస్ట్లు
- లింక్ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్లు
యమున మౌనపోరాటం ఈటీవీ...ఇప్పుడు మరో సరికొత్త డైలీసీరియల్ తో అలరించబోతోంది. ఈ సీరియల్ ప్రత్యేకత ఏమింటే...మూడు దశాబ్దాల క్రితం అసాధారణ విజయాన్ని సాధించిన ఉషాకిరణ్ మూవీస్ ‘మౌనపోరాటం’ చిత్రానికి సీక్వెల్ గా ప్రేక్షకుల ముందుకు రావడం. అడవిలో స్వేచ్ఛగా, స్వచ్ఛంగా పెరిగిన ఓ గిరిజన యువతిని, పెద్ద ఉద్యోగం చేస్తూ – చిన్న మనసున్న ఓ పట్నం యువకుడు మోసం చేస్తే...అతని కారణంగా గర్భం దాల్చి, కడుపులోని బిడ్డకు తండ్రెవరో నిరూపించుకోవాల్సిన దయనీయ దుస్థితిలో ..ఆ ఒంటరి యువతి సాగించిన ‘మౌనపోరాటం’ ఆ రోజుల్లో అంతులేని సంచలనం కలిగించింది. మాయగాళ్ళ బారిన పడి దిక్కుతోచక రోదించే ఎంతో మంది అబలలకు, అమాయకులకు మార్గం చూపిన ఈ చిత్రం ఎన్నో అవార్డులు గెలుచుకుంది. ఓ గిరిజన యువతి నిజ జీవితంలో ఎదుర్కొన్న సంఘటనలకు తెరరూపం కల్పించిన ‘మౌనపోరాటం’ చిత్రంలో యమున , వినోద్ కుమార్ హీరో హీరోయిన్లు గా నటించారు. రామోజీ రావు నిర్మించిన ఈ చిత్రానికి ప్రఖ్యాత గాయని ఎస్.జానకి సంగీతం అందించగా, మోహన్ గాంధీ దర్శకత్వం వహించారు. దాదాపు ముప్ఫై మూడేళ్ళ తర్వాత మౌనపోరాటం సినిమాకు కొనసాగింపుగా ఇదే పేరుతో సరికొత్త డైలీ సీరియల్ ప్...
- లింక్ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్లు
భగీరథ ప్రయత్నం మీర్జాపురంరాణి - కృష్ణవేణి చక్కని బయోగ్రఫీ ఇది. శ్రీమతి కృష్ణవేణి నటీ,గాయకురాలు ,నిర్మాత ,సొంత స్టుడియో వ్యవహారాలు చూసుకునే వారు.ఆమెను అందరూ సి.కృష్ణవేణి అనేవారు .ఆమె పూర్తి పేరు చిత్తజల్లు.కృష్ణవేణి.ఈ పేరు వెనక ఒక విచిత్రమైన కథ వుంది.అసలు ఆమె పుట్టినింటి పేరు యర్రంశెట్టి.అయితే మీర్జాపురం రాజా వారిని పెళ్లిచేసుకుని మేకా.కృష్ణవేణి అయింది కానీ ఆమె తనను తండ్రిలాగా చూసుకున్న చిత్తజల్లు.పుల్లయ్య గారిమీద గౌరవంతో ఆయన ఇంటిపేరునే తాను స్వీకరించి చిత్తజల్లు.కృష్ణవేణి అయింది .ఈ విషయంలో రాజావారు కూడా యేమీ అభ్యంతరం చెప్పకపోవడం గొప్ప విషయం. రచయిత భగీరథ గారు ఆమె కుటుంబనేపథ్యమూ ,చిన్నతనంలోనే తల్లిని కోల్పోయి సవతితల్లి నిరాదరణ వలన పిన్నీ,బాబాయిల సంరక్షణలో పెరగడమూ అన్నీ వివరంగా రాశారు. చిన్ననాడే ఆమెకు నటన పట్ల వున్న మక్కువతో నాటకాలలో నటిస్తుంటే చూసిన సి.పుల్లయ్య "సతీ అనసూయ" అనే పిల్లల సినిమాలో హీరోయిన్ గా బుక్ చేసుకున్నారు.ఆయన ఆ సినిమాలో నటించిన పిల్లలందరినీ యెంతో ప్రేమగా చూసుకునేవారు .ప్రేమాభిమానాలకు కరువాచిన కృష్ణవేణి పుల్లయ్య దంపతులలో తన తల్లిదండ్రుల...
- లింక్ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్లు
" ఈ విజయం నాది కాదు , నా తండ్రిది " - నాగార్జున అక్కినేని నాగేశ్వర రావు గారు తన రెండవ కుమారుడు నాగార్జునను హీరోగా సినిమా రంగానికి పరిచయం చేస్తూ 'విక్రమ్ ' అనే చిత్రాన్ని రూపొందించారు . సీనియర్ దర్శకులు వీరమాచనేని మధుసూదన రావును ఎంపిక చేసి అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ నిర్మించిన ఈ సినిమాను శ్రీమతి అక్కినేని అన్నపూర్ణమ్మ సమర్పించారు . నాగార్జున జోడీగా శోభనను ఎంపిక చేశారు . అక్కినేని నాగేశ్వర రావు గారి పుట్టినరోజు సందర్భంగా 20 సెప్టెంబర్ 1985లో మొదలైన ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ , కర్ణాటక రాష్ట్రాల్లో జరిపి 'విక్రమ్' చిత్రాన్ని 23 మే 1986న విడుదల చేశారు. అక్కినేని నాగేశ్వర రావు అభిమానులంతా ఎదురు చూసిన రోజు1986 మే 23 శుక్రవారం. ఈ సినిమాను నైజాం లో ఎస్ .ఎన్ .ఏ .పి , సీడెడ్ లో వి . ఎమ్ .సి , నెల్లూరులో రాజ రాజేశ్వరి ఫిలిమ్స్, గుంటూరు లో చదలవాడ బ్రదర్స్, కృష్ణలో బాలాజీ పిక్చర్స్, పశ్చిమ గోదావరి జిల్లా లో అన్నపూర్ణ సినీ చిత్ర , వైజాగ్ , శ్రీకాకుళం లో క్రాంతి పిక్చర్స్ , కర్ణాటకలో శ్రీ లక్ష్మి వినాయక పిక్చర్స్ ద్వారా విడుదల చే...
- లింక్ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్లు
కుద్రేముఖ్ లో వెంకట్, నాగార్జున అప్ సెట్ అక్కినేని నాగార్జున , శోభన జంటగా వి .మధుసూదన రావు గారు దర్శకత్వంలో అక్కినేని అన్నపూర్ణమ్మ గారు నిర్మిస్తున్న 'విక్రమ్' సినిమా 1985 సెప్టెంబర్ 20న అన్నపూర్ణ స్టూడియోస్ లో నాగేశ్వర రావు గారి పుట్టినరోజున ' ప్రారంభమైంది . ఆ తరువాత ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో మొదలయ్యింది . 'ఈ సినిమాలో కొంత భాగం షూటింగ్ ను కర్ణాటక లోని కుద్రేముఖ్ లో చెయ్యాలని నిర్ణయించామని , అక్కడకి జర్నలిస్టులను తీసుకెళ్లే బాధ్యతను మీకు అప్పకిస్తున్నామని' ఒక రోజు నాగేశ్వర రావు గారు చెప్పారు . నాగార్జున మొదటి సినిమా కాబట్టి కవరేజ్ కోసం హైదరాబాద్ నుంచి జర్నలిస్టులను తీసుకెడితే స్పెషల్ కవరేజ్ వస్తుంది అని చెప్పాను . అందుకు నాగేశ్వర రావు గారు కూడా 'అవును , అదే మా ఉద్దేశ్యం, మీకు అన్ని ఏర్పాట్లు చెయ్యమని వెంకట్ కు చెబుతాను ' అన్నారు . నేను సరేనన్నాను . ఆలా జ్యోతి చిత్ర తరుపున నేను , సితార నుంచి గౌస్ ( శాతవాహన ), చిత్ర భూమి నుంచి కేశవరావు , ఆంధ్ర పత్రిక నుంచి రాజేశ్వర రావు , ఆం...
- లింక్ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్లు
40 ఏళ్ల నాటి నాగార్జున 'విక్రమ్' అక్కినేని నాగార్జున నటించిన 'విక్రమ్ ' సినిమా విడుదలై ఈరోజుకు (23 మే 986) 40 సంవత్సరాలు. నాగార్జున సినిమా జీవితం ప్రారంభించి అప్పుడే నాలుగు దశాబ్దాలు అవుతుందా? కాలం ఎంత వేగంగా గడిచిపోతుంది ? 1979 ఫిబ్రవరిలో నేను ఆంధ్ర జ్యోతి నుంచి వెలువడే 'జ్యోతి చిత్ర' సినిమా వార పత్రిక లో రిపోర్టర్ గా చేరాను . అప్పటి నుంచి నాగేశ్వర రావు గారితో నాకు పరిచయం వుంది .అప్పటి నుంచి తరచుగా వారిని కలుస్తూ ఉండేవాడిని. 1984లో నాగేశ్వర రావు గారు నటుడుగా 40 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఒక రోజు నన్ను వారి ఇంటికి ఆహ్వానించారు . అప్పుడు నాగేశ్వర రావు గారు బంజారా హిల్స్ లో ఉండేవారు . నేను వెళ్లిన తరువాత హాల్ లోని రమ్మన్నారు . సాయంత్రం వేళ నేను వెడితే వారితో హాల్ లోనే కూర్చునేవాడిని . తన 40 సంవత్సరాల సినిమా జీవితం గురించి ఒక ఆర్టికల్ కావాలని నన్ను అడిగారు . '40 సంవత్సరాల మీ సినిమా జీవితం గురించి నేనా ? అన్నాను' ఆశ్చర్యంగా . 'మీరు రాయగలరు . నేను మద్రాసులో వున్నప్పుడు నా ఆలోచనలకు దగ్గరగా ముళ్ళపూడి వెంకట రమణ గారు ...
- లింక్ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్లు
స్మృతి పథంలో రామోజీ రావు గారు తెలుగు నాటి నిత్యం వినిపించే పేరు రామోజీ రావు . రామోజీరావు గారు ఒక వ్యక్తిగా ప్రారంభమై వ్యవస్థగా ఎదిగారు . 1974లో ఈనాడు ప్రారంభించి, తెలుగు పత్రిక రంగాన్ని శాసించిన రామోజీ రావు గారు , 1984లో ఉషాకిరణ్ మూవీస్ ప్రారంభించి తెలుగు సినిమా రంగంపై తనదైన ముద్రవేశారు . 1995లో ఈటీవీ తో తెలుగు వార్తా ప్రపంచంలో ఒక సంచలనం కలిగించారు . 1996లో తన పేరుతో ఏర్పాటు చేసిన ఫిలింసిటీ ఒక అద్భుతం . దేశానికే గర్వకారణం . 2005లో ప్రపంచంలోనే అతిపెద్ద చలనచిత్ర స్టూడియో గా రామోజీ ఫిలింసిటీ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో నమోదయ్యింది . 1984లో రామోజీ రావు గారిని మా జ్యోతి చిత్ర (ఆంధ్ర జ్యోతి సంస్థ నుంచి వెలువడే సినిమా వార పత్రిక ) కోసం ఇంటర్వ్యూ చేశాను . అప్పుడు నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా వున్నారు . ఆ ఇంటర్వ్యూ లో తెలుగు సినిమా రంగం మద్రాసు నుంచు హైద్రాబాద్ కు తరలి రావాలంటే ప్రభుత్వం ఏమి చెయ్యాలి .. అనేది ప్రముఖంగా ప్రస్తావించడం జరిగింది . అప్పటి నుంచి వారు నేనంటే ఎంతో అభిమానంగా ఉండేవారు . 1987లో జరిగిన మా వివాహ...