Posts

Image
                                     పద్మశ్రీ   కోట శ్రీనివాస రావు విలక్షణమైన నటుడు  కోట శ్రీనివాస రావు ఈరోజు మరణించారనే వార్త దిగ్భ్రాంతిని కలిగించింది.  నాలుగున్నర దశాబ్దాల కాలంలో తెలుగు , తమిళ, కన్నడ , హిందీ రంగాల్లో 750 సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలను ధరించారు.  కోట శ్రీనివాస రావు గారు 1985లో 'ప్రతిఘటన ' సినిమాలో కాశయ్య పాత్రలో నటించి ఒక్కసారి తెలుగు సినిమా రంగాన్ని తనవైపు తిప్పుకున్నాడు . రామోజీ రావు గారు నిర్మాతగా టి .కృష్ణ దర్శకత్వం వహించారు .  నేను జ్యోతి చిత్ర సినిమా వార పత్రిక రిపోర్టర్ గా పనిచేసేవాడిని.  శ్రీనివాసరా గారిని మా ఆంధ్ర జ్యోతి కార్యాలయానికి ఆహ్వానించి ఇంటర్వ్యూ చేశాను . అదే సందర్భంలో జర్నలిస్టులతో ఒక సమావేశం ఏర్పాటు చెయ్యమని సలహా ఇచ్చాను . ఆయన తప్పకుండా అని ఆ మరుసటి రోజే నారాయణ గూడా  తాజ్ మహల్ హోటల్లో సమావేశం ఏర్పాటుచేశారు . నేను సహా జర్నలిస్టులందరినీ ఆహ్వానించాను .  అప్పుడు శ్రీనివాసరావు గారు నారాయణగూడ లోని ఎస్ .బి .ఐ లో పనిచే...
Image
  ఈరోజు మహాకవి శ్రీశ్రీ 115వ జయంతి    నా మొదటి రచన  'మానవత ' కవితా సంపుటికి ముందు మాట వ్రాసి 1980 జూన్ 1వ  తేదీన మద్రాసు నుంచి హైదరాబాద్ వచ్చి ఆవిష్కరించారు. ఆ రోజు నన్ను ఆశీర్వదించిన మహాకవి శ్రీ శ్రీ నాకు ప్రాతః స్మరణీయులు . నా సాహిత్య జీవితానికి మార్గదర్శకులు . 
Image
 చంద్ర బాబు నాయుడు గారు @75 తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి  శ్రీ నారా చంద్ర బాబు నాయుడు గారి 75వ  జన్మదినోత్సవం. 1980 నుంచి చంద్ర బాబు నాయుడు గారితో నాకు  పరిచయం వుంది .  1980లో చంద్ర బాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీలో సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నప్పుడు వారిని మొదటిసారి 'జ్యోతి చిత్ర' సినిమా వార పత్రిక కోసం ఇంటర్వ్యూ చేశాను. అలాగే వారి మొదటి ప్రెస్ మీట్ కూడా నేనే ఏర్పాటు చేశాను .  చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా  వున్నప్పుడు 1997 మరియు 2000 సంవత్సరాలకు వారి నుంచి ఉత్తమ జర్నలిస్టు గా రెండు పర్యాయాలు నంది అవార్డులను స్వీకరించాను  .  2010లో ఎన్ .టి .ఆర్. ట్రస్ట్ తరుపున ఉత్తమ జర్నలిస్టు అవార్డును బాబు గారు నాకు ప్రదానం చేశారు.  2023లో ఎన్ .టి .ఆర్. శత జయంతి సందర్భంగా మా కమిటీ ప్రచురించిన "శకపురుషుడు " ప్రత్యేక సంచికను చంద్ర బాబు గారు  ఆవిష్కరించి సంపాదకుడుగా నన్ను అభినందించారు.  నేను రచించిన "నాగలాదేవి " చారిత్రిక పుస్తకాన్ని చంద్ర బాబు  గారు ఆవిష్కరించారు .  గత స...
Image
  నగర కేంద్ర గ్రంథాలయంలో నా పుస్తకాలు  అశోక్ నగర్ లోని నగర కేంద్ర గ్రంథాలయంలో నేను రచించిన పుస్తకాలను లైబ్రేరియన్ శ్రీమతి సుబ్బలక్ష్మి గారికి బహుకరించాను.   శ్రీ త్యాగరాయ గానసభలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి అశోక్ నగర్ వెడుతూ  'నాగలాదేవి', 'భారతమెరికా ', 'భగీరథ పథం ', ' మహానటుడు, ప్రజానాయకుడు - ఎన్ .టి .ఆర్ ' పుస్తకాలను తీసుకెళ్ళాను .  అశోక్ నగర్ కేంద్ర గ్రంథాలయం తో నాకు ఎంతో అనుబంధం వుంది .  1971లో నేను హైదరాబాద్ వచ్చిన తరువాత చదువుకుంటూనే ఈ గ్రంథాలయానికి తరచూ వచ్చేవాడిని. 1971 నుంచి 1977 వరకు అంటే నేను 'వెండితెర ' పత్రికలో చేరేవరకు ఈ గ్రంథాలయం రచయితగా నా ఎదుగుదలకు ఎంతో తోడ్పడిందని చెప్పగలను .  అందుకే ఈ గ్రంథాలయంలో నా పుస్తకాలు ఉండాలని లైబ్రేరియన్ శ్రీమతి సుబ్బలక్ష్మి గారిని కలసి వారికి పుస్తకాలు బహుకరించాను .  'మీ పేరు విన్నాను , మిమ్మల్ని కలుసుకోవడం చాలా ఆనందంగా వుంది సార్ ' అని సుబ్బలక్ష్మి గారు చెప్పారు .  ఈ గ్రంథాలయంలో వున్న హాల్ లో 1980 జూన్ 1న నేను రచించిన 'మానవత' కవితా సంపుటిని మహాకవి శ్రీ శ్రీ ఆవిష్కరించారు . నా జీ...
Image
  వెంకయ్య నాయుడు గారి ఆత్మీయత  భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు  వెంకయ్య నాయుడు గారు ఏప్రిల్ 4న ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ కు వచ్చారు .  కల్చరల్ సెంటర్ కార్యదర్శి తుమ్మల రంగారావు గారి తండ్రి గారి  11వ రోజు కార్యక్రమానికి వెంకయ్య నాయుడు గారితో పాటు టి .డి .జనార్దన్ , బంగారు గారిని కూడా ఆహ్వానించారు . వెంకయ్య నాయుడు గారిని నేనే స్వయంగా రిసీవ్ చేసుకున్నాను . అందరూ కలసి ఒక టేబుల్ మీద కూర్చొని భోజనం చేశారు . 
Image
  భగీరథకు కళారత్న  అవార్డు  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర  ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు సీనియర్ జర్నలిస్ట్ , రచయిత భగీరథకు కళారత్న అవార్డు ను  ప్రదానం చేశారు.    మార్చి 30న  విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఉగాది అవార్డుల కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న చంద్రబాబు నాయుడు గారు భగీరథకు  కళారత్న అవార్డును  బహుకరించి అభినందించారు.  జర్నలిజంలో 45 సంవత్సరాల అనుభవం వున్న భగీరథ 1997, 2001లో రెండు పర్యాయాలు అప్పటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో నంది అవార్డులు , 2011లో ఎన్ .టి .ఆర్ . కమిటీ ఉత్తమ జర్నలిస్టు అవార్డు , 2020లో తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం , ఢిల్లీ తెలుగు  అకాడమీ , వంశీ , కిన్నెర, యువకళా  వాహిని,  శృతిలయ , కమలాకర కళా భారతి , బళ్లారి తెలుగు సంస్కృతీ లాటి సంస్థల నుంచి 20 అవార్డులను భగీరథ స్వీకరించాడు .  నంది అవార్డుల కమిటీ , జాతీయ సినిమా అవార్డుల కమిటీ , ఆస్కార్ అవార్డుల కమిటీ సభ్యుడుగా భగీరథ పనిచేశాడు .  ఎన్ .టి .ఆర్. శత జయంతి సందర్భంగా ఏర్పాటైన కమిటీ  "శకపురుషుడు ", "తారకరామం" రెండు గ్రంథ...
Image
 'తారకరామం "ఆధునిక భగవద్గీత  ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో  జనవరి 18న నా 'తారకరామం ' పుస్తకం పై సమీక్ష సమాలోచన జరిగింది . ఈ సభకు సంబంధించిన వార్త.  తారకరామం ఆధునిక భగవద్గీత: పరుచూరి గోపాలకృష్ణ భగీరథ సంపాదకత్వంలో ఎన్.టి.ఆర్. కమిటీ వెలువరించిన తారకరామం గ్రంథం ఆధునిక భగవద్గీతని, ప్రతి తెలుగు వారి ఇంట్లో తప్పకుండా ఉండవలసిన అపురూప గ్రంథమని రచయిత పరుచూరి గోపాలకృష్ణ చెప్పారు.  ఎన్.టి. రామారావు వివిధ పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలతో రూపొందించిన తారకరామం పుస్తక సమీక్ష సమాలోచన శనివారం నాడు ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో జరిగింది. ఈ సందర్భంగా రచయితల సంఘం అధ్యక్షులు డా. పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ అన్న ఎన్.టి. రామారావు స్వయంగా చెప్పిన ఇంటర్వ్యూలతో భగీరథ చేసిన మంచి ప్రయత్నమని అన్నగారి అభిప్రాయాలు, ఈ తరతానికే కాదు, భవిష్యత్ తరాలకు కూడా మార్గదర్శకంగా ఉంటాయని అందుకే తారకరామం ప్రతిఇంటిలో తప్పనిసరిగా ఉండవలసినటువంటి మహాగ్రంథమని చెప్పారు.  జొన్నవిత్తుల మాట్లాడుతూ ఎన్.టి. రామారావుగారు చాలా స్పష్టమైన అభిప్రాయాలతో ఉంటారని, నటుడిగాను, వ్యక్తిగానూ, జీవితంలో రాజీపడలేదని తారకరామం పుస్తకం ఎన...