ఆచార్య సినిమా షూటింగ్ కు సైకిల్ పై సోను సూద్
సోనూ సూద్ . దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజల మదిలో ఉండిపోయిన పేరు. కరోనా మహమ్మారి కాటేసిన వేళలో లక్షలాది మంది దిక్కుతోచక రోడ్ల మీద కాలినడకన స్వస్థలాలకు వెళుతుంటే.. వారిని స్వచ్చందంగా ఆదుకున్న సోనూసూద్ సహాయం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఆచార్యలో చిత్రంలో సోనుసూద్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ లొకేషన్ కు సోనుసూద్ సైకిల్ మీద వెళ్లారు . సోనూసూద్ కి సైక్లింగ్ అంటే చాలా ఇష్టం. పైగా.. ఉదయాన్నే సెట్ కి వెళ్లాల్సిన అవసరం వచ్చింది. అందుకే మరేమీ ఆలోచించకుండా సైకిల్ ఎక్కాడు. అటు వ్యాయామం, ఇటు.. ప్రయాణం రెండూ కలిసొచ్చేశాయి.ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్లు
'తారకరామం "ఆధునిక భగవద్గీత ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో జనవరి 18న నా 'తారకరామం ' పుస్తకం పై సమీక్ష సమాలోచన జరిగింది . ఈ సభకు సంబంధించిన వార్త. తారకరామం ఆధునిక భగవద్గీత: పరుచూరి గోపాలకృష్ణ భగీరథ సంపాదకత్వంలో ఎన్.టి.ఆర్. కమిటీ వెలువరించిన తారకరామం గ్రంథం ఆధునిక భగవద్గీతని, ప్రతి తెలుగు వారి ఇంట్లో తప్పకుండా ఉండవలసిన అపురూప గ్రంథమని రచయిత పరుచూరి గోపాలకృష్ణ చెప్పారు. ఎన్.టి. రామారావు వివిధ పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలతో రూపొందించిన తారకరామం పుస్తక సమీక్ష సమాలోచన శనివారం నాడు ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో జరిగింది. ఈ సందర్భంగా రచయితల సంఘం అధ్యక్షులు డా. పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ అన్న ఎన్.టి. రామారావు స్వయంగా చెప్పిన ఇంటర్వ్యూలతో భగీరథ చేసిన మంచి ప్రయత్నమని అన్నగారి అభిప్రాయాలు, ఈ తరతానికే కాదు, భవిష్యత్ తరాలకు కూడా మార్గదర్శకంగా ఉంటాయని అందుకే తారకరామం ప్రతిఇంటిలో తప్పనిసరిగా ఉండవలసినటువంటి మహాగ్రంథమని చెప్పారు. జొన్నవిత్తుల మాట్లాడుతూ ఎన్.టి. రామారావుగారు చాలా స్పష్టమైన అభిప్రాయాలతో ఉంటారని, నటుడిగాను, వ్యక్తిగానూ, జీవితంలో రాజీపడలేదని తారకరామం పుస్తకం ఎన...
రామోజీ రావు గారు స్ఫూర్తి ప్రదాత నవంబరు 16 పద్మవిభూషణ్ రామోజీ రావు గారి పుట్టినరోజు. 86 సంవత్సరాలు పూర్తి చేసుకొని 87వ సంవత్సరంలోకి ప్రవేశించారు . రామోజీరావు గారు కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 1936 నవంబరు 16న వెంకటసుబ్బమ్మ, వెంకట సుబ్బారావుదంపతులకు జన్మిచారు . 1974 ఆగష్టు 10న రామోజీరావు గారు విశాఖపట్నంలో ఈనాడు దిన పత్రికను ప్రారంభించారు . ఆ తరువాత 1975 డిసెంబర్ 17న హైదరాబాదులో మరో ఎడిషన్ ప్రారంభించారు . ఈనాడు దేశంలోనే పెను సంచలనం సృష్టించింది . మార్గదర్శి, ఉషాకిరణ్ మూవీస్, మయూరి ఫిలిమ్స్, రామోజీ ఫిలిం సిటీ మొదలైన సంస్థలను ఆయన ప్రారంభించారు . ఈరోజు ఆయన పేరు ప్రపంచంలోనే ప్రముఖంగా వినిపిస్తుంది . తెలుగు పత్రికా రంగంలోనూ , సినిమా రంగంలోనూ రామోజీ రావు గారు సరికొత్త చరిత్రను సృష్టించారు. నవ్యతకు , నాణ్యతకు ఆయన మరో పేరు. రామోజీ రావు గారితో నేను మొదటిసారి 1983 లో ఇంటర్వ్యూ చేశాను . అప్పుడు నేను ఆంధ్ర జ్యోతి సంస్థ నుంచి వెలువడే జ్యోతి లో పనిచేసేవాడిని . ఆ తర్వాత మళ్ళీ 1986లో మరొక ఇంటర్వ్యూ చేశాను . ...


కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి