"మీర్జాపురంరాణి -కృష్ణవేణి " బహుకరణ
ఈరోజు ఆత్మీయులు డాక్టర్ కె. వి. రమణాచారి గారిని వారి నివాసంలో కలసి "మీర్జాపురంరాణి - కృష్ణవేణి" పుస్తకాన్నిబహుకరించాను.
“2004లో డాక్టర్ వై .ఎస్ . రాజశేఖరరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కృష్ణవేణమ్మ రఘుపతి వెంకయ్య అవార్డు ప్రదానం చేశాము. అప్పుడు నేను సమాచార శాఖ కమీషనర్ మరియు చలనచిత్ర అభివృద్ధి సంస్థ ఎం.డిగా ఉన్నాను”. రమణాచారి గారు గుర్తు చేశారు.
“అవును ఆ విషయం కూడా ఈ పుస్తకంలో రాశాను” అని వారితో చెప్పాను.
"ఇన్నాళ్లకు కృష్ణవేణమ్మ జీవిత చరిత్ర రాసినందుకు భగీరథా నిన్ను అభినందిస్తున్నా , నువ్వు ఏ పుస్తకం వ్రాసిన మనసు పెట్టి రాస్తావు ,
ముఖ్యంగా నీ శైలి భిన్నంగా , ఆసక్తిగా ఉంటుంది " అని రమణాచారి గారు అభినందించారు .
చాలాకాలం తరువాత రమణాచారి గారిని కలుసుకున్నా , చాలా ఆత్మీయంగా మాట్లాడారు .

కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి