పోస్ట్‌లు

ఆగస్టు, 2026లోని పోస్ట్‌లను చూపుతోంది
చిత్రం
  విలక్షణ నటుడు నటుడు నారాయణ రావు  నటుడు, నిర్మాత జి .వి. నారాయణరావు బుధవారం సాయంత్రం మృతి చెందారు.  1973లో నారాయణ రావు మద్రాస్ ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో చేరి శిక్షణ పొందారు.  అదే ఇనిస్టిట్యూట్ లో రజనీకాంత్, చిరంజీవి కూడా శిక్షణ పొందారు . వారిద్దరితో  నారాయణ రావు కు స్నేహం వుంది . 1976లో దర్శకుడు కె .బాలచందర్ 'అంతులేని కథ ' తెలుగు చిత్రంలోనారాయణరావును  సినిమారంగానికి పరిచయం చేశాడు . ఆ సినిమాలో 'తాళికట్టు శుభ వేళ .. మెడలో కళ్యాణ మాల ' అనే పాటలో నారాయణ రావు చూపించిన అభినయం ఆయన్ని ప్రభిభావంతుడైన నటుడుగా నిలబెట్టింది . ఆ సినిమాలో ఉత్తమ సహాయ నటుడుగా నారాయణరావు ను ఎంపిక చేసి  ప్రభుత్వం నంది అవార్డును ప్రదానం  చేసింది.  అదే సంవత్సరం నిర్మాత ఎమ్మెస్ రెడ్డి బి .వి .ప్రసాద్ దర్శకత్వంలో  రూపొందించిన 'ముత్యాల పల్లకి ' చిత్రంలో హీరోగా అవకాశం ఇచ్చారు . ఇందులో జయసుధ కథానాయిక.   ఆ తరువాత సంవత్సరం 1977లో దర్శకుడు మృణాల్ సేన్ తెలుగులో నిర్మించిన 'ఒక ఊరి కథ ' సినిమాలో ముఖ్యమైన  పాత్రకు ఎంపిక చేశారు . ఏ .పరంధామ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో...
చిత్రం
  ఆంగికం, ఆహార్యం, అభినయం, వాచకం షావుకారు జానకి పెట్టని ఆభరణాలు  తెలుగు సినిమా రంగంలో షావుకారు జానకిది  అద్వితీయమైన స్థానం. తల్లిదండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా సినిమా రంగంలో ప్రవేశించినా, కట్టుకున్నవాడు స్వార్ధపరుడుగా మారిపోయాడని తెలిసి, ముగ్గురు పిల్ల తరువాత వివాహ బంధాన్ని రద్దు చేసుకొని, ఒంటరి మహిళగా , ధీరోదాత్త నటిగా జీవనం సాగించి ఎందరికో స్ఫూర్తిప్రదాతగా నిలిచారు .  తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ , హిందీ భాషా చిత్రాల్లో నటించిన షావుకారు జానకి,  సినిమా రంగంలో ఎవరి  సహకారం , ప్రోత్సాహం లేకుండా  స్వయంగా ఎదిగి , ఒదిగిన మహానటి. 1950లో 'షావుకారు' చిత్రం తో మొదలైన ఆమె నట ప్రస్థానం 2023లో  విడుదలైన 'అన్నీ మంచి శకునములే ' చిత్రం వరకు కొనసాగింది. ఈ ఏడు దశాబ్దాలలో ఆమె ఎన్. టి. రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఎం. జి. ఆర్, శివాజీ గణేశన్ లాంటి మహానటులతో నటించారు. చిన్నప్పుడు మహాత్మా గాంధీ మద్రాసు వచ్చినప్పుడు వారికి పాలు, వేరుశనగ పప్పులు అందించి ఆశీస్సులు అందుకున్న జానకి ఆ తరువాత జవహర్ లాల్ నెహ్రూ, బాబు రాజేంద్ర ప్రసాద్, ఇందిరా గాంధీ లాంటి నేతలతో మాట్లాడిన అదృ...