Posts

Showing posts from April, 2022
Image
      శ్రీ శ్రీ "మహాప్రస్థానం"  నాకు స్ఫూర్తి - భగీరథ    ఆధునిక మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీ శ్రీ ) అంటే తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు .  1950వ సంవత్సరంలో రచించిన  "మహాప్రస్థానం" అప్పట్లో పెను సంచలనం కలిగించింది . అప్పటివరకు సాంప్రదాయ పద్దతిలో కవులు ఛందోబద్దమైన కవిత్వాన్ని వ్రాసేవారు . శ్రీ శ్రీ " మహాప్రస్థానం "లో వచన కవిత్వానికి శ్రీకారం చుట్టాడు . ఛందోబద్దమైన కవిత్వాన్ని పక్కన పెట్టాడు . ఇది శ్రీ శ్రీని సరికొత్తగా ఆవిష్కరించింది . యువ కవులు ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని కవిత్వం వ్రాయడం మొదలు పెట్టారు .  శ్రీ శ్రీ ఆధునిక కవుల్లో అగ్రగణ్యుడు . వైతాళికుడు .  అభ్యుదయ రచయితల సంఘ అధ్యక్షుడు గా , విప్లవ రచయితల సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడుగా , సినిమా పాటల  కవిగా  శ్రీ శ్రీ  జీవిత ప్రస్థానం ఎంతో స్ఫూర్తిదాయకం .  ఈ రోజు 112వ జయంతి .  తెలుగు సాహిత్య చరిత్రలో తనదైన ముద్ర వేసి,  నవ యువ కవులకు మార్గ నిర్ధేశకుడుగా, స్ఫూర్తి ప్రదాతగా  ఎప్పటికీ మిగిలిపోయిన మహాకవితో నాకు ప్రత్యేకమైన అనుబంధం వుంది .  1979లో ...
Image
  మహాకవి శ్రీ శ్రీ  112వ జయంతి    ఈరోజు మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీ శ్రీ ) 112వ జయంతి . తెలుగు సాహిత్య చరిత్రలో తనదైన ముద్ర వేసి,  నవ యువ కవులకు మార్గ నిర్ధేశకుడుగా, స్ఫూర్తి ప్రదాతగా  ఎప్పటికీ మిగిలిపోయిన మహాకవి .   1980 జూన్ 1వ తేదీన అంటే 42 సంవత్సరాలక్రితం నేను రచించిన "మానవత" కవితా సంకలనానికి ముందుమాట వ్రాసి, . మద్రాసు నుంచి హైదరాబాద్ వచ్చి స్వయంగా  పుస్తకాన్ని ఆవిష్కరించారు . ఆనాటి సభ ఇప్పటికీ  కళ్ళ ముందు కదులుతోంది .  ఆ మహనీయుడు నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు . . 
Image
చంద్రబాబుగారికి జన్మదిన శుభాకాంక్షలు  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు గారు ఈరోజు 72వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు .  చంద్ర బాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు 1997 మరియు 2000 సంవత్సరాలకు నాకు  రెండు పర్యాయాలు ఉత్తమ జర్నలిస్టుగా నంది అవార్డులను ప్రదానం చేశారు .  అలాగే ఎన్ .టి .ఆర్ ట్రస్టు తరుపున ఉత్తమ జర్నలిస్టుగా గుర్తించి అవార్డు తో పాటు నగదు బహుమతిగా ఇచ్చి సత్కరించారు .  చంద్ర బాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు . 
Image
 దర్శకుడు తాతినేని రామారావు ఇక లేరు  ప్రముఖ దర్శకుడు తాతినేని రామారావు ఈరోజు తెల్లవారు జామున చెన్నై లో మరణించారు . ఆయన వయసు 84 సంవత్సరాలు.  1950 వ సంవత్సరం  రామారావు తన సమీప బంధువైన తాతినేని ప్రకాశరావు దగ్గర సహాయ దర్శకుడుగా చేరారు . ఆ తరువాత ప్రత్యగాత్మ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేశారు . 1966లో  అక్కినేని నాగేశ్వర రావు సావిత్రి నటించిన  నవరాత్రి అన్న సినిమాతో దర్శకుడయ్యారు . రామారావును ప్రసాద్ ఆర్ట్ ప్రొడక్షన్స్ ఏ .వి . సుబ్బారావు దర్శకుడుగా పరిచయం చేశారు .  1966 నుంచి 2000 వరకు తెలుగు , హిందీ భాషల్లో 70 సినిమాలకు పైగా దర్శకత్వం వహించారు .  రామారావు కు భార్య జయశ్రీ , కుమారుడు అజయ్ , కుమార్తెలు చాముండేశ్వరి , నాగ  సుశీల వున్నారు . 
Image
 ఒకే వేదికపై చిరంజీవి, ముఖ్య మంత్రి జగన్  ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఒకే వేదికపై కలవబోతున్నారు .  అవును ఈ వార్త నిజమే . వీరిద్దరి కలయికకు ఆచార్య సినిమా వేదిక కాబోతుంది .  మెగాస్టార్ చిరంజీవి , రామ్ చరణ్ నటించిన "ఆచార్య " సినిమా ఈ నెల 29న విడుదలవుతుంది .  కొరటాల శివ దర్శకత్వంలో కొణిదల ప్రొడక్షన్ కంపెనీ మరియు మ్యాటినీ ఎంటర్టైన్మెంట్ నిర్మించిన ఈ భారీ సినిమా  ప్రీ రిలీజ్ వేడుక ఈ నెల 23 న విజయవాడ సిద్దార్ద కళాశాల ప్రాంగణంలో జరుగుతుంది .  మెగాస్టార్ , రామ్ చరణ్, పూజ హెగ్డే , కాజల్ అగర్వాల్ తో పాటు ఇంత నటీనటులు , సాంకేతిక నిపుణులు ఈ వేడుకలో పాల్గొంటున్నారు .  అత్యంత భారీ స్థాయిలో ఈ వేదిక రూపొందబోతుంది . ఈ వేదికపై చిరంజీవి "ఆచార్య " సినిమాకు ముఖ్య అతిధిగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విచ్చేస్తున్నారు .  సినిమా టికెట్ల రేట్లను పెచాలని చిరంజీవి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలసి విజ్ఞప్తి చేశారు . చిరంజీవి తో జగన్ సమావేశం తరువాత జగన్ సినిమా టికెట్ల రేట్లను పెంచారు . చిరంజీవి ప్రతిష్టాత్మకంగా రూపొందించిన "ఆచార్య" సినిమ...
Image
  మొబైల్ సినిమా ధియేటర్ లో ఆచార్య  మొబైల్ సినిమా హాల్  వచ్చేసింది . ఇది ఒకప్పటి టెంట్ సినిమా థియేటర్ ను గుర్తుకుతెస్తుంది . తూర్పు గోదావరి జిల్లా . రాజానగరం జాతీయ రహదారి పక్కన  ఈ ధియేటర్ ను ఏర్పాటు చేశారు .  వాతావరణానికి తగ్గట్టు, మంటలు చెలరేగినా ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా   గాలి నింపే సాంకేతిక పరిజ్ఞానంతో ఈ థియేటర్ ను ఏర్పాటు చేశారు . ఇందులో  120 సీట్లను ఏర్పాటు చేశారు . ఈ  ధియేటర్ పూర్తిగా ఏసీ  రూపొందిస్తున్నారు.  “పిక్చర్ డిజిటల్స్” అనే సంస్ధ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజానగరం లో నెలకొల్పుతున్న మొబైల్ ధియేటర్.  ఈ థియేటర్ చిరంజీవి , రామ్ చరణ్ నటించిన   "ఆచార్య"  సినిమాతో ప్రారంభం అవుతుంది .  ఈ థియేటర్ ను ఊడతీసి ఎక్కడికైనా సులభంగా తీసుకొని పోవచ్చు . దేశంలో ఇలాంటి మొబైల్ సినిమా హాళ్లు ప్రారంభం అయ్యే అవకాశాలు వున్నాయి . 
Image
  ఆరు సంవత్సరాల నాటి స్మృతి చిత్రమ్  2016 ఏప్రిల్ 10న ఢిల్లీ తెలుగు అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది ఉత్సవాల్లో నేను రచించిన "అమరావతి నృత్య బాలే ను ప్రదర్చిండానికి కార్యదర్శి నాగరాజు గారు ఆహ్వానించారు . అదే  సందర్భగా నాకు, నృత్య కళాకారిణి క్రాంతి నారాయణకు ఉగాది పురస్కారాలను కూడా ప్రకటించారు .  ఈ అవార్డును అప్పటి మహారాష్ట్ర గవర్నర్  విద్యాసాగర్ రావు  ప్రదానం చేశారు . అమరావతి నృత్య బాలే కు ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన వచ్చింది   తరువాత రోజు అంటే ఏప్రిల్ 11న ఆగ్రా వెళ్ళాను .  ఆగ్రా ఫోర్ట్ ను , తాజ్ మహల్ ను సందర్శించాను . అవి మర్చిపోలేని క్షణాలు . 
Image
  పుట్టినరోజునే మరణించిన నటుడు ఎమ్ .బాలయ్య  నటుడు, నిర్మాత ,దర్శకుడు మన్నవ బాలయ్య ఈరోజు ఉదయం హైద్రాబాద్లో చనిపోయారు. ఆయన వయసు 94 సంవత్సరాలు.  ఏప్రిల్ 9, 1930వ గుంటూరు జిల్లా చేవపాడు గ్రామం లో మన్నవ గురవయ్య చౌదరి ,అన్నపూర్ణమ్మ దంపతులకు జన్మించారు .  మద్రాస్ లో ఇంజనీరింగ్ చదివే రోజుల్లో నాటకాల్లో నటించేవాడు . అలా నటనపై మక్కువు ఉండటంతో సినిమా రంగంలోని వెళ్లాలని నిర్ణయించుకున్నారు . దర్శకుడు తాపీ చాణిక్య బాలయ్యను ప్రోత్సహించాడు . చాణిక్య దర్శకత్వం వహించిన ఎత్తుకు పై ఎత్తు చిత్రం తో తెలుగు సినిమా రంగంలోకి అడుగు పెట్టారు . ఈ సినిమాను సారధి స్టూడియోస్ నిర్మించింది .  1958 నుంచి 2013వరకు  బాలయ్య 300 చిత్రాల్లో నటించారు .ఆయన అమృత ఫిల్మ్స్ సంస్థ ను ప్రారంభించి  చెల్లెలి కాపురం,  నేరము - శిక్ష,  అన్నదమ్ముల కథ , ప్రేమ -పగ , చుట్టాలున్నారు జాగ్రత్త, ఊరికిచ్చిన మాట,  కిరాయి అల్లుడు, పసుపుతాడు మొదలైన వైవిధ్యమైన  చిత్రాలు నిర్మించారు.  పసుపు తాడు, నిజం చెబితే నేరమా, పోలీసు అల్లుడు చిత్రాలకు దర్శకత్వం వహించారు .  బాలయ్య తన పుట్టిన రోజునే చ...
Image
 నాగండ్ల గ్రామంపై రావిపూడి వెంకటాద్రి  ప్రభావం : భగీరథ  హేతువాది, మానవవాది రావిపూడి వెంకటాద్రి గారి ప్రభావం నాగండ్ల గ్రామంపై ఉందని , 1956 నుంచి 1996 వరకు వెంకటాద్రి గారు 40 సంవత్సరాలపాటు  గ్రామ అధ్యక్షుడుగా పనిచేశారని జర్నలిస్ట్ , కవి, రచయిత భగీరథ తెలిపారు .  కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి రచనలతో ప్రభావితమైన వెంకటాద్రి 1943 ఏప్రిల్ 5న నాగండ్ల గ్రామంలో మిత్రులతో కలసి కవిరాజాశ్రమం ప్రారంభించారు. ఏప్రిల్ 5, 2022 కు కవిరాజాశ్రమం స్థాపించి 79 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భముగా గ్రామంలో రావిపూడి వెంకటాద్రి గారిని  హేతువాదులు, ప్రజలు  ఘనంగా సత్కరించారు . ఫిబ్రవరి 9న  వేంకటాద్రి గారి 101వ జన్మదిన వేడుకలు రాడికల్ హ్యూమానిస్తూ సెంటర్ , ఇంకొల్లులో మిత్రులు  ఘనంగా నిర్వహించారు .  ఈ సందర్భగా  నాగండ్ల గ్రామంలో జన్మించి హైద్రాబాద్ లో ఉంటున్న జర్నలిస్ట్ , కవి, రచయిత భగీరథ మాట్లాడుతూ ,  మా నాగండ్ల గ్రామంపై వెంకటాద్రి గారి ప్రభావం ఎంత ఉందొ ప్రత్యక్షముగా చూశాను . వెంకటాద్రి గారు పెరియార్ రామస్వామి , త్రిపురనేని రామస్వామి చౌదరి రచనలు చదివి ఆ ...
Image
Ugadi Puraskaram  Received Best Journalist Award from Ugadi Cinema Puraskaraalu 2022, organized by Nestham Foundation, Telugu Cinema Vedika and Kunireddy Foundation jointly at Prasad Lab in Hyderabad on Ugadi day. This is my 21 st Award.
Image
  ద గ్రేట్ జర్నలిస్ట్, కవి, రచయిత, దర్శకుడు భగీరథ గారికి అభినందనలు   భగీరథ గారు నాకు ఆప్తులు , వారు ఈరోజు  ఉగాది సినిమా పురస్కారాన్ని అందుకోబోతున్నారు. ఈ సందర్భంగా భగీరథ గారి వ్యక్తిత్వం నాకు బాగా వచ్చింది . జర్నలిజానికే వన్నె తెచ్చిన ఆయన  జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం .  1971లో భగీరథ తన 15వ  ఏట ఇంటర్మీడియేట్ చదవడానికి హైదరాబాద్ వచ్చారు . ఆ సంవత్సరం నుంచే నుంచి రచనలు చేయడం మొదలు పెట్టారు . . 1974లో భగీరథ  తన 18వ ఏట  వ్రాసిన "ఆహుతి " అన్న నాటకాన్ని  ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వారు ఎంపిక చేశారు . ఈ నాటకం 1975 జనవరి 15 మరియు 30న  రెండు భాగాలుగా ప్రసారం అయ్యింది. 1977లో "వెండితెర " సినిమా పత్రిక తో పాత్రికేయ జీవితాన్ని ప్రారంభించారు . ఆ తరువాత ఆంధ్ర జ్యోతి నుంచి వెలువడే జ్యోతి చిత్రలో హైదరాబాద్ రిపోర్టర్ గా పనిచేశారు .  1980లో "మానవత' పేరుతో రాసిన కవితా సంపుటికి మహాకవి శ్రీశ్రీ ముందుమాట వ్రాసి , మద్రాస్ నుంచి హైదరాబాద్ వచ్చి స్వయంగా ఆవిష్కరించారు .  ఆ సభకు  అప్పటి హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆవుల సాంబశివరావు అధ్యక్షత వహిం...