Posts

Showing posts from September, 2021
Image
                  స్నేహపాత్రుడు ఆర్ .ఆర్ .వెంకట్  ఈరోజు హైద్రాబాద్ లో మరణించిన ఆర్ .ఆర్. వెంకట్ ( జె .వి .ఫణింద్ర రెడ్డి ) స్నేహపాత్రుడు . సినిమా అంటే ఎంతో అభిమానం . అయితే సినిమా ప్రచారానికి ఆయన దూరంగా ఉండేవారు . ఆయన మొదటి సినిమా "ది ఎండ్ ". రవి చావలి దర్శకత్వం వహించారు . ఈ సినిమాకు అప్పటి రాష్ట్రపతి నుంచి ప్రశంసాపత్రం లభించింది .  2004లో ఎస్ .వి .కృష్ణా రెడ్డి దర్శకత్వంలో , కె . అచ్చి రెడ్డి సారథ్యంలో అలీ , వేణుమాధవ్  తో "హంగామా " అనే చిత్రం నిర్మించారు . ఆ సినిమాకు పబ్లిసిటీ నన్ను చెయ్యమని అచ్చి రెడ్డి గారు అడిగారు . నేను అంగీకరించాను . ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనీ లో జరిగేటప్పుడు నిర్మాత వెంకట్ గారు వచ్చారు . ఆయన్ని అచ్చి రెడ్డి గారు నాకు పరిచయం చేశారు .  ఆ తరువాత ఆయన నిర్మించిన "మాయాజాలం" ,  సినిమాకు కూడా నేను పనిచేశాను .  ఆయన కాంట్రాక్టర్ . ఎక్కువ రోజులు ఉత్తర భారతంలో ఉండేవారు . హైదరాబాద్ వస్తే మాత్రం కృష్ణా రెడ్డి, అచ్చి రెడ్డి తో పాటు నన్ను  కలిసేవారు . అప్పుడు ఆర్ .ఆర్ మూవీ మేకర్స్ కార...
Image
        భగీరథ కు అక్కినేని జీవనసాఫల్య పురస్కారం  అక్కినేని నాగేశ్వర రావు జీవితం తనకు ఎంతో స్ఫూర్తి నిచ్చిందని , జర్నలిస్టు గా మాత్రమే కాకుండా తనని కుటుంబ సభ్యుడుగా చూసేవారని సీనియర్ జర్నలిస్ట్ భగీరథ పేర్కొన్నారు .  పద్మభూషణ్ అక్కినేని నాగేశ్వర రావు 98వ జయంతి సందర్భంగా శృతిలయ ఆర్ట్స్ అకాడమీ మరియు సీల్ వెల్ కార్పొరేషన్  ఏర్పాటుచేసిన అక్కినేని జీవనసాఫల్య పురస్కారాన్ని ఈ సంవత్సరం సీనియర్ జర్నలిస్ట్ , రచయిత , కవి భగీరధకు ప్రదానం చేశారు . హైదరాబాద్ రవీంద్ర భారతిలో  జరిగిన  ఒక ప్రత్యేక కార్యక్రమంలో భగీరధను ఘనంగా సత్కరించి అవార్డు ప్రదానం చేశారు .  ఈ సందర్భగా భగీరథ మాట్లాడుతూ . అక్కినేని నాగేశ్వర రావు గారితో 1977 నుంచి పరిచయం ఉందని , ఆయన తనని ఎంతో ఆత్మీయంగా చూసేవారని, వారి ప్రోత్సాహంతోనే సినిమా రంగంలో గుర్తింపు , గౌరవం సంపాదించానని చెప్పారు , అక్కినేనితో తనకు ఎన్నో మధుర స్మృతులున్నాయని , ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా వారి జయంతి వేడుకలను నిర్వహించిన ఆమని, భండారు సుబ్బారావు ,భీం రెడ్డి , అనూహ్యా రెడ్డి , మహమ్మద్ రఫీ ని ఈ సందర్భగా భగీరథ అభినందించా...
Image
                "సినిమా పోస్టర్ " ఈశ్వర్ ప్రస్థానం   "సినిమా పోస్టర్ " ఈశ్వర్ ప్రస్థానం  సీనియర్ సినిమా పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ ఈరోజు ఉదయం చెన్నైలో కన్నుమూశారు . ఆయన వయసు 84 సంవత్సరాలు .  తెలుగు సినిమా రంగంలో ఈశ్వర్ కు ఒక ప్రత్యేకమైన గుర్తింపు, గౌరవం వున్నాయి , ఆయన వందల సినిమాలకు పోస్టర్ డిజైన్ లను తయారు చేశారు . అలాగే నటి నటుల పెయింటింగ్ లను కూడా అద్భుతంగా గీశారు . ఆయన పూర్వీకులు శిల్ప కళలో నిపుణులు కావడంతో వంశపారంపర్యంగా ఈశ్వర్ కు కూడా ఆ కళ వచ్చింది . చిన్నపుడు , నాటకాలు రాసి రంగస్తలంపై ప్రదర్శించేవారు . ఆ నాటకాలకు తానే బొమ్మలు గీసేవాడు .  పాలిటెక్నీక్ చదువుతూ ఉండగా  తల్లి మరనించింది . దాంతో  చదువు ఆగిపోయింది . అప్పుడు ఎదో ఒక పనిచేసుకుందామని మద్రాస్ వచ్చారు . తనకు వచ్చిన విద్య బొమ్మలు వేయడం , ఆ వృత్తిలోనే కొనసాగాలని సినిమా రంగంలో వున్న ఆర్టిస్టు కేతా దగ్గర శిష్యుడుగా చేరిపోయాడు . 1961 నుంచి 66 వరకు పబ్లిసిటీ లో అనుభవం సంపాదించాడు . 1967వ సంవత్సరంలో కేతా నుంచి బయటకు వచ్చి స్వంతంగా సినిమాలకు పనిచెయ్యడం మొదల...
Image
                        మామిడి హరి కృష్ణ గారు మంచి స్నేహశీలి శృతి లయ ఆర్ట్స్ అకాడమీ,సీల్ వెల్ కార్పొరేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న అక్కినేని నాగేశ్వర్ రావు గారి 98వ జయంతి వేడుకల్లో పాల్గొనడానికి   సోమవారం  సాయంత్రం రవీంద్ర భారతి వెళ్ళాను. అదే ప్రాంగణంలో వున్న తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక కార్యాలయం కనిపించింది . సంచాలకులు మామిడి హరికృష్ణ గారు గుర్తుకు వచ్చారు . వారిని కలసి చాలా రోజులవుతుంది . వారికి నా " భారతమెరికా " పుస్తకాన్ని బహుకరించాలి అనుకోని ముందుగా వారి కార్యాలయంలోకి వెళ్ళాను . హరి కృష్ణ గారు నన్ను చూడగానే ఆత్మీయంగా ఆహ్వానించారు .  హరి కృష్ణ గారికి నా "భారతమెరికా " పుస్తకాన్ని బహుకరించాను . హరికృష్ణ గారికి సాహిత్యమన్నా , సాంస్కృతికమన్నా ఎంతో  ఇష్టం . అభిరుచి, అవగాహన వున్న రచయిత , కవి హరికృష్ణ గారు  రచించిన "ఊరికి పోయిన యాళ్ల ", సుషుప్తి నుంచి ","ఒంటరీకరణ " కవితా గ్రంథాలను నాకు బహుకరించారు . .   
Image
ఆత్రేయ మనసు నొచ్చుకున్న ఆ రెండు సంఘటనలు  తెలుగు సినిమాను సగటు ప్రేక్షకుడు దగ్గరకు చేర్చిన రచయితల్లో ఆచార్య ఆత్రేయ మొదటి స్థానంలో ఉంటాడు . ఆయన మాటలు, పాటలు కూడా చక్కటి భావంతో , భాషతో వుంటాయని విమర్శకులు సైతం చెబుతారు. అయితే కాలానుగుణంగా ఆయన  మాటల్లో  పాటల్లో  ద్వందార్ధాలు వస్తున్నాయని, అందుకే  ఆయన్ని బూత్రేయ అని కూడా వ్యగ్యంగా పిలిచేవారు . అయితే ఆ విమర్శ పక్కన పెడితే  తెలుగు సినిమా ఎదుగుదలకు ఆత్రేయ  తన రచనల ద్వారా ఎంతో దోహదం చేశాడని చెప్పవచ్చు .  ఆత్రేయ భౌతికంగా మనకు దూరమై మూడు దశాబ్దాలు అవుతుంది.  .సోమవారం ఆత్రేయ 32వ వర్ధంతి . ఈ సందర్భంగా ఆయన ప్రతిభా  పాటవాలు, వ్యక్తిత్యం గురించి తెలుసుకుందాం . ఆత్రేయ అసలు పేరు కిలాంభి వెంకట నరసింహా చార్యులు . ఆయన 7 మే 1921న నెల్లూరు లోని మంగళంపాడు గ్రామంలో జన్మించాడు .హైస్కూల్ విద్యాభ్యాసం అనంతరం ఆయన్ని స్వాతంత్రోద్యమం బాగా ఆకట్టుకుంది . నాయకుల విన్యాసాలకు ప్రభావితం అయ్యాడు .  చిన్న వయసులోనే  క్విట్ ఇండియా ఉద్యమం లో పాల్గొని  జైలు జీవితం అనుభవించాడు.  జైలు జీవితం ముగిచాక బయటికి వచ్చి...
Image
భానుమతి ధైర్యానికి "మెచ్చు "తునక .  శ్రీమతి భానుమతి రామకృష్ణ గారి 95వ జయంతి సందర్భంగా  ఆమె వ్యక్తిత్వం, అంకితభావం  ఎలాంటిదో తెలియజెప్పే 56 సంవత్సరాల క్రితం జరిగిన అరుదైన సంఘటన :"నవ్య " పాఠకుల కోసం.  హీరో కావాలని సినిమా రంగంలోకి ప్రవేశించిన వి .బి .రాజేంద్ర ప్రసాద్ అవకాశాలు రావని తెలుసుకొని నిర్మాతగా మారాడు .  తన తండ్రి గారి పేరుతో జగపతి ఆర్ట్ పిక్చర్స్ సంస్థను ప్రారంభించి "అన్నపూర్ణ " అనే సినిమాను రూపొందించారు . తరువాత "ఆరాధన", "ఆత్మబలం " చిత్రాలను నిర్మించారు.  అయితే "ఆత్మబలం" సినిమా ఆర్ధికంగా దెబ్బతీసింది. అందుకే కథ విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకొని ఎంపిక చేసుకున్నారు . ఈ సినిమాలో కూడా నాగేశ్వర రావును  హీరోగా, దర్శకుడుగా వి .మధుసూదన రావు ను  .ఖరారు చేశారు.  హీరోయినిగా కృష్ణకుమారిని ఎంపిక చేసుకున్నారు.  ఈ సినిమాలో హీరో సోదరి పాత్రకు జమున అయితే బాగుంటుందని అనుకున్నారు. జమున "అన్నపూర్ణ "చిత్రంలో కథానాయిక . ఆమెకు  అడ్వాన్సు కూడా ఇచ్చారు . ఒక వారం రోజుల తరువాత రాజేంద్ర ప్రసాద్ గారికి ఫోన్ చేసి "నేను  ఆ పాత్ర చేయలేను...
Image
  దర్శనం మొగులయ్య మనసులో కోరిక ..? దర్శనం మొగులయ్య.  ఇప్పుడు ట్రేండింగ్ లో వున్న తెలంగాణ జానపద కళాకారుడు మొగులయ్య.  12 మెట్ల కిన్నెర కళాకారుడుగా కొందరికే తెలిసిన మొగులయ్య ఇప్పుడు పవన్ కళ్యాణ్ హీరోహా నటిస్తున్న" భీమ్లా నాయక్‌" తెలుగు  సినిమాలో "సెభాష్‌.. ఆడాగాదు ఈడాగాదు అమీరోళ్ల మేడాగాదు అన్న పాటను గానం చేసి ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. ఈ సినిమాకు సాగర్ కె చంద్ర దర్శకుడు కాగా తమన్ సంగీత దర్శకుడు.  మొగులయ్య గురించి విన్న పవన్ కళ్యాణ్ అతన్నిఅహ్వానించి "భీమ్లా నాయక్ " సినిమాలో టైటిల్ సాంగ్ పాడే అవకాశం కల్పించాడు . ఈ పాటను పాడినందుకు మొగులయ్య కు పవన్ రెండు లక్షల రూపాయలను స్వయంగా అందించాడు. పవన్ కళ్యాణ్ ఎంతో గొప్ప వ్యక్తి అని, మనసున్న కళాకారుడిని మొగులయ్య ప్రశంసిస్తున్నాడు .   అయితే మొగులయ్య ది చాలా పెద్ద సంసారం.  తెలంగాణ ప్రభుత్వం పెన్షన్ ఇస్తున్నా , ఈ వయసులో కూడా కిన్నెర సహకారంతో పల్లె , పల్లె తిరుగుతూ డబ్బు సంపాదిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు . ఇప్పటికీ మొగులయ్య హైదరాబాద్ నగరంలోని ఓ మురికివాడలో రేకుల షెడ్ లో నివాసం ఉంటున్నాడు . అది కూడా అద్దె...
Image
   తెలుగు సినిమాలో "ప్రకాశించిన " బహుముఖ ప్రజ్ఞాశాలి నేడు భానుమతి రామ కృష్ణ 95వ జయంతి.  తెలుగు సినిమా రంగంలో శ్రీమతి భానుమతి రామకృష్ణ గారికి  ఓ ప్రత్యేకమైన శైలి , స్థానం వున్నాయి . నటిగా ,గాయకురాలిగా, సంగీత దర్శకురాలిగా , దర్శకురాలిగా, రచయిత్రిగా , స్టూడియో అథినేతగా ఆమె బహుముఖాలుగా ఎదిగారు. ఆమెలా ఎదిగి ఒదిగిన నటి మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు  పద్మశ్రీ భ్నుమతి 1924 సెప్టెంబర్‌ 7న భానుమతి ప్రకాశం జిల్లా అద్దంకి తాలూకా దొడ్డవరం గ్రామంలో జన్మించారు. ఆమె తండ్రి బొమ్మరాజు వెంకట సుబ్బయ్య.  చిన్నతనంలోనే   రామాయణ, భారతాల్లోని పద్యాలను శ్రావ్యంగా ఆలపించేవారు. అలాగే చిరు పర్యంలో ఉండగానే రచనలు చేయడం ఆరంభించింది. ఒక వైపు చదువు మరోవైపు  నృత్యంలోనూ  ప్రావీణ్యం  సంపాందించి అందరినీ అబ్బురపరిచింది . ఆమెలోని ఆసక్తి గమనించి తండ్రి బాగా ప్రోత్సహించాడు .  చిన్నపుడు  భానుమతి ఎంతో అందంగా ఉండేది. చదువు, నృత్యం, రచన ఆమెను ఓ ప్రత్యేక మహిళగా నిలబెట్టాయి .  భానుమతి ప్రజ్ఞాపాటవాల గురించి విన్న అప్పటి అగ్ర దర్శకుడు సి.పుల్లయ్య  "వరవిక్రయం" సి...
Image
  నేను చదివిన ఉన్నత పాఠశాల  1966 నుంచి 1971 వరకు నేను ప్రకాశం జిల్లా ఇంకొల్లు మండలంలోని పావులూరు ఉన్నత పాఠశాల లో చదువుకున్నాను. ప్రతిరోజు మావూరు నాగండ్ల నుంచి 4 కిలోమీటర్లు నడిచి వెళ్ళేవాళ్ళం. ఎండల్లో,  వానల్లో పిల్లలందరం కబుర్లు చెప్పుకుంటూ అలసట లేకుండా స్కూల్ చేరేవాళ్ళం. అలాగే సాయంత్రం  కూడా అందరం ఆడుతూ పాడుతూ తిరిగి ఇళ్లకు చేరేవాళ్ళం.  10వ తరగతి తరువాత నేను ఇంటర్మీడియట్ చదవడానికి హైదరాబాద్ వచ్చాను . చదువు ఆ తరువాత ఉద్యోగం , తీరికలేని పనులు , ఎప్పుడన్నా వూరు వెళ్లినా స్కూల్ చూడటానికి వెళ్ళలేదు .  50 సంవత్సరాల తరువాత ఫిబ్రవరి  8వ తేదీన పావులూరు స్కూల్ కు వెళ్ళాను . ఆ స్కూల్ ను చూడగానే నాకు  చదువు చెప్పిన ఉపాధ్యాయులు , నాతో పాటు చదివిన పిల్లలు, నేను 10వ తరగతిలో ఉండగా ఎస్ .పి .ఎల్ గా ఉన్నప్పుడు  (విద్యార్థి నాయకుడు ) ప్రతి రోజు ఉదయం ఉపాధ్యాయులు , విద్యార్థులు   ప్రార్ధనలో పాల్గొనేవారు  .ఆ జ్ఞాపకాలు  నా స్మృతి పథంలో మెదిలాయి .  స్కూల్ అంతా తిరిగి చూశాను . చాలా మార్పులు వచ్చాయి . అయినా మేము చదివిన  ఆ భవనం అలాగే వుంద...
Image
  మాట తప్పని , మడమ తిప్పని నాయకుడు వై .ఎస్ డాక్టర్ వై.ఎస్ .రాజశేఖర రెడ్డి గారు మరణించి 12 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ తెలుగు ప్రజలు ఆయన ప్రవేశపెట్టిన పథకాలను , ఆయన స్మృతులను   మర్చిపోలేదు. రాశేఖర రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని తెలిపే ఓ అరుదైన సంఘటన తెలియజేస్తాను . 2004 అక్టోబర్ 11 వ తేదీ సాయంత్రం 6. 30 గంటల సమయం. హైదరాబాద్ లోని   ఫిలిం నగర్ దైవసన్నిధానం. అన్ని దేవతామూర్తులను అపురూపంగా అలంకరించారు . అప్పటికే సినిమా ప్రముఖులు , భక్తులతో కళకళలాడుతోంది . దేవాలయం చైర్మన్ నిర్మాత వి .బి . రాజేంద్ర ప్రసాద్ , కార్యదర్శి నటుడు , నిర్మాత మాగంటి మురళి మోహన్   అందరినీ   సాదరంగా ఆహ్వానిస్తున్నారు. దేవాలయం ప్రధాన ద్వారం దగ్గర సన్నాయి మేళం సిద్ధంగా వుంది. ప్రధాన పూజారి , ఇతర పూజారులు   ముఖ్య అతిథికి పూర్ణ కుంభం తో స్వాగతం చెప్పడానికి సిద్ధంగా వున్నారు. ఆ వచ్చే అతిధిని కలసి శుభాకాంక్షలు చెప్పడానికి పద్మభూషణ్ అక్కినేని నాగేశ్వర రావు , నిర్మాత పద్మశ్రీ డి .వి .ఎస్ రాజు ,, మూవీ మొఘల్ డి . రామానాయుడు , నిర్మాత అల్లు అరవింద్ , సహజకవి ఎమ్మెస్ రెడ్డి , టి .సుబ్బరామి రె...
Image
  భర్త కోసం జమున "స్వయంవరం" అలనాటి తార జమున పెళ్లి ముచ్చట్లు తెలుగు సినిమా రంగంలో శ్రీమతి జమున అనగానే అందరికీ గుర్తుకొచ్చేది సత్య భామ . నిజ జీవితంలో కూడా జమున లో ఆ జాణతనం వుంది. ఆ తెగువ , ధైర్యం , స్తైర్యం , ఆ పట్టుదల  మరో కథానాయికలో మనం చూడలేము . జమునమూడు  రోజుల క్రితమే  85 వ సంవత్సరంలో అడుగు పెట్టింది . ఇప్పటికీ ఆరోగ్యంగా , ఉత్సాహంగా యువ కథానాయికలు స్ఫూర్తి నిస్తూనే వుంది . జమున ,1936 ఆగష్టు 30 న  నిప్పాణి శ్రీనివాసరావు , కౌసల్య దంపతులకు హంపిలో జన్మించింది. చిన్నప్పుడు ఆదుకు జనాబాయ్ అన్న పేరు పెట్టారు.  ఆ తరువాత ఈ దంపతులు గుంటూరు జిల్లా తెనాలి తాలూకా దుగ్గిరాలకు మకాం మార్చారు . జామున ఇక్కడే పెరిగింది . చిన్నప్పటి నుంచి జమున కు నృత్యమన్నా , నటన అన్నా ఇష్టంగా ఉండేది . కూతురు ఆసక్తిని గమనించి శ్రీనివాసరావు నాటకాలలో  ప్రోత్సహించారు . అలా నాటకాలు వేస్తూ , నృత్యాలు చేస్తున్న జమునను చూసిన డాక్టర్ గరికపాటి రాజారావు తాను  నిర్మించి దర్శకత్వం వహించే "పుట్టిల్లు " సినిమాలో కథానాయికగా అవకాశం ఇచ్చాడు . 1952 లో ఈ సినిమా నిర్మాణమైంది . అప్పటికి జమున వయసు...
Image
గురు సంస్మరణ  ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం .  పావులూరు ఉన్నత పాఠశాల లో తెలుగు నేర్పిన ఉపాధ్యాయులు యాచమనేని మాధవరావు గారు , హైదరాబాద్ లో ఇంటర్మీడియట్ లో తెలుగు బోధించిన డాక్టర్ ఆచార్య తిరుమల గారు , ఇద్దరూ నన్ను తీర్చి దిద్దిన గురువులు . వారెప్పుడూ నాకు ప్రాతః కాల స్మరణీయులే .