Posts

Showing posts from April, 2021
Image
                        ఈ రోజు నా  పుట్టినరోజు  మే డే . ప్రపంచ కార్మికుల దినోత్సవం. కార్మికులంతా ఈ పండుగను జరుపుకుంటారు.  అయితే నేను  మాత్రం పుట్టినరోజు పండుగలు ఎప్పుడూ చేసుకోలేదు.  ఆత్మీయులు మాత్రం ప్రతి సంవత్సరం గ్రీట్ చేస్తుంటారు .  ఈ సందర్భగా ఓ చిన్న జ్ఞాపకం. 1983 మే 1 వ తేదీన అంటే 38 సంవత్సరాల క్రితం నేను చిక్కడపల్లి లో ఉండేవాడిని. ఆరోజు జ్యోతి చిత్రవార పత్రిక  ప్రెస్ మీట్ కు  వెళ్లి వచ్చేటప్పుడు నాతో పాటు వచ్చిన ఫోటోగ్రాఫర్ జి భరత్ భూషణ్ కు ఈ విషయం చెప్పాను . నాకు బర్త్ డే గ్రీటింగ్స్ చెప్పిన భరత్  ఇంటికి వచ్చి నా ఫోటోలు తీశాడు . మీరు చూస్తున్న ఫోటోలు అప్పటివే. .  1983 జనవరి 9న అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగు దేశం పార్టీని స్థాపించి ఎన్నికల్లో అఖండ విజయం సాధించి, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు .  ఆ తరువాత జ్యోతి చిత్ర వార పత్రికకు ముఖ్యమంత్రి రామారావు గారిని ఇంటర్వ్యూ చేశాను.  అనుకోకుండా నా బర్త్ డే రోజున రామారావు గారి కవర్ ఫోటో తో జ్యో...
Image
             కరోనాను ఎదుర్కొనే శక్తి ప్రకృతిలోని ఉంది - ప్రభాకర్  "ఇప్పుడు మనం భయానక పరిస్థితుల్లో ఉన్నాం. ఈ ప్రమాదకరమయిన పరిస్థితుల నుండి బయట పడే మార్గం తెలియక విలవిలలాడుతున్నాం. కానీ, ఈ మహమ్మారి కరోనా వైరస్ ని  అంతం చేయడానికి, నిరాదరణకు గురైన ఒక అద్భుత శక్తి ప్రకృతి చికిత్సలో ఉంది. అదే లంకణం అంటే.. ఉపవాసం, ఫాస్టింగ్.       మన పూర్వికులు, ఋషులు, "లంకణం పరమ ఔషదం" అని ఏనాడో చెప్పారు. ఈ నేచర్ క్యూర్ విధానాన్ని మన జాతిపిత మహాత్మా గాంధీ గారు ఆచరించి ఎన్నో విషయాలను మనకు అందించారు. ఆ వారసత్వాన్ని ఇప్పుడు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు  గారు, ఇంకొంతమంది నేచర్ క్యూర్ డాక్టర్లు కొనసాగిస్తున్నారు. కొన్ని సంవత్సరాలుగా నేను కూడా ఆ విధానాన్ని ఫాలో అవుతూ కొన్ని ప్రయోగాల్ని చేసి సక్సెస్ అయ్యాను. ఈ అనుబవాలన్నింటి వలనే ప్రతీ ఒక్కరూ వణుకుతున్న కరోన వైరస్ ని నిర్భయంగా... కావాలనే నా శరీరంలోకి రప్పించుకుని, ఉపవాసం అనే ఆయుధంతో నాలుగు రోజుల్లోనే పూర్తిగా నిర్మూలించుకున్నాను. నా భార్య కూడా నేచర్ క్యూర్ లోనే ఇంకో విధానంతో గొంతులోనె వైరస్ ని ని...
Image
                             చంద్ర మృతి వార్త బాధించింది  ఈ వార్త నన్ను బాగా కలవర పెట్టింది  గత కొంత కాలంగా ఆయన ఆరోగ్య బాగాలేదని విన్నాను . కానీ ఇంతలోనే ఇలా కరోనాతో వెళ్ళిపోతాడని అనుకోలేదు .  కరోనా  కథలు , కన్నీటి వ్యధలు వింటుంటే మనసు మౌనంగా రోదిస్తుంది. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మరణ వార్తలు బాధిస్తూనే ఉంటున్నాయి . చంద్ర కూడా ఈ కరోనాకు బలై పోతాడని అనుకోలేదు .  చంద్ర కేవలం ఆర్టిస్టు మాత్రమే కాదు , కధకుడు , నటుడు , కళా దర్శకుడు , అన్నింటికీ మించి మంచి మిత్రుడు .  డెబ్బయ్యవ దశకం  నుంచి  చంద్ర వైభవం చూశాను . అప్పట్లో చాలామంది వర్ధమాన ఆర్టిస్టులకు చంద్ర గొప్ప  ప్రేరణ .  చంద్ర తో నాకు 1975 నుంచి పరిచయం . చంద్ర ను మొదట పరిచయం చేసింది మా అన్నయ్య కోటేశ్వర రావు .  అప్పట్లో చంద్ర  నారాయణ గూడలో ఉండేవారు . చిక్కడపల్లి నుంచి కాచిగూడా వెళ్లే మార్గంలో దీపక్ థియేటర్ దాటిన తరువాత ఎడమ వైపు వచ్చే  చిన్న వీధి లో కొంచెం ముందు కెళ్లిన తరువాత  ఓ  ...
Image
                                 48వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమణ  భారత సుప్రీమ్ కోర్ట్ 48వ ప్రధాన న్యాయ మూర్తిగా జస్టిస్ నూతలపాటి వెంకట రమణ ఈరోజు ప్రమాణస్వీకారం చేశారు . న్యూ ఢిల్లీ రాష్ట్రపతి భవన్ లోని అశోకా హాల్ లో జస్టిస్ రమణ తో రాష్ట్రపతి శ్రీ రామనాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయించారు.  ఈ కార్యక్రమంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ , ఉపరాష్ట్రపతి శ్రీ ఎమ్ . వెంకయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు . 
Image
                                             24-04-1986 నాటి జ్ఞాపక చిత్రమ్  35 సంవత్సరాల  నాటి  మధుర స్మృతి . అప్పుడు నేను ఆంధ్ర జ్యోతి  నుంచి వెలువడే జ్యోతి చిత్ర సినిమా వార పత్రిక కు హైద్రాబాదు లో  రిపోర్టర్ గా ఉండేవాడిని. సినిమా వారితో ఆత్మీయమైన సంబంధాలు ఉండేవి. సినిమాకు సంబంధించి ఏ కార్యక్రమం జరిగిన జర్నలిస్టులు తప్పనిసరిగా పాల్గొనేవారు . అప్పట్లో జర్నలిస్టుల మీద ఆంక్షలు ఉండేవి కాదు . అందరూ చాలా ఆత్మీయంగా పలకరించేవారు . చాలా సరదాగా ఉండేది .  నిజాం ప్రాంతంలో వున్న పంపిణీదారులంటే  నిర్మాతలు , దర్శకులు , హీరోలు ఎంతో అభిమానంగా ఉండేవారు . సినిమా విడుదల లో పంపిణీదారులే కీలక బాధ్యత వహించేవారు . పంపిణీ సంస్థలన్నీ సికింద్రాబాద్ రాష్ట్రపతి రోడ్డులో ఉండేవి. అన్ని పంపిణీ సంస్థల అధినేతలతో నాకు స్నేహ సంబంధాలు ఉండేవి. నెలకొకసారైనా పంపిణీ సంస్థల వార్తలు రాస్తూవుండేవాడిని . అందుకే నన్ను అందరూ అభిమానించేవారు . లక్షి చిత్ర యలమంచిలి హరికృష్ణ గారు , శ్రీన...
Image
                           34 సంవత్సరాలనాటి స్మృతి  చిత్రమ్  చేగొండి హరి రామ జోగయ్య గారు ఈరంకి శర్మ గారి దర్శకత్వంలో రూపొందించిన "అగ్నిపుష్పం " సినిమా షూటింగ్ పాలకొల్లులో మొదలైంది . ఇందులో సీత, శుభాకర్ హీరో హీరోయిన్లు . ఈ సినిమా షూటింగ్ కవర్ చెయ్యడానికి నిర్మాత  హరి రామ జోగయ్యగారు  హైదరాబాద్ నుంచి  జర్నలిస్టులను ఆహ్వానించారు . 20 ఏప్రిల్ 1987న సినిమా ప్రారంభోత్సవం జరిగింది .  అదేరోజు సాయంత్రం ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో నటించిన కుయిలీ రూమ్ కి నాతో పాటు వినాయక  రావు , కేశవ్ రావు , వెంకట రావు వెళ్లి ఆమెతో కాసేపు మాట్లాడాము.  అప్పట్లో హీరో హీరోయిన్ , మిగతా నటీనటులు జర్నలిస్టులతో సరదాగా మాట్లాడేవారు . వారి వ్యక్తిగత విషయాలను కూడా పంచుకునేవారు . అయితే వారికి ఇబ్బంది కలిగించేలా ఎవరూ వ్రాసేవారు కాదు . అందుకే జర్నలిస్టులంటే ఆత్మీయులుగా భావించేవారు. అప్పటి రోజుల్లో సినిమా షూటింగ్ లో జర్నలిస్టులు పాల్గొనేవారు . బహుశ అలాంటి ఆహ్లాద వాతావరణం ఇప్పుడులేదనుకుంటా .
Image
                       ఈరోజు నిర్మాత ఏడిద నాగేశ్వరరావు జయంతి . శంకరాభరణం ,సాగరసంగమం,స్వయంకృషి ,స్వాతిముత్యం , ఆపత్బాంధవుడు , సితార , సీతాకోకచిలుక లాంటి అద్భుత  దృశ్య కావ్యాలను మనకు అందించిన నిర్మాత శ్రీ ఏడిద నాగేశ్వరరావు గారి 87వ జయంతి. 1976 లో ఆయన మిత్రుల ప్రోత్సాహంతో సిరి సిరి మువ్వ చిత్రానికి నిర్వహణ బాధ్యతులు వహించి విజయం సాధించారు . ఆ విజయం ఇఛ్చిన ఉత్సాహంతో పూర్ణోదయా ఆర్ట్ క్రియేషన్స్ సంస్థను స్థాపించి  తాయారమ్మ బంగారయ్య చిత్రాన్ని నిర్మించారు . అది మంచి విజయం సాధించింది .తదుపరి చిత్రం  కె . విశ్వనాధ్  దర్శకత్వంలో రూపొందించిన శంకరాభరణం  తెలుగు సినిమా  ఖ్యాతని ఖండాంతరాలకు తీసుకెళ్లింది  . ఈ చిత్రానికి వచ్చిన  పేరు కలెక్షన్స్ గాని , జాతీయ - అంతర్జాతీయ - అవార్డులు మరే  చిత్రానికీ రాలేదంటే , అతిశయోక్తి కాదు. జాతీయ స్థాయిలో స్వర్ణ కమలం పొందిన మొట్ట మొదటి చిత్రం . అలాగే ఏ దేశం వెళ్లినా శంకరాభరణం గురించి మాట్లాడేవారు  .ఆ తర్వాత వచ్చిన సీతాకోకచిలుక అప్పట్లో ఓ ట్రెండ్ సెట్టర్ . ఇప్ప...
Image
  40 సంవత్సరాలనాటి జ్ఞాపక చిత్రమ్  ఈరోజు గాన కోకిల ఎస్ జానకి గారి పుట్టినరోజు.. విలక్షణమైన జానకి గారు 15 భాషల్లో పాటలు పాడారు .  ఆమె స్వరంలో సరిగమలు అలవోకగా జాలువారుతాయి .  జానకి గారితో నేను 1981 నవంబర్ 1వ తేదీన హైదరాబాద్ లోని అశోక హోటల్లో ఇంటర్వ్యూ చేశాను. అప్పట్లో మద్రాస్ నుంచి సినిమా వారు హైదరాబాద్ వస్తే అశోక హోటల్లో బస చేసేవారు .  అప్పుడు నేను ఆంధ్ర జ్యోతి నుంచి వెలువడే జ్యోతి చిత్ర రిపోర్టర్ గా ఉండేవాడిని. జానకి గారిని ఇంటర్వ్యూ చెయ్యడానికి వెళ్ళినప్పుడు నాతో పాటు ఫోటోగ్రాఫర్ శ్యామ్ కూడా వచ్చాడు .  తన జీవితం , సంగీత ప్రస్థానం గురించి జానకి గారు వివరించారు .  ఎంత ఎదిగినా ఒదిగి వుండే తత్త్వం జానకి గారిది . ప్రస్తుతం ఆమె వయసు 83 సంవత్సరాలు . అయినా ఆ స్వరం లో మార్పు రాలేదు .  అదే ఆమె ప్రత్యేకత . జానకి గారు మరిన్ని పుట్టిన రోజు పండుగలు చేసుకోవాలని కోరుకుందాం. 
Image
  డా . నరిశెట్టి ఇన్నయ్య , డా .నవీన  నరిశెట్టి హేమంత్  అందరూ చదవాల్చిన అపురూప గ్రంథం  " కరోనా వైరస్ " కోవిద్ -19 . ప్రపంచాన్ని వణికించిన మహమ్మారి వైరస్ .  దీని పూర్వాపరాలు - విశ్లేషణ - మార్గదర్శకాలు  గురించి  ఇంగ్లిష్ లో  డా.  స్వప్ నైల్ పారిఖ్ , డా . మహేరా దేశాయ్ , డా . రాజేష్ పారిఖ్  రచించారు . వీరు ఈ గ్రంథాన్ని ఎన్నో గ్రంథాలు , వ్యాసాలు పరిశీలించి ,పరిశోధించి రచించారు . ఈ  గ్రంథాన్ని తెలుగులో డా . నరిశెట్టి ఇన్నయ్య , డా .నవీన  నరిశెట్టి హేమంత్ అనువదించారు .  వైరస్ గురించి వెలువడిన అద్భుతమైన పుస్తకం . అందరూ చదవాల్చిన గ్రంథం .  సీనియర్ జర్నలిస్ట్ ఇన్నయ్య గారు గతంలో ఎన్నో గ్రంధాలను రచించారు .  కరోనా వైరస్ గురించి తెలుగువారి కోసం ఇన్నయ్య గారు డాక్టర్ అయిన తమ కుమార్తె నవీన తో కలసి అందించారు . ఈ గ్రంధంలో ఎంతో విలువైన సమాచారం వుంది .  దీనిని ఎమెస్కో వారు ప్రచురించారు . జూబిలీహిల్స్ జర్నలిస్ట్ ఏ కాలనీలోని అక్షర బుక్ షాప్ లో  ఇది లభ్యమవుతుంది .  ఇంతమంచి పుస్తకాన్ని తెలుగులో తీసుకొచ్చిన డా . ఇన్నయ్య గారిన...
Image
  ప్లవ నామ సంవత్సర పురస్కారం మరియు కళా మనస్వి బిరుదు  శ్రీమానస ఆర్ట్ థియేటర్స్, చిరు నవ్వు మరియు శ్రీత్యాగరాయ గానసభ సంయుక్తంగా నిర్వహించిన ఉగాది పురస్కారాల్లో  తెలుగు విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ ఆచార్య ఎల్లూరి శివారెడ్డి గారు ముఖ్య అతిథి గా వచ్చి ఈ అవార్డును బహుకరించారు .  మానస ఆర్ట్ థియేటర్స్ కార్యదర్శి రఘుశ్రీ ఈ అవార్డును ప్రకటించి, ఆత్మీయంగా సభను నిర్వహించి, అందరికీ అవార్డులను బహుకరించారు.  ఈ సంవత్సరం మానస, గాన సభ అవార్డు తో పాటు కళా మనస్వి బిరుదు కూడా నాకు ప్రదానం చేశారు . మిత్రుడు రఘుశ్రీ  ఇతర సబ్యులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు .  
Image
                              శ్రీ మానస ఉగాది పురస్కారం శ్రీ మానస , శ్రీ త్యాగరాయ గానసభ మరియు చిరు నవ్వు సంస్థలు సంయుక్తంగా నిర్వహించే ఉగాది ఉత్సవాల్లో ఈ సంవత్సరం నాకు ఉగాది పురస్కారాన్ని ప్రకటించాయి . 2021 సంవత్సరానికి వివిధ రంగాల్లో ప్రతిభావంతులకు ఈ పురస్కారాలను  ప్రకటించారు . సాహిత్యము , పత్రికా రంగంలో నాకు ఈ పురస్కారం ఇస్తున్నట్టు శ్రీ మానస ఆర్ట్ థియేటర్స్ కార్యదర్శి రఘుశ్రీ తెలిపారు .  ఏప్రిల్ 17 శనివారం రోజు హైదరాబాద్ లోని శ్రీ త్యాగరాయ గానసభలో ఈ పురస్కార ప్రదానోత్సవం జరుగుతుంది . 
Image
                     తెలుగు-బంజారా భాష‌ల్లో  `సేవాదాస్‌`  తెలుగు, బంజారా భాష‌ల్లో కేపియన్‌ చౌహాన్‌ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తోన్న  చిత్రం ‘సేవాదాస్‌’.   సుమన్‌,  భానుచందర్, ప్రీతి అశ్రాని, రేఖా నిరోషా  నటిస్తున్నారు. హాథీరామ్‌ బాలాజీ క్రియేషన్స్‌  పతాకంపై  వినోద్‌ రైనా ఎస్లావత్‌, సీతారామ్‌ బాదావత్‌ సంయుక్తంగా  ఈ సినిమా నిర్మిస్తున్నారు. బోలే సంగీతాన్ని సమకూర్చిన ఈ చిత్రంలోని బంజారా భాష‌కు సంబంధించిన  టైటిల్‌ సాంగ్‌ను గురువారం  ప్రసాద్‌ ల్యాబ్స్‌లో ఆవిష్కరించారు.  ఈ పాటను యువ గాయకుడు స్వరాగ్‌ ఆపించారు.  నిజాయితీకి మారుపేరైన ఓ తండ్రి బాటలో నడిచే కొడుకు  కథ ఎలా మొదలైంది? ఎలా ముగిసింది? అనేది  ‘సేవాదాస్‌’ చిత్ర కథాంశం.  ఈ చిత్రం షూటింగ్‌  కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.  న‌టుడు సుమ‌న్ మాట్లాడుతూ...``నేను ఇప్ప‌టి వ‌ర‌కు ఎనిమిది భాష‌ల్లో న‌టించాను. బంజారా భాష‌లో రూపొందుతోన్న `సేవాదాస్‌` తో తొమ్మిదవది . . ఇక ఈ సినిమా లో బంజారా క‌మ్యూనిటీకి ...
Image
                 హఠాత్తుగా వై .కె .నాగేశ్వర రావు మృతి చిరకాల మిత్రుడు , సౌమ్యుడు, యువకళావాహిని సాంస్కృతిక సారథి వై .కె .నాగేశ్వర రావు గారు ఇక లేరు అన్న  వార్త నన్ను కలచివేసింది . ఇప్పటికీ ఇది  నిజం కాదేమో అనిపిస్తుంది . కొన్ని రోజుల క్రితమే నాగేశ్వర రావు గారితో మాట్లాడాను .  ఇంతలోనే ఇలాంటి వార్త వస్తుందని ఊహించలేదు.  నాగేశ్వర రావు గారితో నాకు 1985 నుంచి పరిచయం . ఆయనకు సాంస్కృతిక రంగం, అన్నా సినిమా రంగం అన్నా ఎంతో ఇష్టం . నాగేశ్వర రావు గారితో నా పరిచయం అప్పటి నుంచి ఆత్మీయంగా కొనసాగుతూనే వుంది .  .  కరోనా కష్ట సమయంలో ఎంతో మంది నాటక రంగ కళాకారులను ఆదుకున్న మంచి మనిషి నాగేశ్వర రావు గారు . కరోనా సమయంలో జూమ్ కార్యక్రమాలు చేసిన నాగేశ్వర రావు మళ్ళీ రెండు రాష్ట్రాల్లో వేదికలపై వరుస కార్యక్రమాలు చెయ్యడం మొదలు పెట్టారు. ఊహించని విధంగా నాగేశ్వర రావు ఇలా వెళ్ళిపోతారని అనుకోలేదు . యువకళావాహిని సారధిగా సాంస్కృతిక  రంగంలో తనదైన ముద్రవేసుకున్న నాగేశ్వర రావు గారు లేని లోటు ఎప్పటికీ భర్తీకాదు .  నిజాయితీపరుడు, నిగర్వీ...
Image
              ఆచార్య సినిమా షూటింగ్ కు సైకిల్ పై సోను సూద్  సోనూ సూద్ . దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజల మదిలో ఉండిపోయిన పేరు. కరోనా మహమ్మారి కాటేసిన వేళలో లక్షలాది  మంది దిక్కుతోచక రోడ్ల మీద కాలినడకన స్వస్థలాలకు వెళుతుంటే.. వారిని స్వచ్చందంగా ఆదుకున్న  సోనూసూద్ సహాయం ఎప్పటికీ గుర్తుండిపోతుంది.  మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఆచార్యలో చిత్రంలో సోనుసూద్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ లొకేషన్ కు సోనుసూద్ సైకిల్ మీద వెళ్లారు . సోనూసూద్ కి సైక్లింగ్ అంటే చాలా ఇష్టం. పైగా.. ఉద‌యాన్నే సెట్ కి వెళ్లాల్సిన అవ‌స‌రం వ‌చ్చింది. అందుకే మరేమీ ఆలోచించకుండా సైకిల్ ఎక్కాడు. అటు వ్యాయామం, ఇటు.. ప్ర‌యాణం రెండూ క‌లిసొచ్చేశాయి. 
Image
                    తెలుగు వారందరికీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు .                          ఈ ఉగాది అందరి జీవితాల ఆనందానికి  కావాలి ఆది.  
Image
  అల్లరి నరేష్ విడుదల చేసిన  "సర్వము  సిద్దం"మూవీ ట్రైలర్  గోవింద్ రాజ్, సంతోష్, సిహెచ్ సిద్దేశ్వర్, మందార్, కిరణ్ మెడసాని,  పూజ, అనుపమ పట్నాయక్, లావణ్య,నటించిన సినేటెరియా మీడియా వర్క్స్ పతాకంపై అతిమళ్ల రాబిన్ నాయుడు దర్శకత్వంలో శ్రీలత బి.వెంకట్ నిర్మించిన హాస్యభరిత చిత్రం "సర్వము  సిద్దం". (నవ్వుకున్నోళ్లకు నవ్వుకున్నంత టాగ్ లైన్). ట్రైలర్ను  హీరో అల్లరి నరేష్ విడుదల చేశారు..ఈ చిత్రం ఏప్రిల్ 16నవిడుదలవుతుంది  . ఈ సినిమా ట్యాగ్ లైన్  సినిమాలో ఉండబోయే కామెడీని సూచిస్తుందని, నవ్వుకున్నోళ్ళకు నవ్వుకున్నంత హాస్యము తో ఈ చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు హాయిగా నవ్వుకోవాలని కోరుకుంటున్నానని  అల్లరి నరేష్ తెలియజేశారు.  ఈ చిత్ర ట్రైలర్ ఆద్యంతం నవ్వులు కురిపిస్తోందనీ, సినీ రంగంపై అత్తెసరు నాలెడ్జ్ ఉన్న దర్శకుడి చేతిలో సినీ నిర్మాత, నటీనటులు, టెక్నీషియన్లు పడ్డ అగచాట్లు, మరియు సినిమాలో చూపించిన  వెరైటీ రోమాంటిక్ టచ్ కడుపుబ్బా నవ్విస్తోందని నరేష్  తెలియజేశారు. హాస్యం ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి మంచిదనీ, ఈ సర్వము  సిద్దం చి త్రం కావలసినం...
Image
                            అగ్ర కోట, తాజ్ మహల్ సందర్శన   అగ్ర కోటను సందర్శించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఢిల్లీ కి అనేకసార్లు వెళ్లినా ఆగ్రా  ఫోర్ట్ ను చూడటానికి వెళ్ళలేకపోయాను  అయితే 2016లో ఢిల్లీ తెలుగు అకాడమీ నుంచి  ఉగాది అవార్డు స్వీకరించిన తరువాత రోజు ఏప్రిల్ 11న ఆగ్రా  వెళ్ళాను . ముందుగా ఆగ్రా ఫోర్ట్ చూశాను. చరిత్ర అంటే నాకు ఎంతో ఇష్టం . దాని మీద అధ్యయనం చేశాను కాబట్టి ఈ కోటను చూడాలని అనుకున్నాను. అది 2016లో సాధ్యపడింది . 1504లో లోధి వంశం వారు ఈ కోటను నిర్మించారు. 1526లో ఇది మొఘల్ చక్రవర్తుల పాలనలో కొచ్చింది. 94 ఎకరాల విస్తీర్ణంలో అద్భుతంగా నిర్మించారు.  ఈ కోటలో బందీ గా వున్న షాజహాన్ తన ప్రియురాలు ముంతాజ్  కోసం కట్టించిన తాజ్ మహల్ ను చనిపోయేంత వరకు తదేకంగా చూస్తూండేవాడట . యమునా నది ఒడ్డున వున్న ఎంతో సుందరంగా , హుందాగా వున్న తాజ్ మహల్ ఈ కోట నుంచి కనిపిస్తూ ఉంటుంది . ఈ కోటను చూడటం మర్చిపోలేని అనుభూతి .   ఆ తరువాత ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తాజ్ మహల్ ను సందర్శించాను . తాజ్ ...
Image
                 10-04-2016 లో ఢిల్లీ తెలుగు అకాడమీ అవార్డు .  ఐదు సంవత్సరాల క్రితం ఏప్రిల్ 10న  ఢిల్లీ తెలుగు అకాడమీ వారు ఉగాది అవార్డు తో నన్ను సత్కరించారు .  సీనియర్ జర్నలిస్టు గా నన్ను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్టు ఢిల్లీ తెలుగు అకాడమీ నాగరాజు గారు తెలిపారు .  ఢిల్లీలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవం ముందు నేను రచించిన 'అమరావతి " నృత్య గీతాన్ని క్రాంతి బృందం ప్రదర్శించింది .  ప్రేక్షకులనుంచి అమరావతికి విశేష స్పందన వచ్చింది .  అప్పటి మహారాష్ట్ర గవర్నర్ సి . హెచ్  విద్యాసాగర్ రావు గారు , సమాచార కమీషనర్ మాడభూషి శ్రీధర్ గారు , మోహన్ కందా గారు నన్ను సత్కరించి ఈ అవార్డు బహుకరించారు .  మర్చిపోలేని మధురమైన జ్ఞాపకం   
Image
        "వకీల్ సాబ్" సినిమాకు ఆంధ్ర ప్రదేశ్  ప్రభుత్వం ఆక్షలు  పవన్ కళ్యాణ్ నటించిన తాజా సినిమా వకీల్ సాబ్ సినిమా ఈరోజు ప్రపంచ వ్యాప్తగా విడుదలైంది . పవన్ కళ్యాణ్ జనసేనపార్టీ పెట్టి రాజకీయాల్లోకి వెళ్లిన మూడు సంవత్సరాల తరువాత చేసిన సినిమా వకీల్ సాబ్ . అందుకే  ఈ సినిమా ను నిర్మాత దిల్ రాజు భారీ స్థాయిలో విడుదల చెయ్యడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు . రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ థియేటర్ లను కూడా బుక్ చేసుకున్నారు .  పెద్ద హీరోల సినిమాలు విడుదల సమయంలో థియేటర్ లో అంతకు ముందు వున్న టికెట్ రేట్లకు బదులుగా ఎక్కువ రేట్లు నిర్ణయిస్తారు .అలాగే ప్రీమియర్ షో లు కూడా వెయ్యడానికి ప్లాన్ చేస్తారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడా తమకు సహకరిస్తుందనే ఉద్దేశ్యంతో  వకీల్ సాబ్ సినిమా విడుదలకు ముందు థియేటర్ రెట్లకన్నా రెండు  మూడు రేట్లు టికెట్ రేట్లను పెంచి అడ్వాన్స్ బుకింగ్ కూడా ఇచ్చారు . . అయితే సినిమా విడుదలకు ఒకరోజు ముందు ఏప్రిల్ 8 గురువారం రోజు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం హోమ్ డిపార్మెంట్ ఒక ఉత్తర్వు జారీ చేసింది . దీని ప్రకారం థియేటర్ లో తాము చూపించిన వ...
Image
                   భారతమెరికా చదివి పరవశించాను -వాశిరాజు  పాత్రికేయ మిత్రులు భగీరథ రచించిన "భారతమెరికా "  చదివిన తరువాత నా మనసు పులకరించింది. అదొక విశిష్ట  పుస్తకం అనిపించింది . "భారతమెరికా "  ఓ వెలుగు దీపం. ఆ వెలుగుల్లో ఎన్నెన్నో భావాలు .  ఆ భావసాగరంలో ఎన్నెన్నో విలువైన అలల సవ్వడులు  వింటాం . కళ్లారా చూస్తాం .  నా ప్రియ మిత్రుడు భగీరథలో ఇంతటి పాడిత్యం దాగివుందా ? అక్షరాలకు అందని ఇంతటి భాషా జ్ఞానం ఆయనలో ఇమిడి ఉన్నదా ? అన్నిటికీ మించి తన చుట్టూ వున్న సమాజాన్ని ఇంత నిస్వార్ధంగా ప్రేమించే సంస్కారం ఉందా ? అనిపిస్తుంది .  భగీరథ ఓ అరుదైన జర్నలిస్టు , రచయిత , కవి కాబట్టే భారతమెరికా లాంటి అద్భుతమైన పుస్తకం వ్రాయగలిగారనిపిస్తుంది.   భారతమెరికా పుస్తకంలో మనల్ని ఆకట్టుకొని , ఆశ్చర్య పరిచే అంశాలెన్నో వున్నాయి , భారత్ , అమెరికా దేశాల మధ్య సంబంధాలే కాదు 12వ శతాబ్దం నుంచి భారత దేశ చరిత్రను , నన్నయ యుగం నుంచి తెలుగు సాహిత్య పరిణామ క్రమాన్ని భగీరథ  ప్రతివారికీ సులభంగా అర్ధమయ్యేలా రచించారు . 2014లో వం...
Image
         గ్రామీణ నేపథ్యంలో "మా ఊరి ప్రేమ కథ" ట్రైలర్  మంజునాథ్ హీరోగా తనిష్క్ హీరోయిన్ గా శ్రీ మల్లికార్జున స్వామి క్రియేషన్స్ పతాకంపై యస్వీ మంజునాథ్  దర్శకత్వంలో నిర్మించిన చిత్రం "మా ఊరి ప్రేమకథ". సినిమా ట్రైలర్ ను  గురువారం  విడుదల చేశారు.   మా ఊరి ప్రేమకథ ట్రైలర్ ను నిర్మాత  కెయల్ దామోదర ప్రసాద్ఆవిష్కరించారు. నిర్మాత కెయల్ దామోదర ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రేమకథా చిత్రాలు చాలా వచ్చాయి.. వస్తున్నాయి.. అన్నీ ప్రేమకథలు ఒకటే.. ఏం మారవు.  డిఫరెంట్ జోనర్సలో ప్రెజెంటేషన్ కొత్తగా ఉంటే కచ్చితంగా హిట్ అవుతాయి. ఈ చిత్రం ట్రైలర్,  సాంగ్స్ చూస్తుంటే రియలిస్టిక్ గా తీశారనిపిస్తుంది .ఈ చిత్రం హిట్ అయి మంజునాథ్ కి మంచి పేరు రావాలి అన్నారు..  టి.ప్రసన్నకుమార్ మాట్లాడుతూ.. రాయలసీమ బాక్డ్రాప్ లో వచ్చిన ప్రేమకథలు అన్నీ మంచి హిట్ అయ్యాయి.. ఆకోవలోనే మంజునాథ్ ఈ చిత్రం చేశారు.. "ప్రేమించుకుందాం రా" సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ఈ చిత్రం కూడా అంతే హిట్ కావాలి అన్నారు. హీరో, నిర్మాత, దర్శకుడు మంజునాథ్ మాట్లాడుతూ.. ఎంతో వ్యయప్రయాసాలకోర్చి ఈ...
Image
  మసాలా మూవీ "స్ట్రీట్ లైట్ ట్రైలర్ "                   మూవీ మాక్స్ బ్యానర్ పై తాన్య దేశాయ్, అంకిత్ రాజ్,  కావ్య రెడ్డి,  వినోద్ కుమార్ ప్రధాన                     పాత్రల్లో  విశ్వ దర్శకత్వంలో   శ్రీ మామిడాల శ్రీనివాస్ నిర్మించిన చిత్రం స్ట్రీట్ లైట్.  ఈ                     చిత్రం      టీజర్  ను    దర్శకుడు జి నాగేశ్వర రెడ్డి  విడుదల చేయగా, ట్రైలర్ ని నిర్మాత                     సి కళ్యాణ్ విడుదల చేశారు . సి కళ్యాణ్ మాట్లాడుతూ .. పాట .. చాలా బాగుంది.. రామసత్యనారాయణ పాన్ ఇండియా అంటున్నారు.. ఇది హాలీవుడ్ కు వెళ్లినా బాగుంటుందేమో అని నా అభిప్రాయం. నిర్మాత శ్రీనివాస్ మంచి థాట్స్ తో ఈ సినిమా తీశారు.. కానీ సెన్సార్  రియాక్షన్ ఎలా ఉంటుందో మరి. ఇక ఈ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ను మించిపోయారు అ...
Image
" బ్యాక్ డోర్ " సినిమా పాటను ఆవిష్కరించిన  వై.ఎస్. షర్మిల  'బ్యాక్ డోర్' చిత్రం లోని  'యుగాల భారత స్త్రీని' అనే పల్లవితో సాగే గీతాన్ని వై.ఎస్. షర్మిల ఆవిష్కరించారు. బుధవారం రోజు హైద్రాబాద్ లోని లోటస్ పాండ్ లో షర్మిల ఈ పాటను ఆవిష్కరించి నిర్మాతలు శుభాకాంక్షలు తెలిపారు . .   ప్రణవ్ సంగీత సారధ్యం వహించిన "బ్యాక్ డోర్" చిత్రంలోని ఈ గీతానికి జావళి సాహిత్యం అందించారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ చిత్రం లోని పాటలు విడుదలవుతున్నాయి   పూర్ణ ప్రధాన పాత్రలో.. తేజ త్రిపురాన హీరోగా ఆర్కిడ్ ఫిలిమ్స్ పతాకంపై కర్రి బాలాజీ దర్శకత్వం.. 'సెవెన్ హిల్స్' సతీష్ కుమార్ సమర్పణలో బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మిస్తున్న 'బ్యాక్ డోర్' అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని.. త్వరలో విడుదలకాబోతుంది .       ఈ చిత్రానికి కో-డైరెక్టర్: భూపతిరాజు రామకృష్ణ, పోస్టర్ డిజైన్: విక్రమ్ రమేష్, కొరియోగ్రఫీ: రాజ్ కృష్ణ, పాటలు: నిర్మల, చాందిని, సంగీతం: ప్రణవ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: రవిశంకర్, ఆర్ట్: నాని, ఎడిటింగ్: చోటా కె.ప్రసాద్, కెమెరా: శ్రీకాంత్ నారోజ్, ప్రొడక్షన్ డిజైనర్: విజయ ఎల్...
Image
 కరోన వ్యాక్సిన్ డ్రైవ్ ను ప్రారంభించిన  సోనూసూద్ సోనూ సూద్ బుధవారం అమృత్ సర్ లోని ఓ ఆసుపత్రిలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ సందర్భంగా సోనూ సూద్ కరోనా వ్యాక్సిన్ డ్రైవ్ ని ప్రారంభించారు. కరోనా వ్యాక్సిన్ పట్ల ప్రజల్లో చైతన్యం కలిగేలా, ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ తీసుకునేలా ఈ డ్రైవ్ ఉంటుందని ఆయన తెలిపారు.   కరోనా వ్యాక్సిన్ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడం చాల ముఖ్యమని . అందుకే ఈ వ్యాక్సిన్ డ్రైవ్ ని ప్రారంభిస్తున్నాను. కొంతమంది ప్రజలు కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలా వద్దా అని ఇంకా ఆలోచిస్తున్నారు. ప్రతి ఒక్కరు తమ కుటుంబంలోని వృద్దులు కరోనా వ్యాక్సిన్ తీసుకునేలా కృషి చేయాలి. వారి ఆరోగ్యాలు కాపాడుకునేందుకు కరోనా వ్యాక్సిన్ చాల ఉపయోగపడుతుందని సోనూసూద్ తెలిపారు. పంజాబ్ తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ కోవిడ్ వ్యాక్సిన్  అందచెయ్యబోతున్నాము. గ్రామీణ ప్రజలు వ్యాక్సిన్వే యించుకోవడానికి ఆలోచన చేస్తున్నారు కావున ఈరోజు అందరి ముందు వ్యాక్సిన్ వేయించుకోవడం జరిగిందని సోనూసూద్ తెలిపారు. త్వరలో పలు ప్రాంతాల్లో  వ్యాక్సిన్    ప్రారంభిస్తానని  ఆయన అన్నారు.....
Image
                                     "వధుకట్నం" సెన్సార్  పూర్తి   శ్రీహర్ష, ప్రియ , రఘు , కవిత , ఆర్యన్ , రేఖ , కుషాల్ , అనోన్య , మణి చందన  నటించిన  గ్రీన్ క్రాస్ థియోసోఫికల్  రూరల్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్  సొసైటీ సమర్పణ లో "షబాబు ఫిలిమ్స్ " పతాకం పై భార్గవ గొట్టిముక్కల దర్శకత్వం లో  "షేక్ బాబు సాహెబ్" నిర్మించిన  కధా చిత్రం " వధుకట్నం సెన్సార్ పూర్తి చేసుకుంది .  ప్రస్తుత సమాజం లో మహిళలు ఎన్నో రంగాలలో , పురుషులతో సమానంగా రాణిస్తున్నా  , ఇంకా మహిళల పట్ల వివక్ష కొనసాగుతూనే ఉంది . స్కానింగ్ లో ఆడ శిశువు అని తెలుసుకొని కొందరు అబార్షన్స్ చేయించడం వల్ల  ఆడ పిల్లల నిష్పత్తి తగ్గి పెళ్ళికి మగ పిల్లల కు ఆడ పిల్లలే దొరక్కపోతే  అమ్మాయిలకే "వధుకట్నం ", ఇవ్వాల్సిన రోజులు వస్తాయనే సందేశం తో రూపొందించిన ఈ చిత్ర దర్శక నిర్మాతలను  హేమ అభినందించింది.   ఈ చిత్రం పోస్టర్ ను ఆవిష్కరించి స్త్రీలను రక్షించండి ; గౌరవించండి ; స్త్రీ లపైనున్న...
Image
                        ప్రేమలో మోసపోయిన "మిస్టర్ లోన్లీ"                                                శ్రీమతి దుర్గావతి సమర్పణలో  యస్.కె.యం.యల్ మోషన్ పిక్చర్స్ పతాకంపై విక్కీ, నూరజ్, కీయా, లోహిత తో  ముక్కి హరీష్ కుమార్ దర్శకత్వంలో కండ్రేగుల ఆదినారాయణ నిర్మిస్తున్న చిత్రం "మిస్టర్ లోన్లీ" . ఈరోజు ట్రైలర్  విడుదల చేశారు అనంతరం దర్శకుడు ముక్కి హరీష్ కుమార్ మాట్లాడుతూ .. ముగ్గురు అమ్మాయిల మధ్య ఒక అబ్బాయి ఏ విధంగా మోసపోయాడు.ఆ తరువాత ఆ అబ్బాయి జీవితం  ఏమైంది అనేదే చిత్ర కథాంశం.చెప్పారు నిర్మాత కండ్రేగుల ఆదినారాయణ మాట్లాడుతూ.. నిర్మాతగా నాకిది 5 వ సినిమా అలాగే నేను 94 సినిమాలకు ప,పంపిణీ చేశాను  ఈ "మిస్టర్ లోన్లీ"  సినిమా మూడు స్టేజస్ లలో జరిగే లవ్ స్టొరీ. స్కూల్ ఏజ్ , కాలేజ్ ఏజ్, కాలేజ్ తరువాత ఇలా మూడు ఏజెస్ లలో ఈ సినిమా కథ నడుస్తుంది. ఇలా మూడు స్టేజ్ లలోను అబ్బాయిలు ప్రేమలో మోపపోవడ...
  ఎర్ర చీర మూవీ లో శృంగార గీతం తొలి తొలి ముద్దు !  
Image
 ముద్దులో ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసా ? ఎర్ర చీర చిత్రం నుండి తొలి తొలి ముద్దు ను ఆవిష్కరించిన  దర్శకుడు మారుతి !   డాక్టర్ రాజేంద్రప్రసాద్ ప్రధానపాత్రలో శ్రీ సుమన్ వేంకటాద్రి ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుమన్ బాబు, కారుణ్య చౌదరి జంటగా  శ్రీరామ్, కమల్ కామరాజు కీలక పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ఎర్రచీర.  ఈ సినిమాలోని తొలి తొలి ముద్దు అనేపాటను  ని  దర్శకుడు మారుతీ సోమవారం రోజున  విడుదల చేశారు  ఈ సందర్బంగా దర్శకుడు మారుతీ మాట్లాడుతూ .. సుమన్ వేంకటాద్రి ప్రొడక్షన్ బ్యానర్ పై తెరకెక్కిన ఎర్రచీర సినిమాలోని తొలి తొలి ముద్దు సాంగ్ ని లాంచ్ చేశాను. ఈ సాంగ్ చాలా బాగుంది. తప్పకుండా ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి సుమన్ గారికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను అన్నారు.  సుమన్ బాబు మాట్లాడుతూ .. ఈ సినిమాలోని తోలి తోలి ముద్దు అనే సాంగ్ ని లాంచ్ చేసిన దర్శకుడు మారుతీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సాంగ్ సినిమాలో చాలా ప్రత్యేకంగా ఉంటుంది.  ప్రమోద్ పులిగిల్ల సంగీతం అందించగా అంజనా సౌమ్య, హేమచంద్ర  ఈ గీతాన్ని ఆలపించారు. ముఖ్యంగా...
Allu Aravind Clarity On Covid-19  
Image
                                               అపోహలు వద్దు టీకానే ముద్దు   ఆదివారం ఉదయం 10 గంటలకు జూబిలీహిల్స్ అపోలో ఆసుపత్రికి వెళ్లి కోవి షీల్డ్  వాక్సినేషన్ రెండవ డోస్ తీసుకున్నాము .  నేను నా భార్య శ్రీమతి ఝాన్సీ రాణి , మా వియ్యంకుడు జాస్తి రాధాకృష్ణ మూర్తి గారు , శ్రీమతి సత్యవతి గారు నలుగురం  వాక్సినేషన్ రెండవ డోస్ తీసుకున్నాము .  మొదటి డోస్ మార్చి 1వ తేదీన కోవి షీల్డ్  టీకా ఇదే ఆసుపత్రిలో తీసుకున్నాము . ఆదివారం కావడం వల్ల  మేము వెళ్ళినప్పుడు పెద్దగా జనం లేరు . 15 నిమిషాల్లోరిజిస్ట్రేషన్ , ఆ వెంటనే టీకా వేశారు . 15 నిమిషాలు అక్కడ హాల్ లో కూర్చున్నాము . మా నలుగురికీ ఎలాంటి అసౌకర్యం కలగలేదు. .  మొదటి సారి కన్నా రెండవసారి మందు డోస్ పెంచారు.  మళ్ళీ కరోనా విజృంభిస్తున్న సమయంలో  ఈ టీకా తీసుకోవడం చాలా అవసరం, అనివార్యం .  అయితే చాలా మందిలో వాక్సినేషన్ గురించి అపోహలు, అనుమానాలు వున్నాయి . వాటిని పక్కన  పక్కన ...
Image
         ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారి అభినందన  భారత ఉప రాష్ట్రపతి  గౌరవనీయులు వెంకయ్య నాయుడు గారిని వారి  నివాసంలో శుక్రవారం రోజు కలుసుకున్నాను .  నేను రచించిన "భారతమెరికా" పుస్తకాన్ని వెంకయ్య నాయుడు గారికి బహుకరించాను. .వెంకయ్య నాయుడు గారితో నాకు పరిచయం వుంది. ఎప్పుడు కలుసుకున్న వారు ఎంతో ఆప్యాయంగా మాట్లాడతారు . అయితే ఈ సమావేశాన్ని మిత్రులు తుమ్మల రంగారావు గారు ఏర్పాటుచేశారు . హైద్రాబాద్ లో వున్న వెంకయ్య నాయుడు గారి నివాసానికి ఉదయం 9. 00 గంటలకు వెళ్ళాను. . ఉప రాష్ట్రపతి ఓ ఎస్ డి విక్రాంత్ గారిని కలవగానే  వారు నన్ను ఆప్యాయంగా రిసీవ్ చేసుకొని ప్రక్క గదిలో కూర్చోపెట్టారు.  కాసేపటికే  వెంకయ్య నాయుడు గారు మేడ పైనుంచి క్రిందికి వచ్చారు.   వారిని చూడగానే నమస్కరించాను . నన్ను చూడగానే "బాగున్నారా ? అంటూ ఆప్యాయంగా పలుకరించారు. నేను వారికి భారతమెరికా పుస్తకాన్ని బహుకరించాను . వారు సంతోషంగా స్వీకరించారు .  భారతమెరికా పుస్తకాన్ని కాసేపు చూశారు .  "అమెరికాలో మీ పర్యటన విశేషాలా ?" అని అడిగారు  " అవును సార్ నేను ...
                              అక్షరాంజలి -  ఒకటి  ఈ సృష్టి ఎంత విచిత్రమైనది  నా దృష్టి ఎంత రమ్యమైనది  నా మానసాకాశంలో  వసంతం రేకులు విప్పుకొంది  నా గుండె తలుపుపై  కోయిల ప్రేమ శబ్దం చేస్తోంది  నాలో రెక్క విప్పుకొని  ప్రణయ నగారా మ్రోగిస్తోంది  నా నరాల్లో వలపు నయాగరా  నా అధరాలపై  సుమ వనాలు  మొలుస్తున్నాయి  నా నయనాల్లోని భావాలు  కొత్త పదాలై , సరికొత్త పథాలై  అవతరిస్తున్నాయి  నా అణువణువులో స్పందన  ప్రేమామృతాన్ని చిలుకుతోంది  ప్రకృతి  పెదవులపై  వయసు వెన్నెల కాస్తోంది  కాలం కన్నుల్లో మనస్సు ప్రతిఫలిస్తోంది                                                - భగీరథ